అన్వేషించండి

India Airstrikes Pakistan: కసబ్, డేవిడ్ హెడ్లీ ట్రైనింగ్ తీసుకున్న బేస్ క్యాంపులు బద్దలయ్యాయి- కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్

భారత సైన్యం కల్నల్ సోఫియా ఖురేషి, ఐఏఎఫ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ 'సింధూర్' ఆపరేషన్ లోని చేపట్టిన తొలి దాడి గురించి మీడియాకు వివరాలు వెల్లడించారు.

Operation Sindoor | న్యూఢిల్లీ: పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీఓజేకే) లోని ఉగ్రవాదుల స్థావరాలపై జరిగిన దాడులను ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైన్యం చేపట్టినట్లు కల్నల్ సోఫియా కురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో కలిసి సోషియా ఖురేషీ, వ్యోమికా సింగ్ మీడియా సమావేశంలో పాల్గొని ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించారు. ఈ వివరాలు తెలియజేయడానికి ముందు ఉన్నస్థాయి సమావేశం జరిగింది.

ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. పాకిస్తాన్, పీఓకేలోని ఇతర ప్రాంతాలలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసినట్లు వీడియో ఆధారాలు ప్రదర్శించారు. ఆన్‌బోర్డ్ టార్గెటింగ్ సిస్టమ్స్, డ్రోన్‌ల ద్వారా సేకరించిన ఫుటేజ్ లతొ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థలకు అనుసంధానంగా ఉన్న శిబిరాలు సహా కీలక ఉగ్రవాద స్థావరాలపై ప్రత్యక్షంగా దాడులు చేసినట్లు నిర్ధారించారు.


India Airstrikes Pakistan: కసబ్, డేవిడ్ హెడ్లీ ట్రైనింగ్ తీసుకున్న బేస్ క్యాంపులు బద్దలయ్యాయి- కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
ఇంటెలిజెన్స్ సాయంతో మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి, వాటిలో తొమ్మిదింటిని లక్ష్య్ంగా చేసుకుని దాడులు చేశాం. మంగళవారం అర్ధరాత్రి 1.05 నుంచి 1.30 గంటల మధ్య ఆపరేషన్‌ సిందూర్ నిర్వహించాం. భారత్‌ టార్గెట్‌ చేసిన ఉగ్రవాదుల స్థావరాలలో 2008లో ముంబయి దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ తీసుకున్న శిబిరం ఉందని కర్నల్‌ సోఫియా ఖురేషి తెలిపారు. ఇది లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలోని లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరం అని తెలిపారు.

వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సిందూర్ ముఖ్య ఉద్దేశాన్ని వెల్లడించారు. "పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టింది. 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టి విజయవంతంగా ధ్వంసం చేశాం. పాక్ ప్రజలు, పాక్ ఆర్మీకి ఎలాంటి నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలను ఎంచుకున్నామని వ్యోమికా సింగ్ తెలిపారు.

ఆపరేషన్ సింధూర్: ఉగ్రవాద స్థావరాలపై దాడులు

పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున జైషే మహ్మద్ (జెఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసింది. ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ టూరిస్ట్ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దాంతో భారత ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాడుదల స్థావరాల సమచారాన్ని పక్కాగా సేకరించి దాడికి ప్లాన్ చేశాం.

భారత బలగాలు బహావల్‌పూర్, సియాల్‌కోట్, భింబర్, మురిడ్కే, తెహ్రా కలాన్, కోట్లి, ముజఫరాబాద్‌లలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. జెఎం, ఎల్‌ఈటీతో పాటు హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణ శిబిరాలు, వాటి ఆపరేషనల్ బేస్‌లు ఉన్న ప్రాంతాలపై సైతం సైన్యం మెరుపు దాడి చేసి నాశనం చేసింది. అర్థరాత్రి సరిగ్గా 1.44 గంటలకు ఈ వైమానిక దాడులు పూర్తయ్యాయని, కేవలం 23 నిమిషాల వ్యవధిలో నే ఆపరేషన్ పూర్తి చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

 

రక్షణ మంత్రిత్వ శాఖ పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఈ చర్యలు తీసుకుందని.. అయితే ఎలాంటి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలు, పౌక్ పౌరుల జోలికి వెళ్లలేదని స్పష్టం చేసింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget