అన్వేషించండి

PM Modi: 'దేశ ప్రజల ప్రేమ నాలో ఉత్సాహాన్ని నింపుతోంది' - నా దేశాన్ని ముక్కలు కానివ్వనన్న ప్రధాని మోదీ

Pm Modi Interview: ప్రజా జీవితానికే అంకితమైన తనలో ప్రజలు అందిస్తోన్న ప్రేమ మరింత ఉత్సాహం నింపుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఏబీపీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ABP Interview With PM Modi: దేశ ప్రజలు అందించిన స్పూర్తి, ప్రేమ తనలో మరింత ఉత్సాహాన్ని నింపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏబీపీకి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు.

1. పదేళ్లుగా ప్రధానమంత్రిగా అధికారం నిర్వర్తించినా కూడా ఇంకా మీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీనికి కారణం ఏమనుకుంటున్నారు.?

పీఎం మోదీ: ప్రజలు, ఆ పరంధాముడి ఆశీర్వాదం. పాలు ఏవి..నీళ్లు ఏవి అనేది ఆ దేవుడికి తెలుసు మన ప్రజలకు తెలుసు. చెడు ఏంటీ మంచి ఏంటీ అనే విచక్షణా జ్ఞానం ప్రజలకు బాగా ఉంటుంది. మనం ఏం పనులు చేస్తున్నామో వాళ్లు గమనిస్తారు దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. రెండో విషయం నాకు ప్రజలు తప్ప ఎవ్వరూ లేరు. ప్రజా జీవితానికి అంకితమైపోయిన నాలో ప్రజలంతా అందిస్తున్న ఈ ప్రేమ మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. 

2. మోదీజీ..ఇప్పటికి నాలుగో దశ వరకూ ఎన్నికలు పూర్తైపోయాయి. మీరు దేశంలో ఎక్కడికి వెళ్లినా రోజుకు ఆరుసభల్లో పాల్గొంటున్నారు. సభలు పూర్తయ్యాక రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మీరు మూడోసారి ఎంపీ అభ్యర్థిగా వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. మీకు ఏమని అనిపిస్తోంది.? 2024 ఎన్నికలు సరికొత్త చరిత్రను సృష్టించనున్నాయా.? మీరు కూడా మూడోసారి ప్రధాని కాబోతున్నారు కదా.?

పీఎం మోదీ: నేను ఏబీపీని నమ్ముతాను. మీరు రోజూ వార్తలను విశ్లేషిస్తున్నారు. మీకు సోర్సులుంటాయి. మీకు సమాచారం ఉంటుంది. మీ విశ్లేషణ  ఎలాగైతే ఉంటుందో దేశ ప్రజలకు అలాంటి విశ్లేషణే ఉంటుంది. ఈ పదేళ్ల కాలంలో ప్రపంచం ముందు మన దేశం ఔన్నత్యాన్ని చాటి చెప్పాం. పదేళ్ల విలువైన కాలం ఇది. 2014లో అంటే మేం అధికారంలోకి రాకముందు ఈ దేశం మొత్తం నిరాశ నిస్పృహల్లో మునిగిపోయి ఉంది. కానీ ఇప్పుడు చూడండి ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మనం ఇక్కడితో ఆగిపోయేవాళ్లం కాదు. ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడే వరకూ మన ప్రయాణం ఆగదని ప్రతీ పౌరుడు భావిస్తున్నాడు. 2047 నాటికి వికసిత భారత్ మన లక్ష్యం. ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా.? ఓ ఏడో ఎనిమిదో తరగతి చదువుకునే పిల్లాడికి జీ20 సదస్సులు అంటే ఏంటో తెలుస్తుంది తెలుసుకుంటాడని. ఆ విధంగా మన దేశ నాగరికతను ముందుకు తీసుకెళ్తున్నాం. 

3. మోదీజీ మీరు అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఆధ్యాత్మిక, ధార్మిక పునరుత్థానం జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ కారిడార్ నిర్మాణం ఇలాంటివి చేశారు. అందుకేనా మిమ్మల్ని విపక్షాలు నేరుగా ఈ ఒక్క అంశంపైనే మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయి.?

