అన్వేషించండి

Parliament Day-1: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల తొలిరోజు కీలక ఘట్టం- పాత భవనానికి వీడ్కోలు

MPs Bid Farewell To Old Building: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మొదటిరోజు కీలక చర్చ జరిగింది. ఆ తర్వాత పాత భవనానికి వీడ్కోలు పలికారు. రేపటి నుంచి కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి.

Parliament Special Session Day-1:

అమృత్‌కాల్‌ సమయంలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు అంటూ కేంద్రం ప్రకటించినప్పటి నుంచి... ఆ సమావేశాలపై చర్చ జరుగుతూ ఉంది. ఐదు రోజులపాటు జరగనున్న  ఈ ప్రత్యేక సెషన్స్‌లో మొదటి రోజు సమావేశాలు పాత పార్లమెంట్‌ భవన్‌లోనే జరిగాయి. 75ఏళ్ల పార్లమెంటు ప్రయాణం- విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలపై  చర్చ జరిగింది. ఆ తర్వాత పాత భవనానికి వీడ్కోలు పలికారు. రేపటి నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి. 

మొదటి రోజు సమావేశాల్లో... ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు మిగిలిన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ఒక ప్యానెల్ ఏర్పాటు కోసం బిల్లు ప్రవేశపెట్టారు. కానీ..  ప్రతిపక్షాలు ఆ బిల్లును ప్రతిఘటించాయి. దీంతో బిల్లును శాసన వ్యవహారాల జాబితా నుంచి తొలగించారు. ఇక... లోక్‌సభ, రాజ్యసభలో సెషన్ యొక్క లెజిస్లేటివ్ బిజినెస్  కింద జాబితా చేయబడిన ఇతర బిల్లుల్లో ది అడ్వకేట్స్ సవరణ బిల్లు-2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, పోస్ట్ ఆఫీస్ బిల్లు-2023 ఉన్నాయి.

ప్రత్యేక సమావేశాల తొలిరోజు... పార్లమెంట్ భవనంలో చివరి ప్రసంగం చేశారు ప్రధాని మోడీ. పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ భవనం  గొప్ప చరిత్రను ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. స్వాతంత్ర్యం తర్వాత ఇది సంసద్ భవన్,  భారత పార్లమెంటుగా మారింది. ఈ భవనాన్ని నిర్మించాలని బ్రిటీష్ పాలకులు నిర్ణయం తీసుకున్నది వాస్తవమే అయినా... దీన్ని కట్టడానికి పడిన శ్రమ, డబ్బు భారతదేశ  వాసులదేనని మనం ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. ఆ నిజాన్ని గర్వంగా చెప్పుకోవాలన్నారు ప్రధాని. 

రేపటి నుంచి కొత్త పార్లమెంట్‌ భవనంలో సమావేశాలు జరగనున్న తరుణంలో పాత పార్లమెంట్‌ భవనాన్ని ఏం చేస్తారనే చర్చ మొదలైంది. ఆ భవనాన్ని కూల్చేస్తారా అంటూ  చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కొంత మంది పాత పార్లమెంట్‌ భవనం విశిష్టత గురించి చర్చించుకుంటున్నారు. 1927లో పూర్తయిన పార్లమెంట్‌ భవనం 96ఏళ్ల పాటు  సేవలందించింది. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు సాక్ష్యంగా నిలిచింది. ఎన్నో చట్టాలు ఈ భవనంలో రూపొందాయి. 

కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ ఏడాది మేలో ప్రధాని ప్రారంభించారు. ఈ భారీ భవనం లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది సభ్యులు, రాజ్యసభ ఛాంబర్‌లో 300 మంది సభ్యులు  సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 12వందల 80 మంది ఎంపీలకు లోక్‌సభ ఛాంబర్‌లో వసతి కల్పించారు. త్రిభుజాకారంలో నాలుగు  అంతస్తుల భవనం 64వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. దీనికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అవి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్. వీఐపీలు,  ఎంపీలు, సందర్శకులకు ప్రత్యేక ప్రవేశాల ద్వారాలు ఉన్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.