అన్వేషించండి

PM Modi: టార్గెట్ 2024- 430 మంది ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం

ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (NDA)లో 38 పార్టీల ఎంపీలతో మోదీ సమావేశం కానున్నారు.

ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (NDA)లో 38 పార్టీలకు చెందిన 430 మంది ఎంపీలతో మోదీ సమావేశం కానున్నారు. ఈ మేరకు ఎన్డీఏలోని 430 మంది ఎంపీలను బీజేపీ 11 గ్రూపులుగా విభజించింది. రానున్న ఎన్నికల్లో అధికారమే ఎజెండగా ఎన్డీఏ మిత్ర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం, వారిని సమన్వయం చేసుకోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతలు భాగం కానున్నారు. 

జులై 31న జరుగనున్న తొలి సమావేశంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్, బుందేల్‌ఖండ్, బ్రజ్, అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాకు చెందిన 83 మంది ఎంపీలతో కూడిన రెండు బృందాలతో ప్రధాని మోదీ సమావేశమవుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో నడ్డా, గడ్కరీ, రెండో సెషన్‌లో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈ సమావేశాలకు సమన్వయ కర్తలుగా కేంద్ర మంత్రులు సంజీవ్ బలియన్, బీఎల్ వర్మ, ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.  

ఆగస్టు 2న, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి 96 మంది ఎంపీలతో కూడిన మూడు, నాలుగు గ్రూపులు సమావేశాలు నిర్వహించనున్నాయి. కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, మహేంద్ర నాథ్ పాండే, ప్రహ్లాద్ జోషి, మురళీధరన్ ఈ సమావేశాలను సమన్వయకర్తలుగా పని చేస్తారు. .

బీహార్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లకు చెందిన 63 మంది ఎంపీలతో కూడిన ఐదు, ఆరో గ్రూపులతో ఆగస్టు 3న ప్రధాని మోదీ సమావేశం అవుతారు. కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్, అనురాగ్ ఠాకూర్, అజయ్ భట్ ఈ సమావేశాలను సమన్వయం చేస్తారు. 

ఆగస్టు 8న ఉదయం రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాల నుంచి మొత్తం 76 మంది ఎంపీలున్న రెండు గ్రూపులు ప్రధానిని కలవనున్నాయి. సమావేశాలకు కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ కూడా హాజరవుతారని సమాచారం. సమావేశాలను భారతి పవార్, కపిల్ పాటిల్ సమన్వయకర్తలుగా పని చేస్తారు. అదే రోజు సాయంత్రం రాజస్థాన్ నుంచి ఏడు, ఎనిమిదవ గ్రూపుల సమావేశాలను సైతం నిర్వహిస్తారు. ఈ సమావేశాలకు JP నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారు. మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, కైలాష్ చౌదరి సమావేశాలు జరిగేలా సమన్వయం చేస్తారు. ఈ గ్రూపుల్లో రాజస్థాన్‌కు చెందిన 28 మంది ఎంపీలు ఉంటారు. 

ఆగస్టు 9వ తేదీన నడ్డా, గడ్కరీలు పాల్గొనే గుజరాత్, దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యూ ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాలా, దర్శన జర్దోష్ నేతృత్వంలో 35 మంది ఎంపీలు పాల్గొంటారు. అదే రోజు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు పాల్గొనే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. 46 మంది ఎంపీలు పాల్గొనే సమావేశాలను కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రేణుకా సింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

త్రిపురతో పాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే ఎంపీలు ఆగస్టు 9న ప్రధానిని కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలకు నడ్డా, నితిన్ గడ్కరీ హాజరుకానున్నారు. 31 మంది ఎంపీలు పాల్గొనే ఈ సమావేశాలను కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, కిరణ్ రిజిజు నేతృత్వంలో సమావేశాలు జరుగుతాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget