అన్వేషించండి

Maharashtra Political Crisis: తమ ప్రాణాలకు ముప్పు ఉందని సుప్రీంకోర్టుకు తెలిపిన రెబల్ ఎమ్మెల్యేలు- అందుకే హైకోర్టుకు వెళ్లలేదని వివరణ

మహారాష్ట్ర పొలిటికల్ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. తమను అనర్హత వేసేందుకు ఇచ్చిన నోటీసు చెల్లదని రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మహారాష్ట్రలో నడుస్తున్న పొలిటికల్ గేమ్‌లో మరో మలుపు తిరిగింది. తమకు ప్రాణ హాని ఉందని రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నారు. నిన్న డిప్యూటీస్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులు చెల్లవంటూ ఏక్‌నాథ్‌ షిండేతోపాటు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టను ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు... నేరుగా తమకు వద్దు రావడానికి కారణమేంటని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఉన్న హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని నిలదీసింది.

సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు ఏక్‌నాథ్‌ షిండేతోపాటు రెబల్ ఎమ్మెల్యేల తరఫున వాదిస్తున్న న్యాయవాది నీరజ్‌ కిషన్ కౌల్‌... వాళ్లకు ప్రాణహాని ఉందని అన్నారు. ఈ ఎమ్మెల్యేలకు బెదిరింపులు వచ్చాయన్నారు. 40 మంది ఎమ్మెల్యేల మృతదేహాలు తిరిగి వస్తాయని కొందరు కామెంట్‌ చేసినట్టు కూడా వెల్లడించారు. ఇప్పటికే తమ ఇళ్లపై దాడులు జరుగుతున్నట్టు షిండే తరపు లాయర్ కౌల్ అన్నారు.

మైనారిటీలో ఉన్న ప్రభుత్వం దమమని నీతి ప్రదర్శిస్తోందని అధికారాన్ని దుర్వినియోగే చేస్తుందని కౌల్‌ వాదించారు. రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేయిస్తోందని అన్నారు. వారి మృతదేహాలు అసోం నుంచి వస్తాయని బహిరంగంగానే హెచ్చరిస్తున్నట్టు పేర్కొన్నారు. ముంబైలో తమ హక్కుల సాధనకు వాతావరణం అనుకూలంగా లేదని వాదించారు. 

ప్రస్తుతం గౌహతిలో ఉన్న శివసేన ఎమ్మెల్యేల ప్రాణాలకు "తీవ్రమైన ముప్పు" ఉందని పేర్కొంటూ ఏక్‌నాథ్ షిండే సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌లో సంజయ్ రౌత్ "మృతదేహాలు" వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. శాసనసభ్యుల మనస్సాక్షిని ఉద్దేశించి ఆ కామెంట్‌ చేశానని.. తన వ్యాఖ్యలపై సంజయ్‌ రౌత్‌ వివరణ ఇచ్చారు. 

55 మంది శివసేన శాసనసభ్యులలో 38 మంది సంకీర్ణానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి మెజారిటీని కోల్పోయిందని నిన్న సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో ఏక్‌నాథ్ షిండే అన్నారు. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కరణను కూడా ఏకనాథ్ షిండే శిబిరం సవాలు చేసింది. తిరుగుబాటుదారులు మిస్టర్ జిర్వాల్‌ను తొలగించే విషయం నిర్ణయించే వరకు శివసేన దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై ఎటువంటి చర్య తీసుకోవద్దని ఆదేశించాలని కోరారు.

మరోవైపు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొమ్మిది మంది తిరుగుబాటు మంత్రుల శాఖలను తొలగించారు. పరిపాలన సౌలభ్యం కోసం తిరుగుబాటు మంత్రుల శాఖలను ఇతర మంత్రులకు అప్పగిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. 

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏకనాథ్ షిండేతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరేతో రెండుసార్లు మాట్లాడి రాష్ట్రంలోని "ఇటీవలి రాజకీయ పరిస్థితుల"పై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు "రాజకీయ గందరగోళానికి" కారణమైనందుకు ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలపై బొంబాయి హైకోర్టులో  PIL దాఖలైంది. తిరుగుబాటు నేతలను రాష్ట్రానికి తిరిగి వచ్చి విధుల్లో చేరేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది.

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేంద్రం వై ప్లస్ భద్రతను కల్పించడంతో మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ గందరగోళానికి బీజేపీ కారణమని సామ్నా పత్రిక విమర్శించింది. 

తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్న లగ్జరీ హోటల్ రాడిసన్ బ్లూ గౌహతి జూన్ 30 వరకు కొత్త బుకింగ్ అభ్యర్థనలను తీసుకోవడం ఆపివేసినట్టు తెలుస్తోంది. లాజిస్టిక్స్‌లో ఉన్న వారికి సహాయం చేయడానికి బిజెపి యువజన విభాగం సభ్యులను షిఫ్ట్‌లలో ఉంచినట్లు సమాచారం.

షిండేతో క్యాంప్‌లో ఉన్న వారిలో కనీసం 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో టచ్‌లో ఉన్నారని సేన వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. వారిలో కొందరు బీజేపీలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | సంచలన ఛేజింగ్ తో పిచ్చెక్కించిన పంజాబ్ | IPL 2024| ABP DesamBoy Rescued 50 Members in Fire Accident | అగ్నిప్రమాదం నుంచి 50 మందిని కాపాడిన బాలుడు | ABP DesamFire Accident in Alwin Pharmacy Company Rangareddy | రంగారెడ్డిలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం | ABP DesamJamie Lever Interview | Allari Naresh | Aa Okkati Adakku |ఈ వీడియో చూస్తే నవ్వాగదు..

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Anupama Parameswaran: అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
Warangal News: ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
Embed widget