అన్వేషించండి

Ayodhya Ram Mandir: అప్పటివరకూ అయోధ్య రామ మందిరానికి వెళ్లొద్దు: కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సలహా

Refrain From Visiting Ram Mandir in Ayodhya: అయోధ్య రాముడి దర్శనానికి ఇప్పట్లో వెళ్లకూడదని సహచర కేబినెట్ మంత్రులకు ప్రధాని మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాల సమాచారం.

PM Modi Advises Cabinet Ministers to Refrain From Visiting Ram Mandir: న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు కొలువుదీరడంతో 5 శతాబ్ధాల కల నెరవేరింది. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం అభిజీత్ లగ్నంలో బాలరాముడి విగ్రహానికి అయోధ్య ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట చేయడం తెలిసిందే. జన్మభూమిలో రామయ్య కొలువుతీరాడని, అయోధ్య రాముడి దర్శనాలు జనవరి 23న ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ సంఖ్యలో అయోధ్యకు క్యూ కడుతున్నారు. దేశంలో ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో సహచర మంత్రులకు ప్రధాని మోదీ ఓ సలహా ఇచ్చారు. అయోధ్యలో రాముడి దర్శనానికి ఇప్పట్లో వెళ్లకూడదని సహచర కేబినెట్ మంత్రులకు ప్రధాని మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాల సమాచారం. అందుకు గల కారణం సైతం వెల్లడైంది. 

సామాన్య భక్తులు అయోధ్య రామాలయానికి భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారని.. ఈ టైమ్‌లో కేంద్ర మంత్రులు లాంటి వీఐపీలు వెళ్తే ప్రోటోకాల్స్ కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని ప్రధాని మోదీ సూచించారని తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు ఫిబ్రవరి నెల పూర్తయ్యే వరకు అయోధ్య పర్యటనను వాయిదా వేసుకోవాలని.. మార్చి నెల నుంచి రామయ్య దర్శనానికి వెళ్తే బాగుంటుందని, ఆ సమయానికి దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యలో రాముడి దివ్వ స్వరూపాన్ని దర్శించుకుంటారని సహచర కేబినెట్ మంత్రులకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. సామాన్య భక్తులకు దర్శనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ప్రధాని మోదీ భావించారని తెలుస్తోంది. ప్రధాని నిర్ణయంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌లల్లా విగ్రహానికి ‘బాలక్‌ రామ్‌’గా నామకరణం 
అయోధ్యలో నిర్మితమైన రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్‌లల్లా విగ్రహానికి ‘బాలక్‌ రామ్‌’గా(Balak Ram) నామకరణం చేశారు. ఈ విగ్రహంలో రాముడు ఐదేళ్ల బాలుడిని పోలి ఉండటమే కారణమని ఆలయ పూజారి అరుణ్‌ దీక్షిత్‌ తెలిపారు. ఇప్పటివరకూ దాదాపు 50-60 విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠలు నిర్వహించానని, వాటన్నింటిలోకీ ఇదే తనకు అత్యంత ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. రామాయణం, రామచరిత్‌ మానస్‌ లాంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే బాల రాముడి విగ్రహానికి ఆభరణాలను సిద్ధం చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ (RamaJanma Bhoomi Theertha trust) పేర్కొంది.

అయోధ్య ఆలయ సముదాయం వెలుపల, భారీ ప్రదేశంలో మ‌రో ఏడు దేవాలయాలు నిర్మిస్తున్న‌ట్టు రామ‌జ‌న్మ‌భూమి తీర్థ ట్ర‌స్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ తెలిపారు. వీటిని రాముడి జీవితంలో పాలు పంచుకున్న వారికి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. "ఇవి సాధువులైన వాల్మీకి(Valmiki), వశిష్టుడు, విశ్వామిత్రుడు(Viswamitra),  శబ‌రి, రాముడి కోసం తన ప్రాణాలను అర్పించిన పక్షి జటాయువు కోసం నిర్మిస్తున్నాం`` అని చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget