అన్వేషించండి

Mizoram Assembly Election 2023: మిజోరంలో ప్రశాంతంగా పోలింగ్ - ఓటెత్తిన చైతన్యం

Mizoram Assembly Election 2023: మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 69 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Mizoram Election 2023: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు బారులు తీరారు. మొత్తం 40 స్థానాలకు ఓటింగ్ జరగ్గా, మధ్యాహ్నం 3 గంటల వరకూ సుమారు 69 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా.. సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 77.78 శాతం ఓటింగ్ నమోదైంది. 

ఈవీఎం మొరాయింపు.. రెండోసారి వచ్చిన సీఎం

మిజోరం సీఎం, మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు జోరంథంగా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం ఐజ్వాల్ నార్త్ - 2 నియోజకవర్గ పరిధిలోని 19 - ఐజ్వాల్ వెంగ్లాయ్ - 1 పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే, అక్కడ ఈవీఎం మొరాయించడంతో కొద్దిసేపు చూసి వెనుదిరిగారు. అనంతరం 11 గంటల సమయంలో మళ్లీ పోలింగ్‌ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు సైతం ఐజ్వాల్ లోని సౌత్ - 2 పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటెత్తిన చైతన్యం

మిజోరం ఎన్నికల సందర్భంగా ఓటరు చైతన్యం వెల్లవిరిసింది. ఉదయం నుంచే ఓటేసేందుకు ప్రజలు క్యూలో బారులు తీరారు. చంపాయి దక్షిణ నియోజకవర్గానికి చెందిన 101 ఏళ్ల వయసున్న పురౌలనుదల.. 86 ఏళ్ల తన భార్యతో వచ్చి ఓటు వేశారు. దీంతో అంతా ఆయన్ను అభినందించారు. అలాగే 96 ఏళ్ల దివ్యాంగుడు ఐజ్వాల్ లోని తన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు.

పోలీసుల పటిష్ట భద్రత

మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఓటింగ్‌ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సందర్భంగా బంగ్లాదేశ్, మయన్మార్‌తో మిజోరం సరిహద్దుల వెంబడి.. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మణిపుర్‌, అసోం, త్రిపుర రాష్ట్రాల.. సరిహద్దులను మూసివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో విజయవంతంగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. అటు, పోలింగ్ సిబ్బంది సైతం పక్కా ప్రణాళికతో వ్యవహరించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు చేపట్టారు. 

డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు

ఈ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. 

గెలుపెవరిదో.?

అధికార మిజో నేషనల్ ఫ్రంట్.. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి పాలన సాగించాలని భావిస్తోంది. మరోవైపు.. జొరాం పీపుల్స్ మూమెంట్, బీజేపీ, కాంగ్రెస్.. అధికార పార్టీని గద్దె దించాలని ప్రయత్నిస్తున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లు సాధించింది. కాంగ్రెస్​కు 5, బీజేపీకి ఒక సీటు దక్కింది. ఈసారి గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉండగా, ఓటర్లు ఈవీఎంల్లో అభ్యర్థుల భవిష్యత్తును నిక్షిప్తం చేశారు. ఫలితంపై అంతా ఆసక్తితో చూస్తున్నారు.

Also Read: Air Pollution: 'పంట వ్యర్థాలు కాల్చడం హత్యతో సమానం' - వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget