అన్వేషించండి

PM Modi Bhopal Visit: ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పర్యటన.. గంటన్నర కోసం రూ.23 కోట్ల ఖర్చు! బీజేపీ ప్లాన్ ఏంటి?

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మోదీ పర్యటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనివెనుక బీజేపీ వ్యూహం ఏంటని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌‌లోని భోపాల్ పర్యటించనున్నారు. గిరిజన యోధులకు సంబంధించి నిర్వహించనున్న సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ భోపాల్ వెళ్లనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మోదీ పర్యటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని పర్యటన కోసం భారీగా ఖర్చు చేయనుండటమే అందుకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. బీజేపీ మాత్రం తమ ప్లాన్స్ అమలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

భోపాల్‌లో జరగనున్న కార్యక్రమాల కోసం నాలుగు గంటల పాటు నగరంలో ఉండగా.. వేదికపై 1 గంట 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఉండనున్నారు. ఇందుకోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం 5 వేదికలను నిర్మిస్తోంది. ఇందుకుగానూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.23 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. ఇందులో  13 కోట్ల రూపాయాలను భోపాల్‌లోని జంబోరీ మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రజలను తరలించడానికే ఖర్చు చేయనుండటం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఒత్తిడి లేదు... గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు... ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు

మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన వీరుడు బిర్సా ముండా స్మరణార్థం జన్‌జాతీయ గౌరవ్ దివాస్‌ను నవంబర్ 15న నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోదీ.. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలో నిర్మించిన తొలి రైల్వే స్టేషన్ హబీబ్‌గంజ్ స్టేషన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. జన్‌జాతీయ గౌరవ్ దివాస్‌ను నవంబర్ 15 నుంచి 22 వరకు వారం రోజుల పాటు నిర్వహించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బిర్సా ముండా గౌరవార్థం వారం రోజులపాటు సెలబ్రేషన్స్ చేసేందుకు సన్నాహకాలు మొదలుపెట్టింది. 

మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది గిరిజనులు జంబోరీ మైదానానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. గిరిజనులకు సంబంధించిన కళాఖండాలతో పాటు గిరిజన వీరులు, నేతల చిత్రాలను ప్రదర్శించేలా జంబోరీ మైదానాన్ని అలంకరించారు. ఇందుకోసం 300 మంది గిరిజనులు వారం రోజులపాటు శ్రమించారు. రూ.12 కోట్లు ట్రాన్స్‌పోర్ట్‌కు, మరో 9 కోట్ల రూపాయలను టెంట్లు, డెకరేషన్, ఐదు సభా వేదికలు, పబ్లిసిటీ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగలకు 47 సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇందులో 2008లో బీజేపీ 29 సీట్లు నెగ్గగా.. 2013కి ఆ సంఖ్య 31కు పెరిగింది. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గిన షెడ్యూల్డ్ తెగల సభ్యుల సంఖ్య 16కు పడిపోయింది. గిరిజన ప్రజల్ని తమ వైపునకు తిప్పుకునేందుకు, వారి విశ్వాసం చూరగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉత్సవాలు జరుపుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిపై అత్యధిక సంఖ్యలో 2,401 వేధింపుల కేసుల నమోదయ్యాయి. 2019లో 1,922 కేసులు నమోదు కాగా, 2018లో 1868 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 28 శాతం కేసులు పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ రిపోర్టులు చెబుతున్నాయి. 

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.450 కోట్ల వ్యయంతో హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. జర్మనీలోని హీడెల్ బర్గ్ రైల్వే స్టేషన్ తరహాలోనే దీన్ని నిర్మించారు. హబీబ్ గంజ్ స్టేషన్ పై 2016 జూన్‌లో నిర్ణయం తీసుకోగా 2017లో పనులు ప్రారంభించి ఇటీవల పూర్తిచేశారు. అత్యంత ఆధునాతన సౌకర్యాలతో ప్రయాణీకులు వచ్చేవారు, వెళ్లేవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయి. స్థూపాలు, భోజ్‌పూర్ టెంపుల్, భింబేట్క, తవా డ్యామ్, గిరిజన మ్యూజియం గ్లింప్లెస్ ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్‌లో ఫుడ్ జోన్, కిడ్స్, ఎంటర్‌టైన్మెంట్ జోన్, రీటైల్ జోన్ ఏర్పాటు చేశారు.

Also Read: మావోయిస్టు ఆర్కే జీవిత విషయాలు ప్రింటింగ్... నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసులు సోదాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Embed widget