అన్వేషించండి

జమిలి సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు టైమ్ లైన్ లేదు-లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిజ్‌ రితురాజ్‌ అవస్తీ

జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు తుది రూపు ఇవ్వలేదనన్నారు లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిజ్‌ రితురాజ్‌ అవస్తీ. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు జరుగుతోందన్నారు.

జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు తుది రూపు ఇవ్వలేదనన్నారు లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిజ్‌ రితురాజ్‌ అవస్తీ. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు జరుగుతోందన్నారు. నివేదిక రూపకల్పన పూర్తి చేసేందుకు ఎలాంటి టైమ్ లేదని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల నివేదిక రూపకల్పన కొంత పని చేయాల్సి ఉందన్న అవస్తీ,  నివేదిక ఖరారు చేయడానికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు. దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయుల్లో ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. పోక్సో చట్టం, ఆన్‌లైన్‌ ఎఫ్‌ఐఆర్‌లపై నివేదికలను ఖరారు చేసి న్యాయ మంత్రిత్వశాఖకు పంపినట్టు చెప్పారు.

దేశంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు, అన్ని స్థాయిల్లో ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయలను స్వీకరిస్తామని చెప్పింది. దీంతో పాటు లా కమిషన్​ సలహాలను సైతం తీసుకుంటామని స్పష్టం చేసింది. కార్యాచరణ ప్రణాళికలు, అధికారిక సంప్రదింపులు ఎలా జరపాలన్న అంశాలపై కమిటీ చర్చించింది. కేంద్రం నిర్దేశించిన పనులకు పేపర్‌ వర్కు తయారు చేయడం, అవసరమైన విషయాలపై లోతైన పరిశోధనలు చేయడంపై చర్చలు జరిగినట్లు తెలిసింది. 

జమిలి ఎన్నికల సాధ్యానికి అవసరమయ్యే రాజ్యాంగ సవరణలు, వాటికి రాష్ట్రాల అంగీకారం అవసరమా.. ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యంకాకపోతే.. కాలవ్యవధులపై సిఫార్సులు వంటి పనులను కేంద్రం.. కమిటీకి నిర్దేశించింది. వీటితోపాటు జమిలి ఎన్నికలకు పెద్దమొత్తంలో అవసరమయ్యే ఎన్నికల పరికరాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. 1952 నుంచి కొన్నేళ్లు ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించి మధ్యలో ఆ పద్ధతి మారడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. అలాంటిది మళ్లీ పునరావృతం కాకుండా ఏం చేయాలో ప్రతిపాదనలు సూచించాలని  కమిటీకి సూచించింది కేంద్రం.

ఒకే దేశం- ఒకే ఎన్నికలు నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు.. శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు స్థానం కల్పించింది. రామ్​నాథ్​ కోవింద్​తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్​కే సింగ్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, లోక్​సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, మాజీ చీఫ్​ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు. అయితే కమిటీలో కాంగ్రెస్‌ MP అధీర్‌ రంజన్‌ చౌదరి పేరును కేంద్రం సిఫార్సు చేసినా.. తాను ఉండబోనని చెప్పారు. కమిటీ స్వతంత్రంగా ఉండదని, కేంద్రం చెప్పినట్లే వింటుందని అనుమానం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengal Assembly Elections: బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా చరిత్రే - దీదీ వర్సెస్ మోదీ పోరు ఊహించనంత హోరాహోరీ!
బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా చరిత్రే - దీదీ వర్సెస్ మోదీ పోరు ఊహించనంత హోరాహోరీ!
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏకంగా రూ.993 పెంపు- హైదరాబాద్‌లో ధర ఎంతంటే
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏకంగా రూ.993 పెంపు- హైదరాబాద్‌లో LPG ధర ఎంతంటే
Ethanol Blending India: ఇథనాల్‌తో జల సంక్షోభం వస్తుందా? ఒక లీటర్ కోసం ఎంత నీరు ఖర్చు అవుతుంది? 
ఇథనాల్‌తో జల సంక్షోభం వస్తుందా? ఒక లీటర్ కోసం ఎంత నీరు ఖర్చు అవుతుంది? 
Bride calls off marriage:పెళ్లి వేడుకలో కేకు ముఖానికి పూశాడని విడాకులు - ఈ వధువు చాలా స్ట్రాంగ్!
పెళ్లి వేడుకలో కేకు ముఖానికి పూశాడని విడాకులు - ఈ వధువు చాలా స్ట్రాంగ్!

వీడియోలు

Mumbai Indians Batting Failure IPL 2026 | ముంబై వరుస పరాజయాలకు కారణం ఏంటి ?
Yuvi, Travis plan behind Abhishek Success IPL 2026 | అభిషేక్ విధ్వంసం వెనుక రహస్యం ఇదే
Ryan Rickelton Breaks Record IPL 2026 | 18 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన ర్యాన్ రికెల్టన్
Vaibhav Suryavanshi Performance IPl 2026 | వైభవ్ విధ్వంసానికి గవాస్కర్ ఫిదా
SRH vs MI Highlights IPL 2026 | ముంబైపై సన్‌రైజర్స్ అదిరే విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu coalition formula: కూటమి పార్టీలతో ఇగోలకు పోతే ఇబ్బందే - చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్ - ఇక నియోజకవర్గాల్లో అంతా సర్దుకుంటుందా?
కూటమి పార్టీలతో ఇగోలకు పోతే ఇబ్బందే - చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్ - ఇక నియోజకవర్గాల్లో అంతా సర్దుకుంటుందా?
Double Bedroom Housing Scheme: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Hyderabad Fire Accident: బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
Bengal Assembly Elections: బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా చరిత్రే - దీదీ వర్సెస్ మోదీ పోరు ఊహించనంత హోరాహోరీ!
బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా చరిత్రే - దీదీ వర్సెస్ మోదీ పోరు ఊహించనంత హోరాహోరీ!
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏకంగా రూ.993 పెంపు- హైదరాబాద్‌లో ధర ఎంతంటే
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏకంగా రూ.993 పెంపు- హైదరాబాద్‌లో LPG ధర ఎంతంటే
Sunil: మళ్ళీ హీరోగా మారుతున్న సునీల్... ఆయన కోసం రవి కె చంద్రన్ స్టోరీ?
మళ్ళీ హీరోగా మారుతున్న సునీల్... ఆయన కోసం రవి కె చంద్రన్ స్టోరీ?
Mindful Eating: 'మైండ్‌ఫుల్ ఈటింగ్' అంటే ఏంటి? శారీరక, మానసిక ఆరోగ్యంపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది?
'మైండ్‌ఫుల్ ఈటింగ్' అంటే ఏంటి? శారీరక, మానసిక ఆరోగ్యంపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది?
AP Crime News: చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
Embed widget