అన్వేషించండి

Maharashtra Political Crisis: తమ ప్రాణాలకు ముప్పు ఉందని సుప్రీంకోర్టుకు తెలిపిన రెబల్ ఎమ్మెల్యేలు- అందుకే హైకోర్టుకు వెళ్లలేదని వివరణ

మహారాష్ట్ర పొలిటికల్ పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. తమను అనర్హత వేసేందుకు ఇచ్చిన నోటీసు చెల్లదని రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మహారాష్ట్రలో నడుస్తున్న పొలిటికల్ గేమ్‌లో మరో మలుపు తిరిగింది. తమకు ప్రాణ హాని ఉందని రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నారు. నిన్న డిప్యూటీస్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులు చెల్లవంటూ ఏక్‌నాథ్‌ షిండేతోపాటు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టను ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు... నేరుగా తమకు వద్దు రావడానికి కారణమేంటని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఉన్న హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని నిలదీసింది.

సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు ఏక్‌నాథ్‌ షిండేతోపాటు రెబల్ ఎమ్మెల్యేల తరఫున వాదిస్తున్న న్యాయవాది నీరజ్‌ కిషన్ కౌల్‌... వాళ్లకు ప్రాణహాని ఉందని అన్నారు. ఈ ఎమ్మెల్యేలకు బెదిరింపులు వచ్చాయన్నారు. 40 మంది ఎమ్మెల్యేల మృతదేహాలు తిరిగి వస్తాయని కొందరు కామెంట్‌ చేసినట్టు కూడా వెల్లడించారు. ఇప్పటికే తమ ఇళ్లపై దాడులు జరుగుతున్నట్టు షిండే తరపు లాయర్ కౌల్ అన్నారు.

మైనారిటీలో ఉన్న ప్రభుత్వం దమమని నీతి ప్రదర్శిస్తోందని అధికారాన్ని దుర్వినియోగే చేస్తుందని కౌల్‌ వాదించారు. రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేయిస్తోందని అన్నారు. వారి మృతదేహాలు అసోం నుంచి వస్తాయని బహిరంగంగానే హెచ్చరిస్తున్నట్టు పేర్కొన్నారు. ముంబైలో తమ హక్కుల సాధనకు వాతావరణం అనుకూలంగా లేదని వాదించారు. 

ప్రస్తుతం గౌహతిలో ఉన్న శివసేన ఎమ్మెల్యేల ప్రాణాలకు "తీవ్రమైన ముప్పు" ఉందని పేర్కొంటూ ఏక్‌నాథ్ షిండే సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌లో సంజయ్ రౌత్ "మృతదేహాలు" వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. శాసనసభ్యుల మనస్సాక్షిని ఉద్దేశించి ఆ కామెంట్‌ చేశానని.. తన వ్యాఖ్యలపై సంజయ్‌ రౌత్‌ వివరణ ఇచ్చారు. 

55 మంది శివసేన శాసనసభ్యులలో 38 మంది సంకీర్ణానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి మెజారిటీని కోల్పోయిందని నిన్న సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో ఏక్‌నాథ్ షిండే అన్నారు. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కరణను కూడా ఏకనాథ్ షిండే శిబిరం సవాలు చేసింది. తిరుగుబాటుదారులు మిస్టర్ జిర్వాల్‌ను తొలగించే విషయం నిర్ణయించే వరకు శివసేన దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై ఎటువంటి చర్య తీసుకోవద్దని ఆదేశించాలని కోరారు.

మరోవైపు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొమ్మిది మంది తిరుగుబాటు మంత్రుల శాఖలను తొలగించారు. పరిపాలన సౌలభ్యం కోసం తిరుగుబాటు మంత్రుల శాఖలను ఇతర మంత్రులకు అప్పగిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. 

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏకనాథ్ షిండేతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరేతో రెండుసార్లు మాట్లాడి రాష్ట్రంలోని "ఇటీవలి రాజకీయ పరిస్థితుల"పై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు "రాజకీయ గందరగోళానికి" కారణమైనందుకు ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలపై బొంబాయి హైకోర్టులో  PIL దాఖలైంది. తిరుగుబాటు నేతలను రాష్ట్రానికి తిరిగి వచ్చి విధుల్లో చేరేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది.

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేంద్రం వై ప్లస్ భద్రతను కల్పించడంతో మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ గందరగోళానికి బీజేపీ కారణమని సామ్నా పత్రిక విమర్శించింది. 

తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్న లగ్జరీ హోటల్ రాడిసన్ బ్లూ గౌహతి జూన్ 30 వరకు కొత్త బుకింగ్ అభ్యర్థనలను తీసుకోవడం ఆపివేసినట్టు తెలుస్తోంది. లాజిస్టిక్స్‌లో ఉన్న వారికి సహాయం చేయడానికి బిజెపి యువజన విభాగం సభ్యులను షిఫ్ట్‌లలో ఉంచినట్లు సమాచారం.

షిండేతో క్యాంప్‌లో ఉన్న వారిలో కనీసం 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో టచ్‌లో ఉన్నారని సేన వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. వారిలో కొందరు బీజేపీలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget