అన్వేషించండి

PM Modi: 'దేశ ప్రజల ప్రేమ నాలో ఉత్సాహాన్ని నింపుతోంది' - నా దేశాన్ని ముక్కలు కానివ్వనన్న ప్రధాని మోదీ

Pm Modi Interview: ప్రజా జీవితానికే అంకితమైన తనలో ప్రజలు అందిస్తోన్న ప్రేమ మరింత ఉత్సాహం నింపుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఏబీపీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ABP Interview With PM Modi: దేశ ప్రజలు అందించిన స్పూర్తి, ప్రేమ తనలో మరింత ఉత్సాహాన్ని నింపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏబీపీకి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు.

1. పదేళ్లుగా ప్రధానమంత్రిగా అధికారం నిర్వర్తించినా కూడా ఇంకా మీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీనికి కారణం ఏమనుకుంటున్నారు.?

పీఎం మోదీ: ప్రజలు, ఆ పరంధాముడి ఆశీర్వాదం. పాలు ఏవి..నీళ్లు ఏవి అనేది ఆ దేవుడికి తెలుసు మన ప్రజలకు తెలుసు. చెడు ఏంటీ మంచి ఏంటీ అనే విచక్షణా జ్ఞానం ప్రజలకు బాగా ఉంటుంది. మనం ఏం పనులు చేస్తున్నామో వాళ్లు గమనిస్తారు దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. రెండో విషయం నాకు ప్రజలు తప్ప ఎవ్వరూ లేరు. ప్రజా జీవితానికి అంకితమైపోయిన నాలో ప్రజలంతా అందిస్తున్న ఈ ప్రేమ మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. 

2. మోదీజీ..ఇప్పటికి నాలుగో దశ వరకూ ఎన్నికలు పూర్తైపోయాయి. మీరు దేశంలో ఎక్కడికి వెళ్లినా రోజుకు ఆరుసభల్లో పాల్గొంటున్నారు. సభలు పూర్తయ్యాక రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మీరు మూడోసారి ఎంపీ అభ్యర్థిగా వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. మీకు ఏమని అనిపిస్తోంది.? 2024 ఎన్నికలు సరికొత్త చరిత్రను సృష్టించనున్నాయా.? మీరు కూడా మూడోసారి ప్రధాని కాబోతున్నారు కదా.?

పీఎం మోదీ: నేను ఏబీపీని నమ్ముతాను. మీరు రోజూ వార్తలను విశ్లేషిస్తున్నారు. మీకు సోర్సులుంటాయి. మీకు సమాచారం ఉంటుంది. మీ విశ్లేషణ  ఎలాగైతే ఉంటుందో దేశ ప్రజలకు అలాంటి విశ్లేషణే ఉంటుంది. ఈ పదేళ్ల కాలంలో ప్రపంచం ముందు మన దేశం ఔన్నత్యాన్ని చాటి చెప్పాం. పదేళ్ల విలువైన కాలం ఇది. 2014లో అంటే మేం అధికారంలోకి రాకముందు ఈ దేశం మొత్తం నిరాశ నిస్పృహల్లో మునిగిపోయి ఉంది. కానీ ఇప్పుడు చూడండి ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మనం ఇక్కడితో ఆగిపోయేవాళ్లం కాదు. ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడే వరకూ మన ప్రయాణం ఆగదని ప్రతీ పౌరుడు భావిస్తున్నాడు. 2047 నాటికి వికసిత భారత్ మన లక్ష్యం. ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా.? ఓ ఏడో ఎనిమిదో తరగతి చదువుకునే పిల్లాడికి జీ20 సదస్సులు అంటే ఏంటో తెలుస్తుంది తెలుసుకుంటాడని. ఆ విధంగా మన దేశ నాగరికతను ముందుకు తీసుకెళ్తున్నాం. 

3. మోదీజీ మీరు అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఆధ్యాత్మిక, ధార్మిక పునరుత్థానం జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ కారిడార్ నిర్మాణం ఇలాంటివి చేశారు. అందుకేనా మిమ్మల్ని విపక్షాలు నేరుగా ఈ ఒక్క అంశంపైనే మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయి.?

