అన్వేషించండి

Parliament Session : ప్రారంభమైన నూతన పార్లమెంటు- ఇక నవ భారత ప్రయాణం ఇక్కడి నుంచి

Parliament Session : కొత్త భవనంలోకి వెళ్లిన వెంటనే జాతీయ గీతం ఆలపించారు. తర్వాత సభ్యులందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు. అనంతరం పార్లమెంటు కార్యకలాపాలను ప్రారంభించారు.

నూతన పార్లమెంటు భవనం ప్రారంభమైంది. ఎంపీలు మంగళవారం పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌ హాల్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నడుచుకుంటూ కొత్త భవనానికి వెళ్లారు. ఉభయ సభలను ఉద్దేశించి మోదీ చేసిన ఉద్విగ్న భరిత ప్రసంగం అనంతరం ఎంపీలందరూ ఉత్సాహంగా నూతన భవనం వైపు అడుగులు వేశారు. ముందు ప్రధాని నడుస్తుండగా.. ఎంపీలు, మంత్రులు భారత్‌ మాతా కీ జై, వందే మాతరం అని నినాదాలు చేస్తూ ఆయన అనుసరించి వెళ్లారు. ఎంపీల నినాదాలతో కొత్త పార్లమెంటు భవనం ప్రాగణమంతా కోలాహలంగా మారింది. సెంట్రల్‌ హాల్‌లో ఉండే రాజ్యాంగ పుస్తకాన్ని కూడా నూతన పార్లమెంటుకు తరలించారు. 

నూతన పార్లమెంటులో ప్రారంభమైన కార్యకలాపాలు

కొత్త భవనంలోకి వెళ్లిన వెంటనే జాతీయ గీతం ఆలపించారు. తర్వాత సభ్యులందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు. అనంతరం పార్లమెంటు కార్యకలాపాలను ప్రారంభించారు. తొలుత స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడారు. కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఆయన పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మకమైన రోజును చూస్తున్నందుకు మనమంతా అదృష్టవంతులమని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

ప్రధాని మోదీ ప్రసంగం..

స్పీకర్‌ మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంటులో తొలి ప్రసంగం చేశారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ నూతన భవనంలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆజాదీ అమృత కాలంలో ఇది ఉషోదయం లాంటిదని అన్నారు. భారతదేశ నూతన భవిష్యత్తుకు నిదర్శనమని తెలిపారు. వినాయకచవితి రోజున కొత్త భవనం ప్రారంభించడం శుభ సూచకమని పేర్కొన్నారు.
అన్ని పార్టీలు గత వైరాన్ని మర్చిపోవాలని మోదీ ఎంపీలకు విజ్ఙప్తి చేశారు. కొత్త భవనంలోకి కొత్త సంకల్పం తీసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అందరం నిరంతరం కృషి చేయాలని మోదీ పేర్కొన్నారు.

చంద్రయాన్‌ 3  విజయవంతమవడం దేశంలోని ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని అన్నారు. జీ20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్‌ అధ్యక్షత వహించడం, విజయవంతంగా సదస్సును నిర్వహించడం పట్ల భారత్‌కు ఎంతో గౌరవం దక్కిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ దేశ ప్రభావం పెరిగిందని, గొప్ప విజయాలు భారత్‌ సాధించగలదని నిరూపించామని పేర్కొన్నారు. ఆధునిక భారతీయతత్వం, ప్రాచీన ప్రజాస్వామ్యాల కలబోతకు చిహ్నంగా ఈరోజు కొత్త పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని అన్నారు.

'దేశానికి సేవ చేయడానికి పార్లమెంటు అత్యున్నత ప్రదేశం. ఈ కొత్త భవనంలో మనం ఏం చేసినా దేశంలోని పౌరులందరికీ అది స్ఫూర్తివంతంగా ఉండాలి. మనం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు గత చేదు అనుభవాల్ని మర్చిపోవాలి. ఈ భవనం కొత్తది. ఇక్కడ ప్రతీదీ కొత్తది. కానీ ఇక్కడ మన వారసత్వపు చిహ్నం ఉంది. అదే నిన్నటిని, నేటిని కలుపుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొత్త ప్రారంభానికి మొదటి సాక్షి, భావి తరాలకు స్ఫూర్తినిచ్చే పవిత్రమైన సెంగోల్‌  ఇది. భారత తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ తాకి సెంగోల్‌ ఇది.' అని మోదీ మాట్లాడారు.

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget