అన్వేషించండి

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

భారత్, అమెరికా మధ్య ఉన్న విశ్వాసంతో కూడా బంధం ప్రపంచానికి చాలా అవసరం అన్నారు ప్రధానమంత్రి మోదీ. ప్రపంచ శాంతి కోసం శక్తివంతమైన భాగస్వాములుగా మారుతామన్నారు.

క్వాడ్ సమ్మిట్ 2022 సందర్భంగా టోక్యోలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంపై ఇరువురు ముఖ్యులు చర్చించారు. యుఎస్ ప్రెసిడెంట్‌తో చాలా సహృద్భావ వాతావరణంలో ఫలవంతమైన చర్చలు విస్తృతంగా జరిగాయని, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణతోపాటు ప్రజల మధ్య సంబంధాలపై చర్చించినట్టు ప్రధాని మోదీ వివరించారు. 

భారత్‌, యుఎస్ మధ్య ఉన్న వ్యూహాత్మక రిలేషన్‌షిప్‌ నిజంగా "విశ్వాసంతో కూడుకున్న భాగస్వామ్యం" అని, ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉపయోగపడేలా "మంచికోసం పని చేసే శక్తి"లా కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

" భద్రత, సహా ఇతర చాలా రంగాల్లో మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం... విశ్వాసంతో మరింత బలపడింది. రెండు దేశాల ప్రజల ఉన్న రిలేషన్ ఆర్థిక సంబంధాన్ని విశిష్టమైనదిగా మార్చేస్తుంది." అని మోదీ పేర్కొన్నారని పీటీఐ తెలిపారు.

ఇరుపక్షాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు విస్తరిస్తున్నాయని.. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని.

"మా మధ్య కుదిరిన భారత్-అమెరికా పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం కచ్చితమైన పురోగతి సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. మేము సాంకేతిక రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకుంటున్నాం. ప్రపంచ సమస్యల పరిష్కారానికి  సమన్వయం మరింత పెంచే దిశగా ఆలోచన చేస్తున్నాం" అని మోదీ అన్నారు.

భారత్‌, అమెరికాది ఒకే ఒకే దృక్పథం: ప్రధాని మోదీ

ఇండో-పసిఫిక్ ప్రాంతం గురించి అమెరికా, భారత్‌ రెండూ ఒకే దృక్పథాన్ని కలిగి ఉన్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ద్వైపాక్షిక స్థాయిలోనే కాకుండా ఇతర భావసారూప్యత కలిగిన దేశాలతో కూడా భాగస్వామ్య విలువలు, ఉమ్మడి ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తున్నాయని మోదీ చెప్పారు.

"నిన్న ప్రకటించిన క్వాడ్, ఐపిఇఎఫ్ (ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ) దీనికి చక్కని ఉదాహరణలు. నేటి చర్చలు ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది" అని మోదీ అన్నారు.

భారత్‌, అమెరికా స్నేహం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి, భూసుస్థిరతకు, మానవజాతి శ్రేయస్సు చాలా ఉపయోగకరం. ఇది మరింత మంచి శక్తిగా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను" అని మోదీ అన్నారు.

ఇరువురు నేతలు అనేక విషయాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం-అమెరికా మధ్య స్నేహాన్ని మరింతగా పెంపొందించే మార్గాల గురించి చర్చించారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

భూమిపైనే అత్యంత బలమైన బంధంగా మారుస్తాం: జో బైడెన్

ప్రధాని మోదీతో తన సమావేశం గురించి మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ... భూమిపై అత్యంత సన్నిహితంగా భారత్‌తో భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి తాను కట్టుబడి ఉన్నానని, రెండు దేశాలు కలిసి చేయగలిగేవి చాలా ఉన్నాయని చెప్పారు.

కరోనా టైంలో టీకా తీసుకొచ్చేందుకు భారత్ చేసిన ప్రయత్నాలను కూడా బిడెన్ ప్రశంసించారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, క్లీన్ ఎనర్జీ కార్యక్రమాలకు మద్దతుగా యుఎస్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం రెండు దేశాలు చేసుకున్న ఒప్పందాన్ని ప్రశంసించారు. ఇండో-యుఎస్ వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్‌ను పునరుద్ధరించడానికి అంగీకారం తెలిపినట్టు అమెరికా అధ్యక్షుడు ధృవీకరించారు.

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర అంశం, దాడి ప్రభావం, మొత్తం ప్రపంచ వ్యవస్థపై దాని ప్రభావం గురించి ఇద్దరు నాయకులు చర్చించారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఈ ప్రతికూల ప్రభావాలను ఎలా తగ్గించాలనే దానిపై అమెరికా-భారత్ సంప్రదింపులు జరుపుతున్నాయని బైడెన్ చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
Viral Video: అన్నా, మా ఆవిడకు మెసేజ్ వెళ్తుంది! టోల్ ప్లాజా వద్ద డ్రైవర్ రిక్వెస్ట్.. వీడియో వైరల్
అన్నా, మా ఆవిడకు మెసేజ్ వెళ్తుంది! టోల్ ప్లాజా వద్ద డ్రైవర్ రిక్వెస్ట్.. వీడియో వైరల్
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Embed widget