అన్వేషించండి

Manmohan About Modi: మీరు చేసింది కరెక్ట్‌- ఉక్రెయిర్‌, రష్యా సంక్షోభంపై మోదీని సమర్థించిన మన్మోహన్‌

Manmohan About Modi: మీరు చేసింది కరెక్ట్‌- ఉక్రెయిర్‌, రష్యా సంక్షోభంపై మోదీని సమర్థించిన మన్మోహన్‌

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరే కరెక్ట్‌ అని మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. భారత్‌ ప్రదర్శించిన వైఖరిని సరైనదే అని ఆయన మోదీని సమర్థించారు. దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి సరైన విధంగా స్పందిచారని, మీరు చేసిందే కరెక్ట్‌ అని అన్నారు. అదే సమయంలో శాంతి స్థాపన కోసం విజ్ఞప్తి చేయడాన్ని కూడా ఆయన సమర్థించారు. మన్మోహన్‌ సింగ్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జీ 20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మన్మోహన్‌ సింగ్‌ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. శనివారం జరిగే జీ 20 విందుకు మన్మోహన్‌కు కూడా ఆహ్వానం అందింది.

ప్రస్తుతం దేశీయ రాజకీయాలకు కూడా విదేశీ పాలసీల ప్రాముఖ్యత చాలా పెరిగిందని, తన హయాంలో ఇలా లేదని మన్మోహన్‌ పేర్కొన్నారు. అయితే పార్టీ రాజకీయాల కోసం దౌత్య పరమైన అంశాలను ఉపయోగించుకోవడంలో సంయమనం పాటించాలని అన్నారు. భారత్‌ జీ 20  సదస్సుకు అధ్యక్షత వహించడం పట్ల మన్మోహన్‌ సంతోషం వ్యక్తంచేశారు. తన జీవిత కాలంలో భారత్‌కు జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జీ 20 నేతలకు భారత్‌ ఆతిథ్యమివ్వడాన్ని తాను చూస్తున్నానని అని సంతోషం వ్యక్తంచేశారు. 

అలాగే రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంపై మాట్లాడుతూ భారత్‌ ఈ అంశాన్ని డీల్‌ చేసిన విధానం కరెక్ట్‌ అని అభిప్రాయపడ్డారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు ఏదో ఒక దానికి మద్దతుగా నిలవడం ఇతర దేశాలకు కష్టమైన విషయమని అన్నారు. ఈ విషయంలో దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ భారత్‌ ఎంచుకున్న వైఖరి సరైనదని మన్మోహన్‌ పేర్కొన్నారు. అయితే జీ 20 సదస్సులో పలు దేశాలు భద్రతపరమైన విభేదాలను పక్కన పెట్టి వాతావరణ మార్పులు, అసమానతలు, అంతర్జాతీయ వాణిజ్యంలో విశ్వాసం కలిగేలా ఈ వేదికపై చర్చల విషయంలో దృష్టి పెట్టడం ముఖ్యమంని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రతా పరమైన విభేదాలను పరిష్కరించే వేదికగా జీ20ని ఎన్నడూ పరిగణించలేదని అన్నారు.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సదస్సుకు హాజరుకాకపోవడంపైనా మన్మోహన్‌ స్పదించారు. భారతదేశ ప్రాదేశికత, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటారని తాను ఆశిస్తున్నానని, ప్రభుత్వానికి సలహా ఇవ్వడాన్ని తాను ఇష్టపడడం లేదని అన్నారు. క్లిష్టమైన దౌత్య వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ప్రధానమంత్రి తాను సలహా ఇవ్వడం సరికాదని అన్నారు. అలాగే భవిష్యత్తు సవాళ్లపై ప్రశ్నించగా.. తాను రాబోయే సవాళ్ల విషయంలో ఆందోళన చెందడం కంటే ఆశాజనకంగా ఉన్నానని, భారత దేశం సామరస్యపూర్వకమైన సమాజంగా ఉండాలనేది తన ఆశ అని పేర్కొన్నారు. ఇదే పురోగతికి, అభివృద్ధికి పునాది అని తెలిపారు. వైవిధ్యాన్ని స్వాగతించడమే భారతదేశం  సహజ స్వభావమని, దీన్ని కాపాడుకోవాలని అన్నారు.

ఇస్రో చంద్రయాన్‌ 3ను విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయడంపై మన్మోహన్‌ సింగ్‌ ఇస్రోను అభినందించారు. భారతదేశం సాంకేతిక పరిజ్ఙానం అత్యుత్తమమైనదని ప్రపంచంలో రుజువు అవ్వడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
Wayanad Landslide: వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
Wayanad Landslide: కేరళలోని వయనాడ్‌లో ఆగని విషాదాలు! కొండచరియలు విరిగిపడి మరో ముగ్గురు మృతి! ప్రకృతి బీభత్సానికి కారణమేంటీ?
కేరళలోని వయనాడ్‌లో ఆగని విషాదాలు! కొండచరియలు విరిగిపడి మరో ముగ్గురు మృతి! ప్రకృతి బీభత్సానికి కారణమేంటీ?
Wayanad Tunnel Landslide: వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం - విరిగిపడిన కొండ చరియలు - ఒళ్ల గగుర్పొడిచే దృశ్యాలు
వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం - విరిగిపడిన కొండ చరియలు - ఒళ్ల గగుర్పొడిచే దృశ్యాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget