అన్వేషించండి

India -Bhutan Railway Lines ఇండియా -భూటాన్ దేశాల మధ్య రెండు రైల్వే మార్గాల ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్. పూర్తయితే అద్భుతమే

India -Bhutan Railway Lines ఇండియా -భూటాన్ దేశాల మధ్య రెండు రైల్వే మార్గాల కు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూర్తయితే అద్భుతమే అంటున్నారు నిపుణులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్-భూటాన్ మధ్య రైల్వే లైన్లు నిర్మాణానికి ఒప్పందం కుదిరింది.
  • కొక్రాఝర్-గెలెఫు, బనర్హత్-సమత్సే రెండు మార్గాలు రూ.4033 కోట్లతో నిర్మించనున్నారు.
  • రవాణా, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఈ ప్రాజెక్ట్ తో మెరుగుపడతాయి.
  • ఈ రైల్వే ప్రాజెక్ట్ రానున్న 4 ఏళ్లలో పూర్తికానుంది.

India -Bhutan Railway Lines ఇప్పటికే కాశ్మీర్‌లో చీనాబ్ నది మీదుగా ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్, మీజోరాంలో తొలి రైల్వేలైన్ వంటి అద్భుతాలను సుసాధ్యం చేసిన ఇండియన్ రైల్వే మరో పెద్ద ప్రాజెక్ట్ చేపట్టింది. ఈసారి ఏకంగా ఇండియా -భూటాన్ దేశాల మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి రెడీ అవుతోంది. ఆ మేరకు రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అసోంలోని కొక్రాఝర్ (kokrajhar ) నుంచి భూటాన్‌లోని గెలెఫు (gelephu ) వరకూ, పశ్చిమ బెంగాల్‌లోని బనర్హత్ (Banarhat ) నుంచి భూటాన్‌లోని సమత్సే (Samtse) వరకూ రెండు లైన్లలో రైల్వే లైన్ నిర్మించబోతోంది ఇండియన్ రైల్వే. దీనివల్ల రెండు దేశాల మధ్య సరు రవాణా, ఆర్ధికపరమైన సంబంధాలే కాకుండా ఇరు దేశాల ప్రజల మధ్య బంధం మరింత పెరుగుతుందని రెండు దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

మొత్తం ఖర్చు రూ.4033 కోట్లు 

ఈ ప్రాజెక్ట్ కు అయ్యే ఖర్చు 4033 కోట్లు గా నిర్ధారించారు. దీనిలో కొక్రాఝర్ (ఇండియా ) నుంచి  గెలెఫు (భూటాన్ ) లైన్ కోసం  3,456 కోట్లు, బనర్హత్ (ఇండియా) నుంచి  సమత్సే (భూటాన్) లైన్ కోసం  577 కోట్లు కేటాయించారు. వీటిలో 'గెలెఫుని అడ్మినిస్ట్రేటివ్ సిటీగా వాల్యూస్ బేస్డ్ అర్బన్ డెవలప్మెంట్ సిటీగా భూటాన్ అభివృద్ధి చేస్తోంది. అలాగే 'సమత్సే ' సిటీని ఇండస్ట్రీయల్ సిటీగా డెవలప్ చేస్తోంది అక్కడి ప్రభుత్వం. భూటాన్ దేశం అభివృద్ధిలోనూ సంస్కృతిలోనూ భారతదేశం పెద్ద పాత్ర పోషిస్తోంది. ఆ దేశ అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలకు ఇండియా ఎంతో సహాయం చేస్తోంది. భూటాన్‌తో 700km పైగానే సరిహద్దు పంచుకుంటున్న భారత్‌తో సంబంధాలు భూటాన్‌కు ఎంతో ముఖ్యం. భూటాన్ దేశ వాణిజ్యం ఇండియన్ పోర్ట్స్ ద్వారానే జరుగుతోంది. దానికి క్రొత్తగా నిర్మిస్తున్న రైల్వే లైన్స్ చాలా ఉపయోగపడతాయని భారతీయ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

India -Bhutan Railway Lines ఇండియా -భూటాన్ దేశాల మధ్య రెండు రైల్వే మార్గాల ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్. పూర్తయితే అద్భుతమే

ఇండియా-భూటాన్ మధ్య ప్రాజెక్టుల కోసం 10,000కోట్లు ఇవ్వనున్న భారత్ 

భారత్‌కు అత్యంత సన్నిహిత దేశాల్లో భూటాన్ చాలా ముఖ్యం. 2024లో భూటాన్ వెళ్ళిన ప్రధాని మోదీ అక్కడి అత్యున్నత పౌరపురస్కారం డ్రుక్ గ్యాల్పో  ( Druk Gyalpo) స్వీకరించారు. అలాగే భూటాన్ రాజు జిగ్మే ఖేశర్ ఇప్పటికే పలుమార్లు భారత్ సందర్శించారు. ఆ పర్యటనల్లో భాగంగా 2024 నుంచి 2029 మధ్య రెండు దేశాల మధ్య నెలకొల్పే ప్రాజెక్ట్‌ల కోసం 10,000 కోట్లు కేటాయిస్తూ భారత ప్రభుత్వం ఒప్పందం చేసింది. అందులో భాగంగా ఈ ఇండియా-భూటాన్ రైల్వే లింక్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆ శాఖ మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఇవిగాక భూటాన్‌లో హైడ్రాలిక్ ప్రాజెక్ట్ సహా పలు పవర్ ప్రాజెక్ట్‌లను భారత్ ఏర్పాటు చేస్తోందని ఫారెన్ సెక్రటరే విక్రమ్ మిశ్రీ తెలిపారు.

India -Bhutan Railway Lines ఇండియా -భూటాన్ దేశాల మధ్య రెండు రైల్వే మార్గాల ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్. పూర్తయితే అద్భుతమే

4 ఏళ్లలో పూర్తి కానున్న ప్రాజెక్ట్ 

ఈ ప్రాజెక్ట్ రానున్న 4 ఏళ్లలో పూర్తి కానుంది. ఈ రెండు రైల్వే లైన్ లు పూర్తయితే వాణిజ్యం, రవాణాతోపాటు టూరిజంపరంగా ఇండియా-భూటాన్. మధ్య సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఇప్పటికే భారత్ తన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌తో రైల్ రూట్ కలిగి ఉన్నప్పటికీ వాటన్నిటి కంటే దౌత్యపరంగా ఎలాంటి సమస్యలు లేని దేశం భూటాన్. అయితే అత్యంత సుందర దృశ్యాలతోపాటు ఎంతో కష్టసాధ్యమైన ప్రాంతాల గుండా ఈ రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంటుంది. కానీ కాశ్మీర్ చినబ్ వంతెన, మీజోరామ్ రైల్వేలైన్ లాంటి అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ ప్రతిభకు ఇదో సమస్య కాదని అధికారులు చెబుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Karnataka CM Resignation: కర్ణాటక నెక్ట్స్ సీఎం చాన్స్ కోసం ఖర్గే ప్రయత్నం - రేసులో శివకుమార్ ముందంజ - కర్ణాటకలో ఏం జరుగుతోందంటే ?
కర్ణాటక నెక్ట్స్ సీఎం చాన్స్ కోసం ఖర్గే ప్రయత్నం - రేసులో శివకుమార్ ముందంజ - కర్ణాటకలో ఏం జరుగుతోందంటే ?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
5 Rupee Fish Meal: బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Embed widget