అన్వేషించండి

PM Modi on Delhi Blast: ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ హెచ్చరిక

Delhi Blast News | ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుపై ప్రధాని మోదీ తొలిసారి మాట్లాడారు. ఎర్రకోట వద్ద హ్యుందాయ్ ఐ20లో పేలుడు సంభవించి 12 మంది మరణించడంపై విచారం వ్యక్తం చేశారు.

థింఫు: ఢిల్లీ కారు పేలుడులో మరణించిన 12 మందికి న్యాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని చాలా తీవ్రంగా పరిగణిస్తోందని, బాధ్యులైన వారందరినీ అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషాద ఘటనపై ప్రధాని మోదీ తొలిసారిగా మాట్లాడారు. ఎర్రకోట సమీపంలో జరిగిన దాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు నిందితుల కుట్రను ఛేదించి, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా భూటాన్ వెళ్లారు. రాజధాని థింఫులో జరిగిన కార్యక్రమంలో  "ఈ రోజు చాలా బాధతో ఇక్కడికి వచ్చాను. నిన్న (సోమవారం) సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన సంఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. బాధితుల కుటుంబాల బాధను అర్థం చేసుకున్నాను. యావత్ దేశం బాధితులకు అండగా నిలుస్తుంది. నిన్న రాత్రి అంతా ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో నేను టచ్‌లో ఉన్నాను. మన ఏజెన్సీలు త్వరలోనే ఈ దాడి కుట్రను ఛేదిస్తాయి. దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధ్యులైన వారందరినీ న్యాయస్థానానికి తీసుకువచ్చి శిక్ష పడేలా చేస్తాం" అని అన్నారు.

సమగ్ర దర్యాప్తు చేసి, వివరాలు వెల్లడిస్తాం.. రాజ్‌నాథ్ సింగ్

ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడుపై అగ్ర దర్యాప్తు సంస్థలు "వేగంగా, సమగ్రంగా" దర్యాప్తు చేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు చెప్పారు. ఆ దాడి వెనుక ఉన్న వారిని అరెస్ట్ చేసి, శిక్షపడేలా చేస్తామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు. మనోహర్ పరికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (MP-IDSA)లో జరిగిన "ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్"లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. 12 మంది మరణానికి కారణమైన పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

"నిన్న ఢిల్లీలో జరిగిన విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఈ సంఘటనపై వేగంగా, వివరంగా విచారణ జరుపుతున్నాయని నేను హామీ ఇస్తున్నాను. త్వరలో దాడికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తాం. ఢిల్లీలో ఈ విషాదానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం" అని అన్నారు.

నవంబర్ 10న సాయంత్రం 6:52 గంటలకు ఎర్రకోట సమీపంలో ఓ హ్యుందాయ్ i20లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలు కార్లు, బైక్స్ ధ్వంసమయ్యాయి. నిన్న 9 మంది చనిపోగా, మంగళవారం మరో ముగ్గురు చనిపోయారు. దాంతో మృతుల సంఖ్య 12కి చేరింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

BJP Annamalai Factor: దక్షిణ భారత్‌లో విస్తరించాలన్న బీజేపీ ప్లాన్‌ను అన్నామలై రాజీనామా  దెబ్బతీసిందా? హిందుత్వ అజెండా ఎక్కడ విఫలమవుతోంది? 
దక్షిణ భారత్‌లో విస్తరించాలన్న బీజేపీ ప్లాన్‌ను అన్నామలై రాజీనామా  దెబ్బతీసిందా? హిందుత్వ అజెండా ఎక్కడ విఫలమవుతోంది? 
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Tamil Nadu BJP: తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget