అన్వేషించండి

లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై రాహుల్ గాంధీ విమర్శలు, బీజేపీ ఎంపీలు పారిపోయారంటూ సెటైర్లు

పార్లమెంట్ లో ఎంపీలపై బహిష్కరణ వేటును ఇండియా కూటమి నిరసించింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద విపక్షాలు ఆందోళనకు దిగాయి.

Parliament Security Breach : పార్లమెంట్ (Parliament)లో ఎంపీలపై బహిష్కరణ వేటును ఇండియా కూటమి (I.N.D.I.A Alliance)నిరసించింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఢిల్లీ (Delhi )లోని జంతర్ మంతర్ (Jantar Mantar ) వద్ద విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్ సభలో యువత పొగ వెదజల్లిన వెంటనే బీజేపీ ఎంపీలు బయటకు పారిపోయారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. పార్లమెంట్ లోకి యువత ఎందుకు ప్రవేశించారనేది తెలుసుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.  ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ప్రధాన అంశమని తెలిపారు.  దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతోనే యువత పార్లమెంట్ లోకి వచ్చి నిరసనకు దిగారని అన్నారు. ఉపాధి గురించి మాట్లాడని మీడియా, ఎంపీల రక్షణ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ బయట కూర్చుంటే ..తాను వీడియోలు రికార్డు చేయటాన్ని మాత్రం ప్రసారాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు పార్లమెంట్ లో నోటీసులు ఇచ్చినపుడు, కనీసం నోటీసుల్లో ఏముందో చదవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలను సభ నుంచి బహిష్కరించి, బిల్లులను ఏకపక్షంగా ఆమోదింపజేసుకుంటోందని మండిపడ్డారు.  

ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గు-భట్టి విక్రమార్క
పార్లమెంటుపై జరిగిన దాడికి ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పకుండా  ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రశ్నిస్తే కేసులు, పార్లమెంట్ నుంచి బహిష్కరణ వేటు వేయడం, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని విమర్శించారు.  నియంత్రత్వ పోకడలతో మోడీ పాలన సాగుతుందనడానికి ఎంపీల సస్పెన్షనే నిదర్శనమన్నారు భట్టి విక్రమార్క. పార్లమెంట్ పై జరిగిన దాడితో ప్రపంచ దేశాల్లో దేశ విలువ ఎంత దిగజారిందో దేశ ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 140 మందికిపైగా సస్పెండ్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఎన్నికల ముందు దేశ సరిహద్దుల్లో చిన్న చిన్న సంఘటనలు సృష్టించి,  దేశ ప్రజలలో భావోద్వేగాలు రగిలించి, అధికారంలోకి రావడం తప్పా దేశానికి బీజేపీ ఏమీ చేయలేదన్నారు. 

న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉందన్న ప్రహ్లద్ జోషి

సభా కార్యకలాపాలు సక్రమంగా జరగనివ్వకుండా విపక్ష ఎంపీలు అడ్డుకున్నాయన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి. ఎంపీలను సస్పెండ్‌ చేయడం తమ ప్రభుత్వానికి ఇష్టం లేదన్న ఆయన, కొందరిపై వేటు వేసిన తర్వాత మరికొందరు విపక్ష సభ్యులు సస్పెండ్ చేయాలని అభ్యర్థించారని వెల్లడించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన మూడు బిల్లులపై విపక్షాలకు ఏవైనా అభ్యంతరాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉందన్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై దర్యాప్తు కొనసాగుతోందన్న ప్రహ్లాద్ జోషి, నివేదిక వచ్చిన తర్వాత చట్టం తన పని చేసుకుపోతుందని వెల్లడించారు. తమ పార్టీ ఎంపీ ప్రతాప్‌ సింహ స్టేట్ మెంటును రికార్డు చేశామని స్పష్టం చేశారు.

 

 

టాప్ హెడ్ లైన్స్

UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Embed widget