అన్వేషించండి

PM Modi: 'పుస్తకాలు కాలిపోవచ్చు కానీ జ్ఞానం కాదు' - నలంద వర్శిటీ కొత్త క్యాంపస్ ప్రారంభంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Nalanda University: బిహార్‌లోని నలంద వర్శిటీ న్యూ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. పుస్తకాలను కాల్చేయవచ్చని.. కానీ జ్ఞానాన్ని కాల్చలేమని కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi Comments In Nalanda University New Campus Inauguration In Bihar: అగ్నిజ్వాలల్లో పుస్తకాలు కాలిపోవచ్చని కానీ జ్ఞానం కాదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.  బిహార్‌లోని రాజ్‌గిర్‌లో బుధవారం నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను (Nalanda University New Campus) ఆయన ప్రారంభించారు. నలంద వర్శిటీ భారతదేశ వారసత్వానికి, సంస్కృతికి చిహ్నమని.. ఈ కొత్త క్యాంపస్ దేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందని అన్నారు. వర్శిటీ పునఃనిర్మాణంలో మన భాగస్వామ్య దేశాలు సైతం పాలు పంచుకున్నాయని.. ఆయా స్నేహపూర్వక దేశాలను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. 'భారతదేశం బలమైన మానవ విలువలపై నిలబడుతుంది. చరిత్రను పునరుద్ధరించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయడం ఎలాగో మనకు తెలుసు. నలంద అంటే ఓ గుర్తింపు, గౌరవం, విలువ, ఓ అమోఘ కథ.. ఈ వర్శిటీ అనంత సత్యానికి నిదర్శనం' అని మోదీ పేర్కొన్నారు.

నూతన క్యాంపస్ ప్రారంభం

బుధవారం ఉదయం నలంద వర్శిటీకి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా పాత వారసత్వాన్ని పరిశీలించారు. అనంతరం కొత్త క్యాంపస్‌కు చేరుకుని అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎన్.జైశంకర్, బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాత్ అర్లేకర్, సీఎం నితీష్ కుమార్, నలంద వర్శిటీ వీసీ అరవింద్ పనగారియా హాజరయ్యారు. అలాగే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, బ్రూనై, భూటాన్, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, సింగపూర్, న్యూజిలాండ్, పోర్చుగల్, శ్రీలంక, వియత్నాం ఇలా మొత్తం 17 దేశాల నుంచి విదేశీ రాయబారులు సైతం పాల్గొన్నారు.

ఇదీ చరిత్ర

పురాతన నలంద విశ్వ విద్యాలయాన్ని ఐదో శతాబ్దంలో స్థాపించారు. అప్పట్లో ఈ వర్శిటీలో ప్రపంచ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. ఈ వర్శిటీ 800 ఏళ్ల పాటు సేవలందించినట్లు నిపుణులు తెలిపారు. అయితే, 12వ శతాబ్దంలో దేశంలోకి వచ్చిన ఆఫ్ఘన్లు ఈ వర్శిటీని కూల్చేశారు. పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్‌లను కాల్చేశారు. 2016లో ఈ ప్రాంతాన్ని వారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ తర్వాత 2017లో వర్శిటీ నిర్మాణ పనులు ప్రారంభించారు.  కొత్త క్యాంపస్‌ను నలంద విశ్వవిద్యాలయ చట్టం, 2010 ద్వారా స్థాపించారు. 

ఇవీ ప్రత్యేకతలు

నలంద వర్శిటీలో 40 తరగతి గదులతో పాటు 2 అకడమిక్ బ్లాకులు ఉన్నాయి. మొత్తం 1900 మంది విద్యార్థులకు సీటింగ్ ఏర్పాటు చేయగా.. 300 సీట్లున్న రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. అలాగే, అంతర్జాతీయ కేంద్రం, యాంపీ థియేటర్ కూడా నిర్మించారు. ఇందులో 2 వేల మంది సీటింగ్ సామర్థ్యం ఉంది. వాటితో పాటు విద్యార్థులకు ఫ్యాకల్టీ క్లబ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో పాటు ఇతర సౌకర్యాలు సైతం ఉన్నాయి. ఈ వర్శిటీని 'NET Zero' క్యాంపస్ అంటారు. పర్యావరణ అనుకూల కార్యకలాపాలు, విద్య ఇక్కడ ఉంటుంది. క్యాంపస్‌లో నీటిని రీసైకిల్ చేయడానికి ఓ ప్లాంట్, 100 ఎకరాల నీటి వనరులతో పాటు పర్యావరణ అనుకూలమైన సకల సౌకర్యాలు ఉన్నాయి. అందుకే ఈ వర్శిటీ అంత ప్రసిద్ధి చెందింది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Wayanad Landslide: వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
Wayanad Landslide: కేరళలోని వయనాడ్‌లో ఆగని విషాదాలు! కొండచరియలు విరిగిపడి మరో ముగ్గురు మృతి! ప్రకృతి బీభత్సానికి కారణమేంటీ?
కేరళలోని వయనాడ్‌లో ఆగని విషాదాలు! కొండచరియలు విరిగిపడి మరో ముగ్గురు మృతి! ప్రకృతి బీభత్సానికి కారణమేంటీ?
Wayanad Tunnel Landslide: వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం - విరిగిపడిన కొండ చరియలు - ఒళ్ల గగుర్పొడిచే దృశ్యాలు
వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం - విరిగిపడిన కొండ చరియలు - ఒళ్ల గగుర్పొడిచే దృశ్యాలు
Breaking News: రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల
రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Embed widget