అన్వేషించండి

Assam Madrasas Closed : అస్సాంలో 600 మదర్సాలు మూసివేశాం, సీఎం బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు

Assam Madrasas Closed :అస్సాం సీఎం బిశ్వ శర్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో మదర్సాలన్నింటినీ మూసివేస్తామన్నారు.

Assam Madrasas Closed : అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. అస్సాం రాష్ట్రంలో ఉన్న మదర్సాలన్నింటినీ పూర్తిగా మూసివేయాలని అనుకుంటున్నామన్నారు. నవ భారత్ లో మదర్సాలు అవసరం లేదన్నారని బిశ్వ శర్మ అన్నారు. కర్ణాటక ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం రాత్రి జరిగిన ఓ సభలో ఈ వివాదాస్పదత వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు అస్సాంకు వచ్చి మన నాగరికత, సంస్కృతికి ముప్పును సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే 600 మదర్సాలను మూసివేశామని, మాకు మదర్సాలు వద్దు కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని అనుకుంటున్నానన్నారు. అస్సాంకు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కావాలి కానీ మదర్సాలు వద్దని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.  

600 మదర్సాలు మూసివేత 

కర్ణాటకలోని బెల్గావిలో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి అస్సాం సీఎం బిశ్వ శర్మ ప్రసంగించారు. బంగ్లాదేశ్ నుంచి ప్రజలు ఈశాన్య రాష్ట్రానికి వచ్చి మన నాగరికత, సంస్కృతికి ముప్పు కలిగిస్తున్నారని ఆరోపించారు. అందుకే అస్సాంలో 600 మదర్సాలను మూసివేశామన్నారు. మదర్సాలు వద్దు కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని భావిస్తున్నామన్నారు. మాకు పాఠశాలలు, కళాశాలలు  విశ్వవిద్యాలయాలు కావాలని బిశ్వ శర్మ అన్నారని  వార్తా సంస్థ ANI తెలిపింది. 

అస్సాంలో ఉగ్రవాదులు 

బంగ్లాదేశ్‌లోని అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఐదు జిహాదీ సంస్థలు అస్సాంలో జిహాదీ కార్యకలాపాలకు  కేంద్రంగా చేసుకున్నాయని గత ఏడాది సీఎం బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు 2016, 2017 మధ్య భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి టెర్రర్ మాడ్యూల్స్, స్లీపర్ సెల్స్‌ని ఏర్పాటు చేసి స్థానిక యువకులకు జిహాదీ వైపు ఆకర్షించారన్నారు.  

కాంగ్రెస్ పై విమర్శలు 

బెల్గావి ర్యాలీలో అస్సాం సీఎం బిశ్వ శర్మ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఒకప్పుడు దిల్లీ పాలకులు దేవాలయాలను కూల్చివేయాలని మాట్లాడేవారని, కానీ నేడు ప్రధాని మోదీ పాలనలో దేవాలయాలు కట్టడం గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇది నవ భారతావని అన్నారు. ఈ నవ భారతాన్ని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ కృషి చేస్తోందని విమర్శించారు. కొత్త మొఘల్‌లకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు.  భారతదేశ చరిత్రలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొఘల్స్ హైలైట్ చేశారని ఆరోపించారు. చరిత్రలో   ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి రాయకుండా ... అంతా బాబర్, ఔరంగజేబు, షాజహాన్‌లదే అన్నట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులు చూపించారన్నారు. భారతదేశ చరిత్ర  ఛత్రపతి శివాజీ మహరాజ్, గురుగోవింద్ సింగ్ గురించి అని నేను చెప్పాలనుకుంటున్నానన్నారు. ఔరంగజేబ్ పాలనలో  ఇతర మతస్థులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని ఆరోపించారు. 'సనాతన్' సంస్కృతిని అంతం చేయడానికి ఔరంగజేబ్ ప్రయత్నించారని శర్మ అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget