అన్వేషించండి

రాహుల్ మళ్లీ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగు పెడతారా? సుప్రీం తీర్పుతో లైన్ క్లియర్ అయినట్టేనా!

Rahul Gabdhi Membership: సుప్రీంకోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది.

Rahul Defamation Case:


సత్యమేవ జయతే: కాంగ్రెస్ 

పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీ న్యాయ పోరాటం మొత్తానికి ఫలించింది. సుప్రీంకోర్టు స్టే కారణంగా గతంలో ఆయనను దోషిగా తేల్చిన తీర్పు చెల్లకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కాస్త జనాల్లో తరచూ తిరుగుతూ పార్టీ క్యాడర్‌ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీకి ఈ తీర్పు మరింత జోష్ ఇచ్చిందనే చెప్పాలి. పైగా ఈ మధ్యే కర్ణాటకలో బీజేపీపై గెలిచిన ఉత్సాహంతో ఉంది కాంగ్రెస్. కాస్త దృష్టి పెడితో లోక్‌సభ ఎన్నికల్లోనూ గట్టిగానే సీట్లు సంపాదించుకోవచ్చు అన్న ధీమాతో ఉంది. కాకపోతే...రాహుల్ గాంధీ గ్రౌండ్ లెవెల్‌లో ఎంత యాక్టివ్‌గా ఉన్నప్పటికీ ఆయనపై అనర్హతా వేటు పడడం కాంగ్రెస్‌కి సవాలుగా మారింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ లైన్ కూడా క్లియర్ అయినట్టే. సరిగ్గా ఎన్నికల ముందు ఆయనపై ఇలా అనర్హత వేటు పడడం, న్యాయ పోరాటంలో గెలవడం లాంటి పరిణామాలతో ఎంతో కొంత కాంగ్రెస్‌కి కలిసొచ్చే అవకాశాలున్నాయి. అందులోనూ రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా దారి దొరికింది. అందుకే...రాహుల్ ఎంపీ సభ్యత్వం ఎప్పుడు పునరుద్ధరిస్తారన్న ఆసక్తికర చర్చ మొదలైంది ఇండియా కూటమిలో.

ఇదీ ప్రాసెస్..

ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు కాపీని లోక్‌సభ సెక్రటేరియట్‌కి పంపుతారు. ఆ తరవాత స్పీకర్‌ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయడానికి ఆస్కారం ఉండదు. సుప్రీంకోర్టే స్వయంగా కాపీలు పంపింది కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ ఆ కాపీని ఎన్నికల సంఘానికి పంపుతారు. ఇదంతా జరగడానికి కనీసం రెండు మూడు రోజుల సమయం పడుతుంది. అంటే అంతా సవ్యంగా జరిగితే వచ్చే వారం రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రీస్టోర్ చేసే అవకాశాలున్నాయి. అప్పుడే రాహుల్ గాంధీకి పార్లమెంట్‌లో అడుగు పెట్టొచ్చు. 

కాంగ్రెస్ మాత్రం మరో 24 గంటల్లోనే రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది. రాహుల్ ఈ పార్లమెంట్ సమావేశాల్లో కచ్చితంగా పాల్గొనాలని, అందుకు లైన్ క్లియర్ చేసిందని తేల్చి చెబుతోంది. ఈ తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. "ఇది విద్వేషంపై ప్రేమ సాధించిన విజయం" అని పోస్ట్ చేశారు. 

"రాహుల్ గాంధీని దోషిగా చూపించడానికి బీజేపీ నానా కష్టాలు పడింది. కానీ రాహుల్ గాంధీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన తల వంచలేదు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచారు"

- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కూడా స్పందించారు. రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన కుట్ర విఫలమైందని వెల్లడించారు. 

"సత్యమేవ జయతే. రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన కుట్ర భగ్నమైంది. రాహుల్ సాధించిన ఈ విజయం మోదీని గట్టిగా దెబ్బ తీస్తుంది"

- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ

Also Read: రాహుల్‌ గాంధీకి బిగ్ రిలీఫ్- పరువు నష్టం దావా కేసులో సుప్రీంకోర్టు స్టే


 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget