అన్వేషించండి

Assam Madrasas Closed : అస్సాంలో 600 మదర్సాలు మూసివేశాం, సీఎం బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు

Assam Madrasas Closed :అస్సాం సీఎం బిశ్వ శర్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో మదర్సాలన్నింటినీ మూసివేస్తామన్నారు.

Assam Madrasas Closed : అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. అస్సాం రాష్ట్రంలో ఉన్న మదర్సాలన్నింటినీ పూర్తిగా మూసివేయాలని అనుకుంటున్నామన్నారు. నవ భారత్ లో మదర్సాలు అవసరం లేదన్నారని బిశ్వ శర్మ అన్నారు. కర్ణాటక ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం రాత్రి జరిగిన ఓ సభలో ఈ వివాదాస్పదత వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు అస్సాంకు వచ్చి మన నాగరికత, సంస్కృతికి ముప్పును సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే 600 మదర్సాలను మూసివేశామని, మాకు మదర్సాలు వద్దు కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని అనుకుంటున్నానన్నారు. అస్సాంకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కావాలి కానీ మదర్సాలు వద్దని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.  

600 మదర్సాలు మూసివేత 

కర్ణాటకలోని బెల్గావిలో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి అస్సాం సీఎం బిశ్వ శర్మ ప్రసంగించారు. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు ఈశాన్య రాష్ట్రానికి వచ్చి మన నాగరికత, సంస్కృతికి ముప్పు కలిగిస్తున్నారని ఆరోపించారు. అందుకే అస్సాంలో 600 మదర్సాలను మూసివేశామన్నారు. మదర్సాలు వద్దు కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని భావిస్తున్నామన్నారు. మాకు పాఠశాలలు, కళాశాలలు  విశ్వవిద్యాలయాలు కావాలని బిశ్వ శర్మ అన్నారని  వార్తా సంస్థ ANI తెలిపింది. 

అస్సాంలో ఉగ్రవాదులు 

బంగ్లాదేశ్‌లోని అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఐదు జిహాదీ సంస్థలు అస్సాంలో జిహాదీ కార్యకలాపాలకు  కేంద్రంగా చేసుకున్నాయని గత ఏడాది సీఎం బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు 2016, 2017 మధ్య భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి టెర్రర్ మాడ్యూల్స్, స్లీపర్ సెల్స్‌ని ఏర్పాటు చేసి స్థానిక యువకులకు జిహాదీ వైపు ఆకర్షించారన్నారు.  

కాంగ్రెస్ పై విమర్శలు 

బెల్గావి ర్యాలీలో అస్సాం సీఎం బిశ్వ శర్మ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఒకప్పుడు దిల్లీ పాలకులు దేవాలయాలను కూల్చివేయాలని మాట్లాడేవారని, కానీ నేడు ప్రధాని మోదీ పాలనలో దేవాలయాలు కట్టడం గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇది నవ భారతావని అన్నారు. ఈ నవ భారతాన్ని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ కృషి చేస్తోందని విమర్శించారు. కొత్త మొఘల్‌లకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు.  భారతదేశ చరిత్రలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొఘల్స్ హైలైట్ చేశారని ఆరోపించారు. చరిత్రలో   ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి రాయకుండా ... అంతా బాబర్, ఔరంగజేబు, షాజహాన్‌లదే అన్నట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులు చూపించారన్నారు. భారతదేశ చరిత్ర  ఛత్రపతి శివాజీ మహరాజ్, గురుగోవింద్ సింగ్ గురించి అని నేను చెప్పాలనుకుంటున్నానన్నారు. ఔరంగజేబ్ పాలనలో  ఇతర మతస్థులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని ఆరోపించారు. 'సనాతన్' సంస్కృతిని అంతం చేయడానికి ఔరంగజేబ్ ప్రయత్నించారని శర్మ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget