అన్వేషించండి

Assam Madrasas Closed : అస్సాంలో 600 మదర్సాలు మూసివేశాం, సీఎం బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు

Assam Madrasas Closed :అస్సాం సీఎం బిశ్వ శర్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో మదర్సాలన్నింటినీ మూసివేస్తామన్నారు.

Assam Madrasas Closed : అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. అస్సాం రాష్ట్రంలో ఉన్న మదర్సాలన్నింటినీ పూర్తిగా మూసివేయాలని అనుకుంటున్నామన్నారు. నవ భారత్ లో మదర్సాలు అవసరం లేదన్నారని బిశ్వ శర్మ అన్నారు. కర్ణాటక ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం రాత్రి జరిగిన ఓ సభలో ఈ వివాదాస్పదత వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు అస్సాంకు వచ్చి మన నాగరికత, సంస్కృతికి ముప్పును సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే 600 మదర్సాలను మూసివేశామని, మాకు మదర్సాలు వద్దు కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని అనుకుంటున్నానన్నారు. అస్సాంకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కావాలి కానీ మదర్సాలు వద్దని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.  

600 మదర్సాలు మూసివేత 

కర్ణాటకలోని బెల్గావిలో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి అస్సాం సీఎం బిశ్వ శర్మ ప్రసంగించారు. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు ఈశాన్య రాష్ట్రానికి వచ్చి మన నాగరికత, సంస్కృతికి ముప్పు కలిగిస్తున్నారని ఆరోపించారు. అందుకే అస్సాంలో 600 మదర్సాలను మూసివేశామన్నారు. మదర్సాలు వద్దు కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని భావిస్తున్నామన్నారు. మాకు పాఠశాలలు, కళాశాలలు  విశ్వవిద్యాలయాలు కావాలని బిశ్వ శర్మ అన్నారని  వార్తా సంస్థ ANI తెలిపింది. 

అస్సాంలో ఉగ్రవాదులు 

బంగ్లాదేశ్‌లోని అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఐదు జిహాదీ సంస్థలు అస్సాంలో జిహాదీ కార్యకలాపాలకు  కేంద్రంగా చేసుకున్నాయని గత ఏడాది సీఎం బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు 2016, 2017 మధ్య భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి టెర్రర్ మాడ్యూల్స్, స్లీపర్ సెల్స్‌ని ఏర్పాటు చేసి స్థానిక యువకులకు జిహాదీ వైపు ఆకర్షించారన్నారు.  

కాంగ్రెస్ పై విమర్శలు 

బెల్గావి ర్యాలీలో అస్సాం సీఎం బిశ్వ శర్మ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఒకప్పుడు దిల్లీ పాలకులు దేవాలయాలను కూల్చివేయాలని మాట్లాడేవారని, కానీ నేడు ప్రధాని మోదీ పాలనలో దేవాలయాలు కట్టడం గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇది నవ భారతావని అన్నారు. ఈ నవ భారతాన్ని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ కృషి చేస్తోందని విమర్శించారు. కొత్త మొఘల్‌లకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు.  భారతదేశ చరిత్రలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొఘల్స్ హైలైట్ చేశారని ఆరోపించారు. చరిత్రలో   ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి రాయకుండా ... అంతా బాబర్, ఔరంగజేబు, షాజహాన్‌లదే అన్నట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులు చూపించారన్నారు. భారతదేశ చరిత్ర  ఛత్రపతి శివాజీ మహరాజ్, గురుగోవింద్ సింగ్ గురించి అని నేను చెప్పాలనుకుంటున్నానన్నారు. ఔరంగజేబ్ పాలనలో  ఇతర మతస్థులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని ఆరోపించారు. 'సనాతన్' సంస్కృతిని అంతం చేయడానికి ఔరంగజేబ్ ప్రయత్నించారని శర్మ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Reasons For Prashant Kishor Win: బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
Karnataka Cabinet Expansion: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా 19 మంది ప్రమాణం- మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Embed widget