అన్వేషించండి

Maharashtra Political Crisis: తమ ప్రాణాలకు ముప్పు ఉందని సుప్రీంకోర్టుకు తెలిపిన రెబల్ ఎమ్మెల్యేలు- అందుకే హైకోర్టుకు వెళ్లలేదని వివరణ

మహారాష్ట్ర పొలిటికల్ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. తమను అనర్హత వేసేందుకు ఇచ్చిన నోటీసు చెల్లదని రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మహారాష్ట్రలో నడుస్తున్న పొలిటికల్ గేమ్‌లో మరో మలుపు తిరిగింది. తమకు ప్రాణ హాని ఉందని రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నారు. నిన్న డిప్యూటీస్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులు చెల్లవంటూ ఏక్‌నాథ్‌ షిండేతోపాటు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టను ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు... నేరుగా తమకు వద్దు రావడానికి కారణమేంటని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఉన్న హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని నిలదీసింది.

సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు ఏక్‌నాథ్‌ షిండేతోపాటు రెబల్ ఎమ్మెల్యేల తరఫున వాదిస్తున్న న్యాయవాది నీరజ్‌ కిషన్ కౌల్‌... వాళ్లకు ప్రాణహాని ఉందని అన్నారు. ఈ ఎమ్మెల్యేలకు బెదిరింపులు వచ్చాయన్నారు. 40 మంది ఎమ్మెల్యేల మృతదేహాలు తిరిగి వస్తాయని కొందరు కామెంట్‌ చేసినట్టు కూడా వెల్లడించారు. ఇప్పటికే తమ ఇళ్లపై దాడులు జరుగుతున్నట్టు షిండే తరపు లాయర్ కౌల్ అన్నారు.

మైనారిటీలో ఉన్న ప్రభుత్వం దమమని నీతి ప్రదర్శిస్తోందని అధికారాన్ని దుర్వినియోగే చేస్తుందని కౌల్‌ వాదించారు. రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేయిస్తోందని అన్నారు. వారి మృతదేహాలు అసోం నుంచి వస్తాయని బహిరంగంగానే హెచ్చరిస్తున్నట్టు పేర్కొన్నారు. ముంబైలో తమ హక్కుల సాధనకు వాతావరణం అనుకూలంగా లేదని వాదించారు. 

ప్రస్తుతం గౌహతిలో ఉన్న శివసేన ఎమ్మెల్యేల ప్రాణాలకు "తీవ్రమైన ముప్పు" ఉందని పేర్కొంటూ ఏక్‌నాథ్ షిండే సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌లో సంజయ్ రౌత్ "మృతదేహాలు" వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. శాసనసభ్యుల మనస్సాక్షిని ఉద్దేశించి ఆ కామెంట్‌ చేశానని.. తన వ్యాఖ్యలపై సంజయ్‌ రౌత్‌ వివరణ ఇచ్చారు. 

55 మంది శివసేన శాసనసభ్యులలో 38 మంది సంకీర్ణానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి మెజారిటీని కోల్పోయిందని నిన్న సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో ఏక్‌నాథ్ షిండే అన్నారు. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కరణను కూడా ఏకనాథ్ షిండే శిబిరం సవాలు చేసింది. తిరుగుబాటుదారులు మిస్టర్ జిర్వాల్‌ను తొలగించే విషయం నిర్ణయించే వరకు శివసేన దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై ఎటువంటి చర్య తీసుకోవద్దని ఆదేశించాలని కోరారు.

మరోవైపు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొమ్మిది మంది తిరుగుబాటు మంత్రుల శాఖలను తొలగించారు. పరిపాలన సౌలభ్యం కోసం తిరుగుబాటు మంత్రుల శాఖలను ఇతర మంత్రులకు అప్పగిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. 

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏకనాథ్ షిండేతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరేతో రెండుసార్లు మాట్లాడి రాష్ట్రంలోని "ఇటీవలి రాజకీయ పరిస్థితుల"పై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు "రాజకీయ గందరగోళానికి" కారణమైనందుకు ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలపై బొంబాయి హైకోర్టులో  PIL దాఖలైంది. తిరుగుబాటు నేతలను రాష్ట్రానికి తిరిగి వచ్చి విధుల్లో చేరేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది.

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేంద్రం వై ప్లస్ భద్రతను కల్పించడంతో మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ గందరగోళానికి బీజేపీ కారణమని సామ్నా పత్రిక విమర్శించింది. 

తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్న లగ్జరీ హోటల్ రాడిసన్ బ్లూ గౌహతి జూన్ 30 వరకు కొత్త బుకింగ్ అభ్యర్థనలను తీసుకోవడం ఆపివేసినట్టు తెలుస్తోంది. లాజిస్టిక్స్‌లో ఉన్న వారికి సహాయం చేయడానికి బిజెపి యువజన విభాగం సభ్యులను షిఫ్ట్‌లలో ఉంచినట్లు సమాచారం.

షిండేతో క్యాంప్‌లో ఉన్న వారిలో కనీసం 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో టచ్‌లో ఉన్నారని సేన వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. వారిలో కొందరు బీజేపీలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
Embed widget