అన్వేషించండి

PM Modi on Delhi Blast: ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ హెచ్చరిక

Delhi Blast News | ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుపై ప్రధాని మోదీ తొలిసారి మాట్లాడారు. ఎర్రకోట వద్ద హ్యుందాయ్ ఐ20లో పేలుడు సంభవించి 12 మంది మరణించడంపై విచారం వ్యక్తం చేశారు.

థింఫు: ఢిల్లీ కారు పేలుడులో మరణించిన 12 మందికి న్యాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని చాలా తీవ్రంగా పరిగణిస్తోందని, బాధ్యులైన వారందరినీ అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషాద ఘటనపై ప్రధాని మోదీ తొలిసారిగా మాట్లాడారు. ఎర్రకోట సమీపంలో జరిగిన దాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు నిందితుల కుట్రను ఛేదించి, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా భూటాన్ వెళ్లారు. రాజధాని థింఫులో జరిగిన కార్యక్రమంలో  "ఈ రోజు చాలా బాధతో ఇక్కడికి వచ్చాను. నిన్న (సోమవారం) సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన సంఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. బాధితుల కుటుంబాల బాధను అర్థం చేసుకున్నాను. యావత్ దేశం బాధితులకు అండగా నిలుస్తుంది. నిన్న రాత్రి అంతా ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో నేను టచ్‌లో ఉన్నాను. మన ఏజెన్సీలు త్వరలోనే ఈ దాడి కుట్రను ఛేదిస్తాయి. దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధ్యులైన వారందరినీ న్యాయస్థానానికి తీసుకువచ్చి శిక్ష పడేలా చేస్తాం" అని అన్నారు.

సమగ్ర దర్యాప్తు చేసి, వివరాలు వెల్లడిస్తాం.. రాజ్‌నాథ్ సింగ్

ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడుపై అగ్ర దర్యాప్తు సంస్థలు "వేగంగా, సమగ్రంగా" దర్యాప్తు చేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు చెప్పారు. ఆ దాడి వెనుక ఉన్న వారిని అరెస్ట్ చేసి, శిక్షపడేలా చేస్తామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు. మనోహర్ పరికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (MP-IDSA)లో జరిగిన "ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్"లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. 12 మంది మరణానికి కారణమైన పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

"నిన్న ఢిల్లీలో జరిగిన విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఈ సంఘటనపై వేగంగా, వివరంగా విచారణ జరుపుతున్నాయని నేను హామీ ఇస్తున్నాను. త్వరలో దాడికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తాం. ఢిల్లీలో ఈ విషాదానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం" అని అన్నారు.

నవంబర్ 10న సాయంత్రం 6:52 గంటలకు ఎర్రకోట సమీపంలో ఓ హ్యుందాయ్ i20లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలు కార్లు, బైక్స్ ధ్వంసమయ్యాయి. నిన్న 9 మంది చనిపోగా, మంగళవారం మరో ముగ్గురు చనిపోయారు. దాంతో మృతుల సంఖ్య 12కి చేరింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Advertisement

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
Best Foods to Eat Raw : ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
Embed widget