పీఎం మోదీ: నేను ఓ రాజకీయ నాయకుడిని. ఓ రాజకీయ నాయకుడు ఆధ్యాత్మిక పునరుత్థానం చేయగలగడని నేను ఎప్పుడూ అనుకోను. ఇదంతా వేల సంవత్సరాలుగా మన బుుషులు, మునులు మనకు అందించిన సంపద. అదే ధర్మం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మధ్యలో కొన్ని వికృత పరిణామాలు మన దేశంలో చోటు చేసుకున్నాయి. వాళ్లొచ్చి మన ఆధ్యాత్మిక శక్తి మీద సంస్కృతి సంప్రదాయాల మీద ఓ ముసుగు పరదా కప్పారు. నేను వచ్చాక జస్ట్ ఆ పరదా తీసేశాను అంతే. ప్రజలు దాన్ని గమనించారు అంతే. రెండోది మనది 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం. ప్రతీ మనిషికి ఓ కోరిక ఉంటుంది. వాళ్ల అమ్మను గంగానదిలో స్నానం కోసం తీసుకువెళ్లాలని.. ఒక్కసారైనా చార్ ధామ్ యాత్ర చేయించాలని ఉంటుంది. ఒకవేళ నాకు ఈ ఆధ్యాత్మిక మార్గంపై అవగాహన లేకపోతే లేదా నేనేదైనా వ్యాపారాత్మక ధోరణిలో ఆలోచనలు చేస్తుంటే.. ఎలా ఉంటుందో ఆలోచించండి. 140 కోట్ల మంది ప్రజలు రేపు ఎక్కడికైనా వెళ్తుంటే అక్కడ వాళ్లకు పరిశుభ్రమైన టాయిలెట్లు అందుబాటులో ఉండాలా వద్దా. ఇంటర్నెట్ సౌకర్యం కావాలా వద్దా రోడ్లు, ట్రాన్స్ పోర్ట్ ఇవన్నీ ఉండాలి కదా. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే చేయాల్సింది కానీ వాళ్లు చేయలేదు. అప్పుడు 25 కోట్ల జనాభానే ఉండేవాళ్లు. వాళ్లు ఇప్పటిలా కాశీని అభివృద్ధి చేసి ఉంటే దాని మీద ఆధారపడిన ఎకానమీ పెరిగేది. వాళ్ల జీవితాలు మారిపోయేవి కానీ చేయలేదు. ఈ రోజు చూడండి అయోధ్య ఎకానమీ ఎలా పెరిగిందో. బద్రీనాథ్, కేదార్ నాథ్, ఉత్తరాఖండ్ వాళ్ల జీవితాలన్నీ ఆధ్యాత్మికతతోనే ముడిపడిపోయి ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఎకానమీ మీద మనసు పెట్టాను. మీరు ఈ విషయాన్ని ఆ దృష్టి నుంచే చూడాలి. 

4. కానీ మీ మీద ప్రతిపక్షాలు మాట్లాడున్నది వేరే కదా.? మీరు మూడోసారి అధికారంలోకి వస్తే పార్లమెంటు ఉండదని.. రాజ్యాంగం మిగలదని. .రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రచారాలు చేస్తున్నారు కదా.. వాటి మీద ఏం మాట్లాడతారు.?

పీఎం మోదీ: నేను 23 ఏళ్లుగా ప్రభుత్వ అధినేతగా ఉన్నాను. ఈ అబద్ధాలు ప్రచారం చేసే బ్యాచ్ అంతా నేను తీసుకున్న ఏ నిర్ణయంపైనైనా సరే ఒక క్లారిటీకి రాలేకపోయారు. నేను తప్పు చేస్తున్నానని కోర్టుల నుంచి వచ్చిన ఆదేశాలు కూడా లేవు. హిందూ ముస్లిం అనే పేర్లను ఓట్ల కోసం వాళ్లు ఎలా వాడుకుంటారో నేను బయటపెట్టాను. వాళ్ల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ను బహిరంగంగా కడిగిపారేశాను. నేను ఈ దేశాన్ని ముక్కలు కానివ్వను. దేశమంతా ఒక్కటిగానే ఉంటుంది. అలాగే ముందుకు తీసుకెళ్తాను.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vantara : వంతారాలో వన్యప్రాణి, వెటర్నరీ విశ్వవిద్యాలయం - అనంత్ అంబానీ నేతృత్వంలో మొట్టమొదటి ఫ్యూచర్ రెడీ ఇనిస్టిట్యూషన్
వంతారాలో వన్యప్రాణి, వెటర్నరీ విశ్వవిద్యాలయం - అనంత్ అంబానీ నేతృత్వంలో మొట్టమొదటి ఫ్యూచర్ రెడీ ఇనిస్టిట్యూషన్
Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
Viral Girl Monalisa: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భర్తపై పోక్సో కేసు - ఇంత ఈజీగా దొరికిపోయాడా?
కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భర్తపై పోక్సో కేసు - ఇంత ఈజీగా దొరికిపోయాడా?
Bengal Assembly Elections: బెంగాల్ ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా మారిన స్టింగ్ ఆపరేషన్ వీడియో - మమతా బెనర్జీ సిక్సర్ కొట్టారా?
బెంగాల్ ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా మారిన స్టింగ్ ఆపరేషన్ వీడియో - మమతా బెనర్జీ సిక్సర్ కొట్టారా?

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS RR Result Update: వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
Islamabad Talks:
"డీల్ కుదరకపోతే దాడులే" ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరిక! ఇస్లామాబాద్‌ చర్చలపై ఉత్కంఠ!
Digital Payments: యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Chiranjeevi : తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Jana Nayagan Leaked : ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget