అన్వేషించండి

Maha Kumbhha Mela 2025: ముగిసిన మహా కుంభమేళా, త్రివేణి సంగమంలోని ఆ నదుల గురించి మీకు తెలుసా...?

Maha Kumbhha Mela 2025:గంగ, యమునలకు ఆధ్యాత్మిక ప్రత్యేకతతో పాటు ఉన్న భౌగోళిక చరిత్ర తెలుసా. సరస్వతి నది నిజంగా ఉందా? త్రివేణి సంగమానికి ఎందుకంత ప్రాధాన్యత?

Maha Kumbhha Mela 2025:మహా కుంభమేళా ముగిసింది. దాదాపు 64కోట్ల మంది ఈ జాతరలో పాల్గొన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. జనవరి 13వ తేదీన మొదలైన కుంభమేళ ఫిబ్రవరి 26న శివరాత్రి రోజున ముగిసింది. ఇది ప్రపంచ మానవ చరిత్రలో అతి పెద్ద మానవ సమ్మేళనంగా చెప్పవచ్చు. కుంభమేళా ఎందుకు జరుగుతుంది.. ఎప్పటి నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. కుంభమేళా వెనుక ఆచార సంప్రదాయాలపై పుంఖాను పుంఖానులుగా వార్తలు , వివరణలు వచ్చాయి. ఈ కుంభమేళలో ప్రత్యేకమైంది. మూడు నదుల సంగమం. ఆ నదుల భౌగోళిక విశేషాలు ఈ కథనంలో చూద్దాం.


Maha Kumbhha Mela 2025: ముగిసిన మహా కుంభమేళా, త్రివేణి సంగమంలోని ఆ నదుల గురించి మీకు తెలుసా...?

త్రివేణి సంగమ స్థానమే కుంభమేళాకు ప్రత్యేకత
ఉత్తరప్రదేశ్‌లోని ఒకప్పటి అలహాబాద్ నేటి ప్రయాగ్‌రాజ్ వద్ద గంగ, యమున, సరస్వతి అనే మూడు నదులు కలుస్తాయి. అందుకే దీన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ నదులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఈ మూడు కలిసిన ప్రయాగ్‌రాజ్‌లో స్నానాలు ఆచరించడం ఓ సంప్రదాయంగా మారింది. అది కుంభమేళా వంటి చారిత్రక ఘట్టంలో స్నానం చేయడం భక్తులకు ఓ రివాజు. అయితే ఇందులో కీలకం గంగ, యమున, సరస్వతి నదులే.  


Maha Kumbhha Mela 2025: ముగిసిన మహా కుంభమేళా, త్రివేణి సంగమంలోని ఆ నదుల గురించి మీకు తెలుసా...?

గంగా నది..
గంగానది ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిధిలోని గంగోత్రి వద్ద హిమనీ నదంలో పుట్టి హిమాలయాల్లో ప్రవహిస్తూ మైదాన ప్రాంతానికి చేరుతుంది. దీన్నే గంగామైదానం అని కూడా పిలుస్తారు. ఈ ప్రవహ మార్గంలో మరిన్ని ఉపనదులు కలుస్తాయి. అవి కోసి, గోమతి, శోణ అనే ఉప నదులు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ వద్ద యమునా నది కూడా కలుస్తుంది. ఇది కూడా గంగానదికి ఉపనది లాంటిదే. అయితే యుమున పెద్ద నది కావడంతో దీన్ని ప్రత్యేక నదిగా గుర్తిస్తారు. ఈ రెండు నదుల ప్రవాహ మార్గంలోని ఒడ్డున ఢిల్లీ, కాన్పూర్, ఒకప్పటి అలహాబాద్ నేటి ప్రయాగ్‌రాజ్, వారణాసి, పాట్నా, కోల్‌కతా నగరాలు ఉన్నాయి. ప్రయాగ్‌రాజ్ దాటాక గంగా నది ప్రవాహంలో ఇతర అనేక ఉపనదులు కలిసి మహా ప్రవాహ గంగా నదిగా  మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లోని మాల్టా వద్ద రెండుగా చీలుతుంది. ఆ చీలిక నుంచి హుగ్లీ నది ప్రారంభం అవుతుంది. ఈ హుగ్లీ నదీ ఒడ్డునే కోలోకత్తా నగరం ఏర్పడింది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి అక్కడ బ్రహ్మపుత్ర ఉపనదులతో కలిసి గంగా ప్రవాహం బంగాళాఖాతంలో కలుస్తోంది. గంగా నది పొడవు 2525 కిలోమీటర్లు. ప్రపంచ పొడవైన నదుల్లో గంగానదిది ఏడో స్థానం.


Maha Kumbhha Mela 2025: ముగిసిన మహా కుంభమేళా, త్రివేణి సంగమంలోని ఆ నదుల గురించి మీకు తెలుసా...?

యుమునా నది...
గంగా నదికి యునా నది ఉపనదే. కాని ఇది కూడా పెద్ద నదుల్లో ఒకటి కావడంతో దీన్ని గంగానది ఉపనది కన్నా ప్రత్యేక నదిగానే చెబుతారు. యమునా నది హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన కాళింది పర్వతంలో యమునోత్రి అనే ప్రాంతంలో పుట్టింది. దీన్నే జమున, జమ్నా అని సంస్కృతంలో పిలుస్తారు. దీని ఉపనదులు ట్రాన్స్, చంబల్, కెన్, బెట్వాలు. దీని పొడవు 1370 కిలోమీటర్లు.  ఢిల్లీ, హర్యానా, యూపీ రాష్ట్రాల గుండా ప్రవహించి ఇది ప్రయాగ రాజ్ వద్ద గంగానదిలో కలుస్తుంది. ఈ నది విశిష్టత ఏంటంటే గంగానదికి ఎడమ వైపు పుట్టిన ఈ నది కుడివైపున గంగానదిలో కలుస్తుంది.


Maha Kumbhha Mela 2025: ముగిసిన మహా కుంభమేళా, త్రివేణి సంగమంలోని ఆ నదుల గురించి మీకు తెలుసా...?

సరస్వతీ నది...
సరస్వతీ నది నేడు భౌగోళికంగా కనిపించదు. ఇది పురాణాల్లో కనిపించే నదిగా  రుగ్వేదంలో చెప్పారు. సరస్వతీ నది యుమునా నదికి పశ్చిమాన సట్లెజ్ నది ఉందని, ఇది మహా భారత కాలంలో ఎండిపోయిందని చెబుతారు  ఆర్కియాలజిస్టులు. అయితే హర్యానాలోని షుగ్గర్ వద్ద యుమునలో సరస్వతి నది కలిసిపోయిందని ఆ తర్వాత అంతర్థానమైపోయిందని చెబుతారు. సరస్వతీ నది ప్రయాగ వద్ద గంగ, యమున నదులతో సంగమం అవుతుందని హిందువుల గట్టి నమ్మకం.


Maha Kumbhha Mela 2025: ముగిసిన మహా కుంభమేళా, త్రివేణి సంగమంలోని ఆ నదుల గురించి మీకు తెలుసా...?

సరస్వతి నది కనిపించకపోయినా, గంగా, యుమన నదుల్లో అంతర్భాగంగా ఉందని ప్రజలన నమ్మం.  అయితే ఈ నదులు కేవలం ఆధ్యాత్మిక భావనలను పెంచడమే కాదు. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు అని చెప్పవచ్చు. ఈ నదుల చూట్టూ గొప్ప నగరాలు వెలిశాయి. ఉత్తర భారత దేశానికి గంగా, యమున నదులు భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా, సామాన్య ప్రజలు ఆర్థిక వనరులుగా ఉపయోగపడుతున్నాయి.

Also Read: కేదార్ నాథ్ ఆలయం తెరిచే డేట్ ఇదే .. శివరాత్రి సందర్భంగా ప్రకటించిన బద్రీనాథ్ - కేదార్నాథ్ బోర్డ్

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget