అన్వేషించండి

మోదీ చరిష్మా ప్రతి సారి పని చేయదు, గెలవడానికి అది మాత్రమే చాలదు - బీజేపీపై RSS కీలక వ్యాఖ్యలు

Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఫలితాల తరవాత బీజేపీపై RSS తొలిసారి కీలక వ్యాఖ్యలు చేసింది.

Karnataka Elections:

కర్ణాటక ఎన్నికలపై RSS వ్యాఖ్యలు..

కచ్చితంగా గెలుస్తాం అనుకున్న కర్ణాటకలో బీజేపీకి పెద్ద షాకే తగిలింది. కాంగ్రెస్‌ని భారీ మెజార్టీతో గెలిపించారు కన్నడిగులు. కాషాయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క దక్షిణాది రాష్ట్రం కూడా చేజారింది. అందులోనూ 2024కి ముందు జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల పార్టీలో అంతర్మథనం మొదలైంది. "ఎక్కడ తప్పు జరిగింది" అని అనలైజ్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) బీజేపీకి కీలక సలహా ఇచ్చింది. "ఆత్మపరిశీలన" చేసుకోండి అని సూచించింది. అంతే కాదు. లోకల్‌గా క్యాడర్ పెంచుకోకుండా ఏ రాష్ట్రంలోనైనా గెలవడం కష్టమేనని తేల్చి చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, హిందుత్వ రాజకీయాలు అన్ని చోట్లా పని చేయవని స్పష్టం చేసింది. ఎన్నికల్లో గెలవడానికి ఇవి మాత్రమే సరిపోవని వెల్లడించింది. ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్నీ గుర్తు చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడానికి గల కారణాలనూ ప్రస్తావించింది RSS.కర్ణాటకలో బీజేపీ జాతీయ రాజకీయాల గురించి పదేపదే ప్రస్తావించిందని చెప్పిన ఆర్ఎస్‌ఎస్..కాంగ్రెస్ పూర్తిగా స్థానిక సమస్యలపై దృష్టి పెట్టిందని వివరించింది. కాంగ్రెస్ ఘన విజయం సాధించడానికి ఇదే కారణమని తెలిపింది. ఇక్కడ కుల రాజకీయాలతో ఓట్లు రాబట్టుకోవాలని చూశారని...కానీ కర్ణాటక ఓటర్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదని స్పష్టం చేసింది RSS. రాష్ట్రంలో బీజేపీ హయాంలో అవినీతి జరిగిందన్న ఆరోపణల్ని ఆ పార్టీ సరైన విధంగా డిఫెండ్ చేసుకోలేకపోయిందని వెల్లడించింది. 

ఇదే తొలిసారి..

సాధారణంగా ఎన్నికల గురించి ఎప్పుడూ RSS పెద్దగా మాట్లాడదు. అలాగే బీజేపీకి సలహాలు ఇచ్చిన దాఖలాలూ లేవు. కానీ...తొలిసారి ఇలా కర్ణాటక ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ సలహాలు ఇవ్వడం కీలకంగా మారింది. ఇప్పుడిదే వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ బీజేపీపై ఫైర్ అవుతోంది. కర్ణాటక ప్రజలు ప్రధాని మోదీని తిరస్కరించారన్న నిజాన్ని ఇప్పటికైనా ఒప్పుకోవాలని చురకలు అంటిస్తోంది. బీజేపీ దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలని సెటైర్లు వేస్తోంది.  ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుని విజయం సాధించింది. బీజేపీ 66 స్థానాలకే పరిమితమైది. కింగ్‌మేకర్‌గా మారతామని ధీమాగా చెప్పిన జేడీఎస్ డీలా పడింది. 19 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మొదటి నుంచి బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రచారం సాగించింది కాంగ్రెస్. 40% కమీషన్ ప్రభుత్వం అంటూ సెటైర్లు వేసింది. స్థానిక సమస్యల్నే ఎక్కువగా ప్రస్తావించింది. వీటితో పాటు ప్రజల్ని ఆకట్టుకునేలా 5 హామీలు ఇచ్చింది. ఉచిత విద్యుత్ అంటూ అందరినీ ఆకర్షించింది. ఫలితంగా...మెజార్టీ ఓట్లు కాంగ్రెస్‌కే పడ్డాయి. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే కేబినెట్ మీటింగ్‌ నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఈ హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం హామీ కూడా ఓట్లు బాగానే రాల్చింది. 

Also Read: Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతంపై కెనడాలో వేడుకలు, వార్నింగ్ ఇచ్చిన జైశంకర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP DesamSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABPSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Hyderabad Metro Rail :హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
 ICC Champions Trophy Aus Vs Eng Result Update: ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
TSRTC Special Buses:4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget