అన్వేషించండి

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు షురూ- యాక్సిడెంట్‌ స్పాట్‌ను పరిశీలించిన ఎంక్వయిరీ టీం

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు సీబీఐ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Odisha Train Accident:  ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. రైలు ప్రమాదంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. రైలు ప్రమాదంపై విచారణ జరిపేందుకు సీబీఐ అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.

ఒరిస్సాలోని బాలాసోర్ రైలు ప్రమాదం కేసులో రైల్వే యాక్ట్ సెక్షన్ లోని 337, 338, 304ఎ, 34, 153, 154, 175 సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేసింది సిబిఐ. ఈ ఎఫ్ఐఆర్‌లో విధించిన సెక్షన్ల గురించి సిబిఐ కాసేట్లో అధికారిక సమాచారాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది?

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం కోరమండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో పాటు దానిలోని కొన్ని బోగీలు రెండో లైన్ గుండా వెళ్తున్న షాలిమార్ ఎక్స్ ప్రెస్ వెనుక బోగీలను ఢీకొన్నాయి.


ఎంత మంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారు?

ఈ రైలు ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య మొదట 288గా ఒడిశా ప్రభుత్వం తెలిపింది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. తదుపరి పరిశీలన, బాలాసోర్ జిల్లా మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదిక తర్వాత మరణాల సంఖ్యను 275గా మార్చారు. 

క్షతగాత్రులు సోరో, బాలాసోర్, భద్రక్, కటక్‌లో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జెనా తెలిపారు. ఇప్పటివరకు 793 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, 382 మంది ప్రభుత్వ ఖర్చులతో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 88 మృతదేహాలను గుర్తించామని, 78 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని, ఇంకా 187 మందిని గుర్తించాల్సి ఉందన్నారు.

 

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీబీఐ విచారణ ఉత్తర్వులు జారీ చేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. ఇది హెడ్‌లైన్స్‌లో వచ్చేందుకు చేసే ప్రయత్నమే తప్ప వేరేది కాదని  మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఓ టైంటేబుల్‌ని కూడా ఆయన వివరించారు. 2016లో కాన్పూర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఏమీ దొరకలేదని అన్నారు. సీబీఐ విచారణ ప్రకటించక ముందే బాలాసోర్ రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషనర్ తన నివేదికను కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. గడువును చేరుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది హెడ్ లైన్ మేనేజ్ మెంట్ తప్ప మరేమీ కాదన్నారు.

జైరాం రమేష్ ఇంకా ఇలా రాశారు, "ఇప్పుడు ఈ కాలక్రమాన్ని గుర్తుంచుకోండి ...

నవంబర్ 20, 2016: కాన్పూర్ సమీపంలో ఇండోర్-పాట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఫిబ్రవరి 24, 2017: కాన్పూర్ రైలు ప్రమాదం ఒక కుట్ర అని ప్రధాని అన్నారు.

అక్టోబర్ 21, 2017: ఈ కేసులో ఎన్ఐఏ ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయలేదని పత్రికల్లో వచ్చింది. 

జూన్ 6, 2023: కాన్పూర్ రైలు ప్రమాదంపై ఎన్ఐఏ తుది నివేదిక గురించి ఇంకా అధికారిక సమాచారం లేదు. జవాబుదారీతనం లేదు! అని తన ట్విటర్‌లో రాసుకొచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Embed widget