అన్వేషించండి

PM Modi On Trump Tariffs : ఒత్తిడి ఉంటుంది, తట్టుకొని నిలబడాలి!- ట్రంప్‌ టారిఫ్‌పై ప్రధాని మోదీ సంచలన ప్రకటన

PM Modi On Trump Tariffs : మోదీ ట్రంప్ సుంకంపై స్పందించారు. రైతులు, పశువుల సంక్షేమం ముఖ్యమన్నారు. విదేశీ వస్తువుల అమ్మకం మానుకోవాలని వ్యాపారులకు పిలుపునిచ్చారు.

PM Modi  On Trump Tariffs : భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు టారిఫ్స్‌ బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ టైంలో ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లో పర్యటించిన మోదీ స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయని దీంతో మనంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని అన్నారు. అయినా ప్రజల కోసం కచ్చితంగా దాన్ని భరించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. 

అహ్మదాబాద్‌లోని ఖోడల్‌ధామ్ మైదానంలో రూ. 5,400 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను  ప్రధానమంత్రి మోదీ ప్రారంభంచారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ ట్రంప్ సుంకాలపై ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రపంచంలో ఆర్థిక స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రతి ఒక్కరూ తమ స్వలాభం కోసం చూస్తున్నారని, మనం దానిని స్పష్టంగా చూస్తున్నామని ఆయన అన్నారు.

'ఎంత ఒత్తిడి వచ్చినా, మన బలాన్ని పెంచుకుంటాం'

దేశంలోని రైతులు, పశుపోషకుల సంక్షేమమే తమకు అత్యంత ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. "నేను నా చిన్న వ్యాపారవేత్తలు, చిన్న దుకాణదారులు, రైతులు, పశుపోషకులకు చెబుతున్నాను, నేను గాంధీ నడయాడిన నేల నుంచి  మాట్లాడుతున్నాను, నా దేశంలోని చిన్న వ్యాపారవేత్తలు, రైతులు, పశుపోషకులు, మీ సంక్షేమం మోదీకి అత్యంత ముఖ్యమైనది. నా ప్రభుత్వం చిన్న వ్యాపారవేత్తలు, రైతులు, పశుపోషకులకు ఎప్పుడూ అన్యాయం జరగనివ్వదు. ఎంత ఒత్తిడి వచ్చినా, మేము దానిని తట్టుకునే శక్తిని పెంచుకుంటాము" అని ఆయన అన్నారు.

విదేశీ వస్తువులు ఎక్కువ ప్రోత్సహించొద్దని ప్రధాని పిలుపు

దేశ ప్రజలు భారతదేశంలో తయారైన వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. అలంకరణ వస్తువులు లేదా బహుమతులు అయినా, మన దేశంలో తయారైన వస్తువులను కొనాలని ఆయన అన్నారు. విదేశీ వస్తువులను అమ్మకుండా ఉండాలని ప్రధాని వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "మా ప్రభుత్వం GST సంస్కరణలు చేస్తోంది. దీపావళికి ముందు మీకు పెద్ద బహుమతి లభిస్తుంది. GST సంస్కరణల కారణంగా, మా చిన్న పరిశ్రమలకు చాలా సహాయం అందుతుంది. చాలా వస్తువులపై పన్ను తగ్గుతుంది. ఈ దీపావళికి వ్యాపార వర్గం లేదా మా కుటుంబ సభ్యులైనా అందరికీ రెట్టింపు బోనస్ లభించనుంది" అని అన్నారు.

'భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ప్రపంచం చూసింది'

ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ మాట్లాడుతూ, "పహల్గామ్‌పై దాడికి భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుందో ప్రపంచం చూసింది. కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాం. ఆపరేషన్ సిందూర్‌ మన సైన్యం శౌర్యానికి ప్రతీకగా నిలిచింది. భారతదేశపు సంకల్పానికి చిహ్నంగా మారింది. గతంలో కూడా చాలా సార్లు వారు మన రక్తం కళ్లజూశారు, కాని అప్పట్లో ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, కాని నేడు ఉగ్రవాదులను, వారి సూత్రధారులను మేము వదిలిపెట్టం, వారు ఎక్కడ దాక్కున్నా సరే పట్టుకుంటాం" అని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget