అన్వేషించండి

Odisha Train Accident: రైలు ప్రమాదానికి అసలు కారణం తెలిసింది, వివరాలు ఏంటో చెప్పిన రైల్వే మంత్రి

Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మూల కారణం తెలిసిందని రైల్వే మంత్రి వెల్లడించారు. వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మూల కారణాన్ని గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం వెల్లడించారు. ప్రమాద స్థలంలో ఉంటూ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి.. రైలు ప్రమాదానికి మూల కారణం తెలిసిందని, రైల్వే భద్రతా కమిషనర్ త్వరలోనే నివేదిక సమర్పించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

'ప్రమాదంపై విచారణ పూర్తయింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ నివేదికను త్వరలోనే అందిస్తారు. ఆ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే ఈ ఘోర ప్రమాదానికి దారి తీసిన మూల కారణాన్ని గుర్తించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. రైల్వే ట్రాక్ పునురద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని మృతదేహాలను గుర్తించి తొలగించాం. బుధవారం ఉదయానికి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయడమే మా లక్ష్యం. ఆ దారిలో రైళ్లు ఎప్పట్లాగా నడవడానికి పరిస్థితులను చక్కదిద్దుతా'మని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 

విస్మయానికి గురిచేసిన ఒడిశా రైలు ప్రమాదం

అత్యంత భయానక రీతిలో జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన జరిగిన తీరు విస్మయం కలిగిస్తోంది. విపరీతమైన బరువుతో ఉండే రైలు పట్టాలు తప్పితే, దాన్ని తిరిగి పట్టాలపైకి ఎక్కించడం మామూలు విషయం కాదు. ఎంతో వ్యయప్రయాసలు పడాలి. అలాంటిది, ఒడిశాలో జరిగిన ప్రమాదంలో రైలు ఇంజిన్ ఏకంగా గూడ్స్ రైలు పైకి ఎక్కేసింది. దాదాపు 15 అడుగులు ఎత్తున ఉండే గూడ్స్ రైలు వ్యాగన్ పైకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొని వెళ్లింది. ప్రమాద స్థలంలో పడిఉన్న బోగీలు, ఇంజిన్ ఉన్న స్థానం చూసి నిపుణులు సైతం విస్మయం చెందుతున్నారు.

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైన సమయంలో దాదాపు 128 కిలో మీటర్ల వేగంతో వెళుతున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. రైలును మెయిన్ లైన్ కాకుండా లూప్‌ లైన్‌కి మళ్లించినప్పుడు వేగం బాగా తగ్గాల్సి ఉంది. కానీ, కోరమాండల్‌ ఎక్స్ ప్రెస్ వేగం ఎందుకు తగ్గలేదనేది ఒక ప్రశ్నగా ఉంది. ఆ వేగంతోనే కోరమాండ్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనక నుంచి బలంగా ఢీకొని రైలింజన్ వ్యాగన్ పైకి ఎక్కేసిందని నిపుణులు భావిస్తున్నారు.

గూడ్స్ రైలులో ఒక్కో ఖాళీ వ్యాగన్‌ 25 - 26 టన్నుల బరువు ఉంటుంది. దాంట్లో నింపే సరకు బరువు ఒక్కో దాంట్లో మరో 54-60 టన్నుల దాకా ఉండొచ్చు. అలాంటి వ్యాగన్ పైకి రైలింజన్ ఎక్కేసింది. 128 కిలో మీటర్ల వేగంతో ఢీకొట్టడం వల్లే కోరమాండల్‌ ఇంజిన్‌ గూడ్సు రైలుపైకి ఎక్కినట్లు నిపుణులు భావిస్తున్నారు.

చనిపోయిన వారి సంఖ్య 288కి

శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కు చేరుకుంది. 56 మంది తీవ్ర గాయాలపాలయ్యారని, మరో 747 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తెలుగువాళ్లే వంద మందికిపైగా ఉన్నారని సమాచారం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chennai Super Kings vs Lucknow Super Giants Highlights | స్టోయినిస్ సూపర్ సెంచరీ..లక్నో ఘన విజయంCM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Embed widget