అన్వేషించండి

Manmohan About Modi: మీరు చేసింది కరెక్ట్‌- ఉక్రెయిర్‌, రష్యా సంక్షోభంపై మోదీని సమర్థించిన మన్మోహన్‌

Manmohan About Modi: మీరు చేసింది కరెక్ట్‌- ఉక్రెయిర్‌, రష్యా సంక్షోభంపై మోదీని సమర్థించిన మన్మోహన్‌

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరే కరెక్ట్‌ అని మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. భారత్‌ ప్రదర్శించిన వైఖరిని సరైనదే అని ఆయన మోదీని సమర్థించారు. దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి సరైన విధంగా స్పందిచారని, మీరు చేసిందే కరెక్ట్‌ అని అన్నారు. అదే సమయంలో శాంతి స్థాపన కోసం విజ్ఞప్తి చేయడాన్ని కూడా ఆయన సమర్థించారు. మన్మోహన్‌ సింగ్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జీ 20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. శనివారం జరిగే జీ 20 విందుకు మన్మోహన్‌కు కూడా ఆహ్వానం అందింది.

ప్రస్తుతం దేశీయ రాజకీయాలకు కూడా విదేశీ పాలసీల ప్రాముఖ్యత చాలా పెరిగిందని, తన హయాంలో ఇలా లేదని మన్మోహన్‌ పేర్కొన్నారు. అయితే పార్టీ రాజకీయాల కోసం దౌత్య పరమైన అంశాలను ఉపయోగించుకోవడంలో సంయమనం పాటించాలని అన్నారు. భారత్‌ జీ 20  సదస్సుకు అధ్యక్షత వహించడం పట్ల మన్మోహన్‌ సంతోషం వ్యక్తంచేశారు. తన జీవిత కాలంలో భారత్‌కు జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జీ 20 నేతలకు భారత్‌ ఆతిథ్యమివ్వడాన్ని తాను చూస్తున్నానని అని సంతోషం వ్యక్తంచేశారు. 

అలాగే రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంపై మాట్లాడుతూ భారత్‌ ఈ అంశాన్ని డీల్‌ చేసిన విధానం కరెక్ట్‌ అని అభిప్రాయపడ్డారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు ఏదో ఒక దానికి మద్దతుగా నిలవడం ఇతర దేశాలకు కష్టమైన విషయమని అన్నారు. ఈ విషయంలో దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ భారత్‌ ఎంచుకున్న వైఖరి సరైనదని మన్మోహన్‌ పేర్కొన్నారు. అయితే జీ 20 సదస్సులో పలు దేశాలు భద్రతపరమైన విభేదాలను పక్కన పెట్టి వాతావరణ మార్పులు, అసమానతలు, అంతర్జాతీయ వాణిజ్యంలో విశ్వాసం కలిగేలా ఈ వేదికపై చర్చల విషయంలో దృష్టి పెట్టడం ముఖ్యమంని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రతా పరమైన విభేదాలను పరిష్కరించే వేదికగా జీ20ని ఎన్నడూ పరిగణించలేదని అన్నారు.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సదస్సుకు హాజరుకాకపోవడంపైనా మన్మోహన్‌ స్పదించారు. భారతదేశ ప్రాదేశికత, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని, ప్రభుత్వానికి సలహా ఇవ్వడాన్ని తాను ఇష్టపడడం లేదని అన్నారు. క్లిష్టమైన దౌత్య వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ప్రధానమంత్రి తాను సలహా ఇవ్వడం సరికాదని అన్నారు. అలాగే భవిష్యత్తు సవాళ్లపై ప్రశ్నించగా.. తాను రాబోయే సవాళ్ల విషయంలో ఆందోళన చెందడం కంటే ఆశాజనకంగా ఉన్నానని, భారత దేశం సామరస్యపూర్వకమైన సమాజంగా ఉండాలనేది తన ఆశ అని పేర్కొన్నారు. ఇదే పురోగతికి, అభివృద్ధికి పునాది అని తెలిపారు. వైవిధ్యాన్ని స్వాగతించడమే భారతదేశం  సహజ స్వభావమని, దీన్ని కాపాడుకోవాలని అన్నారు.

ఇస్రో చంద్రయాన్‌ 3ను విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయడంపై మన్మోహన్‌ సింగ్‌ ఇస్రోను అభినందించారు. భారతదేశం సాంకేతిక పరిజ్ఙానం అత్యుత్తమమైనదని ప్రపంచంలో రుజువు అవ్వడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు RBI గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం

వీడియోలు

Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్
Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు RBI గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
Gummadi Narsayya biopic: రాజకీయాల్లో లెజెండ్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ - హీరోగా శివరాజ్  కుమార్ - షూటింగ్ ప్రారంభం
రాజకీయాల్లో లెజెండ్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ - హీరోగా శివరాజ్ కుమార్ - షూటింగ్ ప్రారంభం
IndiGo Flights-BCCI: ఇండిగో తప్పిదంతో బీసీసీకి చిక్కులు!సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ షెడ్యూల్‌లో భారీ మార్పులు?
ఇండిగో తప్పిదంతో బీసీసీకి చిక్కులు!సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ షెడ్యూల్‌లో భారీ మార్పులు?
Hanumakonda Additional Collector : ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ - రైతుల సంబరాలు - ఇంతగా కాల్చుకుతిన్నారా?
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ - రైతుల సంబరాలు - ఇంతగా కాల్చుకుతిన్నారా?
HAIKU First Look: 'కోర్టు' శ్రీదేవి తమిళ్ సినిమా... ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'హైకూ' ఫస్ట్ లుక్ రిలీజ్ - చూశారా?
'కోర్టు' శ్రీదేవి తమిళ్ సినిమా... ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'హైకూ' ఫస్ట్ లుక్ రిలీజ్ - చూశారా?
Embed widget