అన్వేషించండి

Mumbai Boat Accident: ముంబయి తీరంలో బోటు ప్రమాదం, 13 మంది మృతి - 101 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్

Mumbai Boat Incident | గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీటిలో మునిగిపోయిన 80 మందిని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రక్షించారు. ఒకరు చనిపోగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Boat sank off the coast of Mumbai | ముంబయి: ముంబయి తీరంలోని బచర్ ఐలాండ్‌లో భారీ పడవ ప్రమాదం చోటుచేసుకుంది. విహార యాత్రలో ఊహించని విషాదం నెలకొంది. నేవీ బోట్, ప్యాసింజర్ బోటును ఢీకొన్న ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో 101 మంది ప్రయాణికులను సిబ్బంది రక్షించారు. రెండు బోట్లు ఢీకొని ప్రయాణికులు నీళ్లల్లో పడిపోయిన వెంటనే భారత కోస్ట్ గార్డ్ రంగంలోకి వంద మందికి ప్రాణాలు కాపాడారు. గల్లంతైన మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వెల్లడించారు. 

నేవీ బోట్, ప్యాసింజర్ బోటును ఢీకొనడంతో బుధవారం మధ్యాహ్నం 3.55 గంటలకు ప్రమాదం జరిగింది. రాత్రి 7.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు 101 మందిని రక్షించగా, మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 10 మంది సాధారణ పౌరులు కాగా, ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. కోస్ట్ గార్డ్స్, మత్స్యకారుల సాయంతో వెంటనే చర్యలు చేపట్టడంతో భారీగా ప్రాణనష్టం జరగకుండా చూడగలిగారు.

13 మంది మృతి, అయిదుగురి పరిస్థితి విషమం

గేట్‌వే ఆఫ్ ఇండియా (Gateway of India) సమీపంలో బోటు బోల్తా పడిన ఘటనపై ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది. బోటులోని సిబ్బందితో సహా మొత్తం వంద మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు తాము 101 మందిని రక్షించగా, మరో ఐదుగురు గల్లంతయ్యారని పేర్కొన్నారు. రక్షించిన వారిలో కొందర్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయిదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ఒక వ్యక్తి మృతి చెందారని బీఎంసీ తెలిపింది. సకాలంలో స్పందించి ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి ప్రాణాలు కాపాడిందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎలిఫెంటా గుహలకు వెళ్తుండగా ప్రమాదం..

‘నీల్‌కమల్‌’ అనే పడవ గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు భారీగా పర్యాటకులను తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ఓ చిన్న పడవ పర్యాటకులు వెళ్తున్న బోట్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. భారత కోస్ట్ గార్డ్స్ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మొదట ఒక మృతదేహాన్ని వెలికి తీయడంతో పాటు దాదాపు 100 మంది టూరిస్టులను రక్షించినట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. తీర ప్రాంతంలో కొన్ని పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని సమాచారం. మత్స్యకారుల సహాయంతో పర్యాటకులను కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొందరు నేవీ సిబ్బంది, సాధారణ పౌరులు మృతి చెందారు.

 

Also Read: Bengalore Drugs Case: నైజీరియన్లకు అలుసు ఇస్తే ఇంతే -బెంగళూరులో చిల్లర కొట్టు పెట్టి మరీ డ్రగ్స్ అమ్మకం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget