అన్వేషించండి

ED summons Sanjay Raut: రాజకీయ సమస్యల్లో ఉన్న శివ్‌సేనకు మరో ఝలక్‌- విచారణకు రావాలంటూ ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు

ఓ భూ వివాదంలో విచారణకు హాజరుకావాలంటూ శివ్‌సేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ కోసం రేపు(మంగళవారం) ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకావాలని శివ్‌సేన ఎంపీ సంజయ్ రౌత్ పిలుపు వచ్చింది. పార్టీలో కొనసాగుతున్న తిరుగుబాటు మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత మద్దతు ఇచ్చేవారిలో రౌత్ ఒకరు.

పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో రౌత్‌కు ఈడీ సమన్లు ఇచ్చింది. రేపు విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రౌత్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ ఘటన మహా వికాస్ అఘాడి పాలనపై తీవ్ర ప్రభావం చూపించింది. 

ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని పాత్ర చాల్‌లో రూ. 1,040 కోట్ల ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) మోసంపై శివ్‌సేన ట్రబుల్‌షూటర్, ప్రధాన ప్రతినిధి అయిన సంజయ్‌రౌత్‌పై చర్యకు దారితీసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్ని పరిస్థితులపై ఈయనే దీటుగా స్పందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈడీ సమన్లు రావడం ఆసక్తి నెలకొంది. 

పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసు జారీ చేశారు. దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇంత కీలకమైన అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల్లో తమ పార్టీ ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉందని సంజయ్‌ రౌత్ చెప్పారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి రౌత్ మాట్లాడుతూ... అసోం నుంచి 40 మృతదేహాలు వస్తాయని, వాటిని పోస్ట్‌మార్టం కోసం నేరుగా మార్చురీకి పంపుతామని ఆదివారం చేసిన వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చారు. శాసనసభ్యుల చనిపోయిన మనస్సాక్షి గురించి తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఇప్పుడు వాళ్లంతా సజీవ శవాలని కామెంట్ చేశారు. 

"నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా ఏమీ చేయలేదు. మీ (తిరుగుబాటు ఎమ్మెల్యేలు) మనస్సాక్షి చనిపోయిందని, మీరు సజీవ శవం అని మాత్రమే నేను చెప్పాను" అని శివసేన ప్రధాన ప్రతినిధి సంజయ్‌రౌత్‌ విలేకరులతో అన్నారు.  తిరుగుబాటు ఎమ్మెల్యేలు మహారాష్ట్రకు తిరిగి రావాలని... రాష్ట్ర అసెంబ్లీలోనే అసలు పరీక్ష ఉంటుందని రౌత్ అన్నారు.

తనతో పాటు మరో 15 మంది తిరుగుబాటు శాసనసభ్యులకు డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుపై తిరుగుబాటు ఎమ్మెల్యే షిండే ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఈ చర్య "చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం" అని పేర్కొంటూ, దానిపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ABP India at 2047 Conclave: పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
Breaking News: మళ్లీ ముదిరిన ఉద్రిక్తతలు.. అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు
మళ్లీ ముదిరిన ఉద్రిక్తతలు.. అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు
ABP India At 2047 Conclave: సవాళ్లను అధిగమించి మహాశక్తిగా ఎదిగేందుకు భారత్ అడుగులు- స్వయంసమృద్ధి, సుసంపన్నతే లక్ష్యం: ఏబీపీ నెట్‌వర్క్ సీఈఓ సుమంత దత్తా
సవాళ్లను అధిగమించి మహాశక్తిగా ఎదిగేందుకు భారత్ అడుగులు, అనిశ్చితిలోనూ అద్భుత అవకాశం: ఏబీపీ నెట్‌వర్క్ సీఈఓ సుమంత దత్తా

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Pawan Kalyan Wife: తెలంగాణ ప్రెస్‌మీట్‌ తర్వాత ఫ్యామిలీతో పవన్... సెల్ఫీలు షేర్ చేసిన వైఫ్ అన్నా కొణిదెల
తెలంగాణ ప్రెస్‌మీట్‌ తర్వాత ఫ్యామిలీతో పవన్... సెల్ఫీలు షేర్ చేసిన వైఫ్ అన్నా కొణిదెల
BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Peddi Vs Bollywood Movie: పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
Top 5 SUVs To Drive To Ladakh: కొండ‌లు, గుట్ట‌లు ఎక్కే బెస్ట్ 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కార్ల ఇవే..
కొండ‌లు, గుట్ట‌లు ఎక్కే బెస్ట్ 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కార్ల ఇవే..
Embed widget