పీఎం మోదీ: నేను ఓ రాజకీయ నాయకుడిని. ఓ రాజకీయ నాయకుడు ఆధ్యాత్మిక పునరుత్థానం చేయగలగడని నేను ఎప్పుడూ అనుకోను. ఇదంతా వేల సంవత్సరాలుగా మన బుుషులు, మునులు మనకు అందించిన సంపద. అదే ధర్మం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మధ్యలో కొన్ని వికృత పరిణామాలు మన దేశంలో చోటు చేసుకున్నాయి. వాళ్లొచ్చి మన ఆధ్యాత్మిక శక్తి మీద సంస్కృతి సంప్రదాయాల మీద ఓ ముసుగు పరదా కప్పారు. నేను వచ్చాక జస్ట్ ఆ పరదా తీసేశాను అంతే. ప్రజలు దాన్ని గమనించారు అంతే. రెండోది మనది 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం. ప్రతీ మనిషికి ఓ కోరిక ఉంటుంది. వాళ్ల అమ్మను గంగానదిలో స్నానం కోసం తీసుకువెళ్లాలని.. ఒక్కసారైనా చార్ ధామ్ యాత్ర చేయించాలని ఉంటుంది. ఒకవేళ నాకు ఈ ఆధ్యాత్మిక మార్గంపై అవగాహన లేకపోతే లేదా నేనేదైనా వ్యాపారాత్మక ధోరణిలో ఆలోచనలు చేస్తుంటే.. ఎలా ఉంటుందో ఆలోచించండి. 140 కోట్ల మంది ప్రజలు రేపు ఎక్కడికైనా వెళ్తుంటే అక్కడ వాళ్లకు పరిశుభ్రమైన టాయిలెట్లు అందుబాటులో ఉండాలా వద్దా. ఇంటర్నెట్ సౌకర్యం కావాలా వద్దా రోడ్లు, ట్రాన్స్ పోర్ట్ ఇవన్నీ ఉండాలి కదా. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే చేయాల్సింది కానీ వాళ్లు చేయలేదు. అప్పుడు 25 కోట్ల జనాభానే ఉండేవాళ్లు. వాళ్లు ఇప్పటిలా కాశీని అభివృద్ధి చేసి ఉంటే దాని మీద ఆధారపడిన ఎకానమీ పెరిగేది. వాళ్ల జీవితాలు మారిపోయేవి కానీ చేయలేదు. ఈ రోజు చూడండి అయోధ్య ఎకానమీ ఎలా పెరిగిందో. బద్రీనాథ్, కేదార్ నాథ్, ఉత్తరాఖండ్ వాళ్ల జీవితాలన్నీ ఆధ్యాత్మికతతోనే ముడిపడిపోయి ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఎకానమీ మీద మనసు పెట్టాను. మీరు ఈ విషయాన్ని ఆ దృష్టి నుంచే చూడాలి. 

4. కానీ మీ మీద ప్రతిపక్షాలు మాట్లాడున్నది వేరే కదా.? మీరు మూడోసారి అధికారంలోకి వస్తే పార్లమెంటు ఉండదని.. రాజ్యాంగం మిగలదని. .రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రచారాలు చేస్తున్నారు కదా.. వాటి మీద ఏం మాట్లాడతారు.?

పీఎం మోదీ: నేను 23 ఏళ్లుగా ప్రభుత్వ అధినేతగా ఉన్నాను. ఈ అబద్ధాలు ప్రచారం చేసే బ్యాచ్ అంతా నేను తీసుకున్న ఏ నిర్ణయంపైనైనా సరే ఒక క్లారిటీకి రాలేకపోయారు. నేను తప్పు చేస్తున్నానని కోర్టుల నుంచి వచ్చిన ఆదేశాలు కూడా లేవు. హిందూ ముస్లిం అనే పేర్లను ఓట్ల కోసం వాళ్లు ఎలా వాడుకుంటారో నేను బయటపెట్టాను. వాళ్ల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ను బహిరంగంగా కడిగిపారేశాను. నేను ఈ దేశాన్ని ముక్కలు కానివ్వను. దేశమంతా ఒక్కటిగానే ఉంటుంది. అలాగే ముందుకు తీసుకెళ్తాను.

టాప్ హెడ్ లైన్స్

Trump Tariffs On India: ఇక భారత్‌పై 100 శాతం టారిఫ్ మోత ! రష్యా ఆంక్షల చట్టానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం
ఇక భారత్‌పై 100 శాతం టారిఫ్ మోత ! రష్యా ఆంక్షల చట్టానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం
TMC symbol frozen : మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
మమతా బెనర్జీకి బిగ్ షాక్ - టిఎంసి పేరు, గుర్తు ఫ్రీజ్! బెంగాల్‌లో శివసేన, ఎన్సీపీ తరహా రాజకీయం జరుగుతుందా?
Sumitra Vs IOC Case: ఉద్యోగం కోసం 38 ఏళ్ల పాటు పోరాడిన మహిళ.. IOC వర్సెస్ సుమిత్ర కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఉద్యోగం కోసం 38 ఏళ్ల పాటు పోరాడిన మహిళ.. IOC వర్సెస్ సుమిత్ర కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
Danam Nagender Disqualification: ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
AP TS Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Team India Selection Controversy:  ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు
ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
Bigg Boss Season 10 Today Sep 19th Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: మానిప్యులేటర్ ఎవరు? పపెట్‌ ఎవరు? ఇంటి మొత్తానికి పనిష్మెంట్స్! ఆ ఇద్దరూ ఆటకి దూరం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: మానిప్యులేటర్ ఎవరు? పపెట్‌ ఎవరు? ఇంటి మొత్తానికి పనిష్మెంట్స్! ఆ ఇద్దరూ ఆటకి దూరం!
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Embed widget