News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

No-Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై 17 గంటల చర్చకు ఆమోదం, ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు?

No-Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై 17 గంటల పాటు పార్లమెంట్‌లో చర్చ జరగనుంది.

FOLLOW US: 
Share:

No-Confidence Motion:

అవిశ్వాస తీర్మానంపై చర్చకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంగీకరించింది. 17 గంటల పాటు చర్చించేందుకు అనుమతినిచ్చింది. ఈ తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10వ తేదీన స్పందించనున్నారు. ఆగస్టు 8,9వ తేదీల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఆగస్టు 10న దీనిపై ప్రధాని మోదీ బదులిస్తారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ చర్చించాల్సిందే అని పట్టుపడుతున్నాయి విపక్షాలు. దీనిపై కేంద్రం సరిగా స్పందించడం లేదని భావించిన ఆ పార్టీలు మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌తో పాటు బీఆర్ఎస్ ఎంపీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి దీనిపై చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ఆమోదం తెలిపిన లోక్‌సభ స్పీకర్...17 గంటల పాటు చర్చించేందుకు అంగీకరించారు. వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి మణిపూర్‌ అల్లర్ల అంశంపైనే పార్లమెంట్‌లో మారుమోగుతోంది. 

సుప్రీంకోర్టు విచారణ...

మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బాధిత మహిళల తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించగా..కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ వాదించారు. ఈ కేసుని సీబీఐ విచారించాలన్న కేంద్రం అభిప్రాయాన్ని బాధితులు అంగీకరించడం లేదని కపిల్ సిబాల్ కోర్టుకి వెల్లడించారు. అదే సమయంలో అసోం రాష్ట్రానికి కేసు బదిలీ చేయాలన్న విషయంలోనూ వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. దీనిపై సొలిసిటర్ జనరల్ స్పందించారు. అసోంకి కేసుని బదిలీ చేయాలని తాము చెప్పలేదని, కేవలం వేరే రాష్ట్రం అని మాత్రమే ప్రస్తావించామని తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం కేంద్రానికి పలు ప్రశ్నలు వేసింది. మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని FIRలు నమోదు చేశారో చెప్పాలని ఆదేశించింది. అసలు ఈ వీడియో బయటకు వచ్చేంత వరకూ ఏం చేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కమిటీలో మాజీ మహిళా న్యాయమూర్తులు ఉంటారని ధర్మాసనం స్పష్టం చేసింది. వీడియో బయటకు వచ్చి 14 రోజులవుతోందని, ఇప్పటి వరకూ పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. దీనిపై పూర్తిస్థాయిలో ఓ రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించింది.

మైతేయిల పిటిషన్ తిరస్కరణ..

మణిపూర్‌ హింసాకాండపై సిట్‌ని ఏర్పాటు చేసి విచారించాలన్న మైతేయిల పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేవలం ఓ వర్గాన్ని దోషిగా చూపించే పిటిషన్‌లను విచారించలేమని తేల్చి చెప్పింది. ఈ అల్లర్లతో పాటు నార్కో టెర్రరిజం, గసగసాల సాగుపైనా విచారణ జరపాలని పిటిషన్‌లో కోరారు మైతేయి తరపున పిటిషన్ వేసిన న్యాయవాది. అయితే సుప్రీంకోర్టు మాత్రం మరింత కచ్చితమైన అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించాలని, కేవలం ఓ కమ్యూనిటీని తప్పుపట్టడం సరికాదని స్పష్టం చేసింది. మైతేయిల తరపున పిటిషన్ వేసిన సీనియర్ అడ్వకేట్ మాధవి దివాన్‌ని...ఉపసంహరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

Also Read: M Karunanidhi: తమిళనాడు సీఎంకు సుప్రీం కోర్టులో ఊరట-మెరినా బీచ్‌లో కరుణానిధి స్మారక చిహ్నం పెన్‌ నిర్మాణానికి అనుమతి

Published at : 02 Aug 2023 12:35 PM (IST) Tags: Parliament Monsoon Session No Confidence Motion Manipur Violence Manipur Issue

ఇవి కూడా చూడండి

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Rahul Gandhi: నిన్న రైల్వే కూలీగా, నేడు కార్పెంటర్‌గా రాహుల్ గాంధీ - రంపం చేతబట్టి, కార్మికులతో ముచ్చట్లు

Rahul Gandhi: నిన్న రైల్వే కూలీగా, నేడు కార్పెంటర్‌గా రాహుల్ గాంధీ - రంపం చేతబట్టి, కార్మికులతో ముచ్చట్లు

మొబైల్‌లో మునిగిపోయిన డ్రైవర్, ప్లాట్‌ఫామ్‌ పైకి ఎక్కిన ట్రైన్ - ఐదుగురు సస్పెండ్

మొబైల్‌లో మునిగిపోయిన డ్రైవర్, ప్లాట్‌ఫామ్‌ పైకి ఎక్కిన ట్రైన్ - ఐదుగురు సస్పెండ్

కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసిన ఇండియన్ హ్యాకర్స్! మరింత పెరిగిన ఉద్రిక్తతలు

కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసిన ఇండియన్ హ్యాకర్స్! మరింత పెరిగిన ఉద్రిక్తతలు

భారత్‌కి తొలి ప్రధాని నెహ్రూ కాదు సుభాష్ చంద్రబోస్ - బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

భారత్‌కి తొలి ప్రధాని నెహ్రూ కాదు సుభాష్ చంద్రబోస్ - బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది