అన్వేషించండి

No Work From Home: కర్ణాటక అధికారులకు వర్క్ ఫ్రం హోం ఉండదు, తేల్చి చెప్పిన సీఎం సిద్ధరామయ్య

No Work From Home: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వర్క్ ఫ్రం హోం ఉండదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.

No Work From Home: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధ సమావేశ మందిరంలో జిల్లా కమిషనర్లు, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వాహణాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా, తాలూకా కేంద్రాల్లోని ప్రభుత్వ అధికారులు అందరూ ఇంటి నుంచి పని చేయకుండా వారి సంబంధిత కార్యాలయాల నుంచి పని చేయడాన్ని ముఖ్యమంత్రి తప్పనిసరి చేశారు. ఇంటి నుంచి పని చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు.

అలాగే ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనంతో ఉంటూ సాధారణ ప్రజలకు కూడా స్పందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, ఎమ్మెల్యేలు లేదా సాధారణ ప్రజలు కోరిన తగిన విధంగా స్పందించాలని నిర్దేశించారు. అధికారులు ఫోన్ కాల్ లకు స్పందించడం లేదని ప్రజలు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు.ముఖ్యమంత్రి కార్యాలయమైనా, మంత్రి, ఎమ్మెల్యే ఆఫీసు నుంచి అయినా లేదా సాధారణ ప్రజల నుంచైనా ఫోన్ కాల్స్ వస్తే స్పందించాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు.

ప్రైవేట్ రుణదాతలు, బ్యాంకులు రైతులను వేధిస్తే సహించేది లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కనీసం 251 రైతు ఆత్మహత్య కేసులు నమోదు అయ్యాయని, వాటిలో 174 పరిష్కరించినట్లు చెప్పారు. మిగిలిన కేసులను వెంటనే పరిష్కరించి పరిహారం పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో జాప్యం జరిగితే సహించేది లేదని, అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. తహసీల్దార్, సబ్ డివిజనల్ అధికారి, జిల్లా కమిషనర్ల కోర్టులకు వచ్చే దరఖాస్తులు ఐదు సంవత్సరాలకు పైగా పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఐదేళ్లు దాటినా కేసు పరిష్కారం కాలేదంటే సరైన చర్యలు తీసుకోవడం లేదని అర్థమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.

న్యాయం ఆలస్యంగా జరిగితే అది జరగనట్లే అనే సూక్తిని ముఖ్యమంత్రి అధికారులు గుర్తు చేశారు. ఎంత ఆలస్యం చేస్తే అవినీతికి అంత ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. జాప్యం కూడా ఒక రకమైన అవినీతేనని సిద్ధరామయ్య అన్నారు. తహసీల్దార్ ఏదైనా దరఖాస్తును మూడు నెలల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. సబ్ డివిజనల్ అధికారులకు వచ్చే అప్పీళ్ల పరిష్కారంలో చాలా జాప్యం జరుగుతోందని చెప్పారు. దీనిని గరిష్ఠంగా 6 నెలల్లో పరిష్కరించాలని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్లు కేసులను ఏడాదిలోగా పరిష్కరించాలని సూచించారు. 

'నేను ముఖ్యమంత్రిని అయ్యాక చాలా జిల్లాల్లో పర్యటించాను. సామాన్యులు వందల సంఖ్యలో వినతులు ఇస్తున్నారు. జిల్లా, తాలూకా స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలతో ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు. మీరు బహిరంగ సభలు నిర్వహించి ఉంటే ఇలా జరిగేది కాదు. తక్షణమే వాటికి పరిష్కారాలు అందించండి' అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

వైద్యులు అందుబాటులో లేకపోవడం, అర్హత కలిగిన వైద్యులకు బదులు పారా మెడికల్ సిబ్బంది మందులు రాసే విధానంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు తమ తమ కేంద్రాల్లోనే ఉంటూ ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలను సమర్థవంతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యులు తమ ప్రధాన కార్యాలయంలో ఉండి ప్రజల సమస్యలపై స్పందించాలని కర్ణాటక సీఎం నిర్దేశించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కృష్ణా జిల్లా గూడూరులో విషాదం- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల ఆత్మహత్య  
కృష్ణా జిల్లా గూడూరులో విషాదం- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళల ఆత్మహత్య  
BAT-BMS Controversy: BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది? 
BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది? 
NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!
Agra Bathroom Murder Case: ఆగ్రాలో భర్తను చంపి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టిన భార్య! 45 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం! 
ఆగ్రాలో భర్తను చంపి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టిన భార్య! 45 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం! 

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
How Car Airbags Work: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
Peddi OTT: పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్... Netflixలో ఈవారమే స్ట్రీమింగ్ - కానీ ట్విస్ట్ ఏమిటంటే?
Chiluka Gorinka: చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
Embed widget