అన్వేషించండి

Odisha Train Accident: నా బిడ్డ చనిపోయాడనుకుని శవాల మధ్యలో పడేశారు, వెక్కివెక్కి ఏడ్చిన ఓ తండ్రి

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని శవాల మధ్యలో పడేశారు.

Odisha Train Accident: 

శవాల మధ్యలో కొడుకు..

ఒడిశా రైలు ప్రమాద విషాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. రోజుకో కన్నీటి గాథ వినిపిస్తూనే ఉంది. చనిపోయిన వారి మృతదేహాలను వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించడం సవాలుగా మారింది. చాలా ఆసుపత్రుల్లో శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. కొంత మందిని గుర్తించి అప్పగించినా...ఇంకా గుర్తించనివి ఉన్నాయి. హాస్పిటల్స్‌ దగ్గర కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. తమ వాళ్లు ఎక్కడున్నారో వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే గుండెని మెలిపెట్టే సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తన కొడుకుని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్లిన ఓ తండ్రి...అక్కడి పరిస్థితులు చూసి గుండె పగిలిపోయాడు. అన్ని గదుల్లోకి వెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడోనని చాలా సేపు వెతికాడు. చివరకు డెడ్‌బాడీస్ మధ్య కనిపించాడు. అది చూసి చలించిపోయాడు. "బతికున్న నా కొడుకుని శవాల మధ్యలో పడేస్తారా" అని గుక్కపట్టి ఏడ్చాడు. 

"నా కొడుక్కి తీవ్ర గాయమైంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రెస్క్యూ టీమ్ అది గమనించలేదు. చనిపోయాడనుకుని శవాల మధ్యలో పడేశారు. ప్రమాద వార్త వినగానే బయల్దేరి వచ్చాను. మా ఊరు ఇక్కడికి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. వచ్చే సరికి ఆలస్యమైంది. ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి నా కొడుకు కోసం చూస్తూనే ఉన్నాను. ఎక్కడా కనిపించలేదు. ఓ గదికి వెళ్లాను అన్నీ శవాలే ఉన్నాయి. మధ్యలో నా కొడుకు కనిపించాడు. వాడు బతికే ఉన్నాడు. అయినా వాడిని శవాల మధ్యలో పడేశారు. వెంటనే వాడిని ఎత్తుకుని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లిపోయాను. చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మా వాడు కాల్ చేశాడు. బాగా గాయాలయ్యాయని, స్పృహ తప్పుతోందని చెప్పాడు. అప్పటి నుంచి ఏ సమాచారం లేదు. ఇక్కడికి వచ్చాక అతి కష్టం మీద గుర్తించాను"

- బాధితుడి తండ్రి 

మరణాల సంఖ్యపై క్లారిటీ..

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దుర్ఘటనలో మృతుల సంఖ్యపై వివాదం కొనసాగుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం 288 మంది చనిపోయారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జేనా మంగళవారం వెల్లడించారు. మీడియాతో ఒడిశా సీఎస్ మాట్లాడుతూ.. బాలాసోర్ జిల్లా కలెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 288 అని చెప్పారు. ఇందులో ఇప్పటివరకూ 205 మృతదేహాలను తరలించామని ప్రదీప్ జేనా తెలిపారు. కాగా, శనివారం రోజు మధ్యాహ్నం రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య ఇదే సంఖ్య ప్రకటించి, ఆపై 275 అని ఒడిశా సర్కార్ సవరించుకుంది. కానీ మంగళవారం మరోసారి ఒడిశా సీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై స్పష్టత ఇచ్చారు.రైల్వే పోలీసులు, ఎన్టీఆర్ఎఫ్ టీమ్, ఇతర సిబ్బంది సహాయ చర్యలలో పాల్గొని సాధ్యమైనంత త్వరగా బాధితులను ఆసుపత్రులకు తరలించారని అభినందించారు. 

Also Read: Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Embed widget