అన్వేషించండి

Manipur Violence: మణిపూర్‌లో కొనసాగుతున్న హింస, పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, తుపాకీ మోతలు

Manipur Violence: మణిపూర్ లో పరిస్థితులు ఏమాత్రం మారడం లేదు. రాష్ట్రంలోని పలు చోట్ల నిత్యం హింస చెలరేగుతోంది.

Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితిలో మార్పు రావడం లేదు. రాష్ట్రంలోని పలు చోట్ల మరోసారి హింస చెలరేగింది. అర్ధరాత్రి వేళ బాంబు పేలుళ్లు, తుపాకుల మోత పరిస్థితి తీవ్రతను తెలియజెబుతోంది. హింస చెలరేగిన ప్రాంతాల్లో బలగాలు మోహరిస్తే పరిస్థితి అదుపులోకి వస్తోంది. కానీ రాష్ట్రంలోని వేరే చోట్ల మళ్లీ హింస చెలరేగుతోంది. తాజాగా బుధవారం అర్ధరాత్రి మణిపూర్ లోని వివిధ జిల్లాల్లో పేలుళ్లు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో తుపాకుల మోత మోగింది. బిష్ణుపూర్ జిల్లాలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(IED)తో పేలుడు సంభవించింది. ఆగి ఉన్న వాహనంలో బాంబు అమర్చినట్లు అధికారులు తెలిపారు. కాంగ్ పోక్సి జిల్లాలో నిన్న సాయంత్రం కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే అర్ధరాత్రి 2-3 గంటల మధ్యలో మరోసారి కాల్పులు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. 

ఉరంగ్ పట్ సమీపంలోని ఇంఫాల్ తూర్పు జిల్లాలో మరో కాల్పుల ఘనట నమోదైంది. అక్కడ చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అస్సాం రైఫిల్స్ దళాలు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. మీరై పైబిస్ నిర్వహించిన నిరసన కారణంగా మరోసారి అశాంతి నెలకొంది. సావోన్ బంగ్-వైకేపీఐ రహదారిని చాలా చోట్ల బ్లాక్ చేయాల్సి వచ్చింది. 

ఎట్టకేలకు కదిలిన కేంద్ర సర్కారు

మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎట్టకేలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈశాన్య రాష్ట్రంలో నెలన్నరగా జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తెచ్చి రాష్ట్రంలో శాంతిస్థాపనే లక్ష్యంగా ఈ సమావేశన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ట్వీట్ చేసింది. జూన్ 24వ తేదీన దిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు హోంశాఖ తెలిపింది.

'ప్రధాని దేశంలో లేని సమయంలో మీటింగా'

కేంద్ర సర్కారు ఇన్ని రోజుల తర్వాత అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 50 రోజులుగా మణిపూర్ మండుతుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించారని మండిపడ్డారు. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం పెట్టారని, ఈ భేటీ ప్రధానికి ఏమాత్రం ముఖ్యం కాదని స్పష్టమైందని ఆయన విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: పని మనుషులు కామన్ ఏరియాల్లో కనిపించొద్దని రూల్, హౌజింగ్ సొసైటీపై నెటిజన్లు ఫైర్

మే 3 నుంచి మణిపూర్ లో హింసాకాండ

ప్రశాంతతకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మే 3వ తేదీన ఒక్కసారిగా హింస చెలరేగింది. ఇక్కడి జనాభాలో అత్యధికులు మెయిటీ, కుకీ తెగల మధ్య వైరం మొదలైంది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటూ సృష్టించిన హింసలో అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారమే 98 మంది మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బలగాలను మోహరించినా పరిస్థితిలో ఏమార్పూ కనిపించడం లేదు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget