అన్వేషించండి

ED summons Sanjay Raut: రాజకీయ సమస్యల్లో ఉన్న శివ్‌సేనకు మరో ఝలక్‌- విచారణకు రావాలంటూ ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు

ఓ భూ వివాదంలో విచారణకు హాజరుకావాలంటూ శివ్‌సేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ కోసం రేపు(మంగళవారం) ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకావాలని శివ్‌సేన ఎంపీ సంజయ్ రౌత్ పిలుపు వచ్చింది. పార్టీలో కొనసాగుతున్న తిరుగుబాటు మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత మద్దతు ఇచ్చేవారిలో రౌత్ ఒకరు.

పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో రౌత్‌కు ఈడీ సమన్లు ఇచ్చింది. రేపు విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రౌత్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ ఘటన మహా వికాస్ అఘాడి పాలనపై తీవ్ర ప్రభావం చూపించింది. 

ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని పాత్ర చాల్‌లో రూ. 1,040 కోట్ల ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) మోసంపై శివ్‌సేన ట్రబుల్‌షూటర్, ప్రధాన ప్రతినిధి అయిన సంజయ్‌రౌత్‌పై చర్యకు దారితీసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్ని పరిస్థితులపై ఈయనే దీటుగా స్పందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈడీ సమన్లు రావడం ఆసక్తి నెలకొంది. 

పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసు జారీ చేశారు. దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇంత కీలకమైన అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల్లో తమ పార్టీ ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉందని సంజయ్‌ రౌత్ చెప్పారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి రౌత్ మాట్లాడుతూ... అసోం నుంచి 40 మృతదేహాలు వస్తాయని, వాటిని పోస్ట్‌మార్టం కోసం నేరుగా మార్చురీకి పంపుతామని ఆదివారం చేసిన వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చారు. శాసనసభ్యుల చనిపోయిన మనస్సాక్షి గురించి తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఇప్పుడు వాళ్లంతా సజీవ శవాలని కామెంట్ చేశారు. 

"నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా ఏమీ చేయలేదు. మీ (తిరుగుబాటు ఎమ్మెల్యేలు) మనస్సాక్షి చనిపోయిందని, మీరు సజీవ శవం అని మాత్రమే నేను చెప్పాను" అని శివసేన ప్రధాన ప్రతినిధి సంజయ్‌రౌత్‌ విలేకరులతో అన్నారు.  తిరుగుబాటు ఎమ్మెల్యేలు మహారాష్ట్రకు తిరిగి రావాలని... రాష్ట్ర అసెంబ్లీలోనే అసలు పరీక్ష ఉంటుందని రౌత్ అన్నారు.

తనతో పాటు మరో 15 మంది తిరుగుబాటు శాసనసభ్యులకు డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుపై తిరుగుబాటు ఎమ్మెల్యే షిండే ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఈ చర్య "చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం" అని పేర్కొంటూ, దానిపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget