అన్వేషించండి

Odisha train accident: ప్రమాదానికి కారణం సిగ్నల్‌ ఫెయిల్యూర్ కాదు, లూప్‌లైన్‌లోకి వెళ్లడమే మిస్టరీ - సీనియర్ అధికారి

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నల్ ఫెయిల్యూర్ కారణం కాకపోవచ్చని ఓ సీనయర్ ఇంజనీర్ అన్నారు.

Odisha train accident: 


సీనియర్ రైల్వే ఇంజనీర్ కామెంట్స్..

ఒడిశా రైలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇప్పటికే చాలా వాదనలు వినిపించాయి. "కారణమేంటో గుర్తించాం" అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కానీ...అదేమిటన్నది మాత్రం రివీల్ చేయలేదు. ప్రాథమిక విచారణలో "సిగ్నల్ ఫెయిల్యూర్" అని తేలినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పుడీ వాదననీ కొందరు అధికారులు కొట్టి పారేస్తున్నారు. ఓ సీనియర్ రైల్వే ఇంజినీర్ కీలక విషయాలు చెప్పారు. "జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్‌"ని వివరించారు. మెయిన్‌లైన్‌లో వెళ్లేందుకు మాత్రమే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తేల్చి చెప్పారు. కానీ...లోకోపైలట్ ఉన్నట్టుండి లూప్‌లైన్‌లోకి వెళ్లాడని అంటున్నారు ఆ అధికారి. డేటాలాగర్‌ని పరిశీలించిన తరవాతే ఓ ధ్రువీకరణకు వచ్చినట్టు తెలిపారు. Datalogger అంటే సిగ్నలింగ్ సిస్టమ్‌ని మానిటర్‌ చేసే మైక్రోప్రాసెసర్ బేస్ట్ సిస్టమ్. సిగ్నలింగ్‌కి సంబంధించిన ప్రతి డిటెయిల్‌ ఇందులో రికార్డ్ అవుతుంది. ఇప్పటికే దీనిపై ఓ కమిటీ విచారణ జరుపుతోంది. ఈ కమిటీలో మొత్తం నలుగురు సభ్యులున్నారు. వీరిలో ముగ్గురు "సిగ్నలింగ్ సిస్టమ్ లోపమే" అని చెబుతున్నారు. ఒకరు మాత్రం "ఈ వాదన కరెక్ట్ కాదు" అని అంటున్నారు. Up Loop Lineకి మాత్రమే సిగ్నల్ వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. 

"సిగ్నలింగ్ సిస్టమ్‌లో రెండు సినారియోలు ఉంటాయి. ఒకటి రివర్స్ కండీషన్, మరోటి నార్మల్ కండీషన్. ఓ ట్రైన్‌ లూప్‌లైన్‌లోకి రావాలంటే రివర్స్‌ కండీషన్‌ పెడతారు. మెయిన్‌ లైన్‌కి వెళ్లాలంటే నార్మల్ సిగ్నల్ ఇస్తారు. కానీ...ఇక్కడ జరిగింది వేరు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కి "నార్మల్" సిగ్నల్ ఇచ్చినా లూప్‌లైన్‌లోకి వచ్చింది. లూప్‌లైన్‌లోకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న వాదనలో నిజం లేదు"

- సీనియర్ ఇంజనీర్, రైల్వే 

కరెంట్ షాక్‌తో మృతి..

ఈ ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో కనీసం 40 మంది ప్రయాణికులు కరెంట్ షాక్ వచ్చే చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సిబ్బంది.. బోగీల నుండి మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఓ బోగీలో నుంచి దాదాపు 40 మృతదేహాలను బయటకు తీయగా.. వాటిపై ఎలాంటి గాయాలు అయిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ జరిగినట్లు రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూరు - హావ్ డా ఎక్స్‌ప్రెస్‌ కు.. కోరమాండల్ బోగీలు ఢీకొట్టడంతో ఆ రైలు వెనక ఉన్న పలు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఓవర్ హెడ్ లోటెన్షన్ లైన్ కరెంట్ వైర్లు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో కరెంట్ పాసై విద్యుదాఘాతం జరిగిందని రైల్వే పోలీసు అధికారులు చెబుతున్నారు.

Also Read: Odisha Train Accident: నా బిడ్డ చనిపోయాడనుకుని శవాల మధ్యలో పడేశారు, వెక్కివెక్కి ఏడ్చిన ఓ తండ్రి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Visakhapatanam Crime News: నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Advertisement

వీడియోలు

Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Visakhapatanam Crime News: నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నా మీద జాలి లేదా పట్టించుకోవా! శృతిమించిన లెక్చరర్‌ చాటింగ్- విశాఖ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Konaseema Crime News: కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
కోనసీమలో బాలికలపై స్కూల్ పీఈటీ దారుణం; జనసేనకు లింక్ ఏంటి? షాకింగ్ నిజాలు!
Amalapuram Crime News:వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
వశిష్ట గోదావరిలో డెడ్‌బాడీ- మృతుడి చేతిపై డైరెక్టర్ సుకుమార్ టాటూ!
విస్కీ vs స్కాచ్: రెండింటి మధ్య తేడా తెలుసా? | స్కాచ్ విస్కీ ప్రత్యేకత, తయారీ విధానం, నియమాలు
స్కాచ్ విస్కీకి, మామూలు విస్కీకి మధ్య తేడాలు తెలుసా? స్కాచ్ ఎందుకు అంత ప్రత్యేకమైనది?
Itlu Me Yedhava Trailer : ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...
ఎదవను లవ్ చేసిన అమ్మాయి - టైటిల్ మాత్రమే కాదు... 'ఇట్లు మీ ఎదవ' ట్రైలర్ కూడా డిఫరెంటే...
Embed widget