అన్వేషించండి

Jan Aakrosh Yatra: "జన్ ఆక్రోశ్ యాత్ర" రద్దు కాలేదు- కరోనా నిబంధనలతోనే కొనసాగిస్తామన్న బీజేపీ

Jan Aakrosh Yatra: రాజస్థాన్ లోబీజేపీ నేతలు చేస్తున్న జన్ ఆక్రోశ్ యాత్రను కరోనా కారణంగా రద్దు చేస్తున్నట్లు తెలిపిన నాయకులు నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిబంధనలతోనే యాత్ర సాగించనున్నట్లు తెలిపారు. 

Jan Aakrosh Yatra: రాజస్థాన్ లో బీజేపీ నేతలు చేపట్టిన జన్ ఆక్రోశ్ యాత్రను కరోనా కారణంగా రద్దు చేసినట్లు తెలిపిన నాయకులు గంటల వ్యవధిలోనే నిర్ణయాన్ని మార్చుకున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ యాత్రను షెడ్యూల్ ప్రకారం కొనసాగించనున్నట్లు తెలిపారు. రాజస్థాన్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో డిసెంబర్ 1వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ యాత్రను ప్రారంభించారు. రైతుల, పాలనా పరమైన సమస్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జన్ ఆక్రోశ్ పేరుతో సభలు నిర్వహిస్తోంది. 

తాజాగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున యాత్రను రద్దు చేసుకుంటున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గురువారం తెలిపారు. బీజేపీకి ప్రజలే ముఖ్యం అని, ఆ తర్వాతే రాజకీయాలు.. ప్రజల భద్రత వారి ఆరోగ్యమే తమ ప్రాధాన్యం అని వివరించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పునియా మాట్లాడుతూ యాత్రను రద్దే చేయట్లేదని వెల్లడించారు. ఇప్పటి వరకు 41 అసెంబ్లీ నియోజక వర్గాల్లో జన్ ఆక్రోశ్ సభలను నిర్వహించామని, అయితే కోరనా కారణంగా దానిపై ముందు కొంత గందరగోళం నెలకొందని తెలిపారు. కానీ యాత్ర రద్దు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని అన్నారు. అందుకే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జన్ ఆక్రోశ్ సభలను నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. ఈ సభల్లో కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అడ్వైజరీలు వచ్చే వరకు యాత్ర కొనసాగుతుందని అన్నారు. 

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై లేఖ

కరోనా విజృంభిస్తున్న వేళ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ యాత్రలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఇటీవల రాహుల్ గాంధీకి లేఖ పంపారు. యాత్రలో కరోనా నిబంధలు పాటించాలని, లేని పక్షంలో భారత్ జోడో యాత్రను రద్దు చేయాలని కోరారు. ఈ లేఖపై రాహుల్ గాంధీ స్పందించారు. జోడో యాత్రను ఆపడానికి మోదీ సర్కార్‌ సాకులు వెతుకుతుందని రాహుల్ కౌంటర్ ఇచ్చారు.

ఇది వారి (బీజేపీ) కొత్త ఐడియా. 'కొవిడ్ వస్తోంది.. యాత్రను ఆపండి' అని వారు నాకు లేఖ రాశారు. ఈ యాత్రను ఆపడానికి ఇవన్నీ వారు చెప్పే సాకులు. వాళ్లు.. భారత్‌ చెప్పే సత్యానికి భయపడుతున్నారు. " -రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

అలాగే ఇటీవల గుజరాత్‌ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ భారీ రోడ్‌ షోను ప్రస్తావిస్తూ ఆ సమయంలో నిబంధనలు గుర్తుకు రాలేదా అంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ చేపడుతున్న ర్యాలీపై కమలం పార్టీ నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
Kantara Chapter 1 : ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
IPAC Case in High Court: ఐ ప్యాక్‌ కేసుపై కోల్‌కతా హైకోర్టులో గందరగోళం, న్యాయమూర్తి వాకౌట్‌, విచారణ వాయిదా!
ఐ ప్యాక్‌ కేసుపై కోల్‌కతా హైకోర్టులో గందరగోళం, న్యాయమూర్తి వాకౌట్‌, విచారణ వాయిదా!
The Raja Saab: అభిమానులతో ఆటలు... ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇంత దారుణమైన రిలీజా?
అభిమానులతో ఆటలు... ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇంత దారుణమైన రిలీజా?
Natalie Burn : రాకింగ్ స్టార్ యష్‌తో రొమాంటిక్ సీన్ - ఎవరా టాక్సిక్ బ్యూటీ?.. తెగ సెర్చ్ చేసేస్తున్నారు
రాకింగ్ స్టార్ యష్‌తో రొమాంటిక్ సీన్ - ఎవరా టాక్సిక్ బ్యూటీ?.. తెగ సెర్చ్ చేసేస్తున్నారు
Embed widget