Nadda vs Kharge in Rajya Sabha : రాజ్యసభలో మల్లికార్జున ఖర్గేకు క్షమాపణ చెప్పిన జేపీ నడ్డా!
Nadda vs Kharge : ఖర్గే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని నడ్డా ఆరోపించారు. ఇలా విమర్శలు చేసే క్రమంలో ఓ మాట తూలారు. అందుకే ఆయన క్షమాపణలు చెప్పారు.

Nadda vs Kharge in Rajya Sabha : రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగంపై స్పందిస్తూ, సభ నాయకుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శలు చేశారు. కానీ తరువాత క్షమాపణ కూడా చెప్పారు. నడ్డా ఖర్గేను అనుభవజ్ఞుడైన నాయకుడిగా అభివర్ణిస్తూ, ఆయన చాలా మంత్రిత్వ శాఖలపై సుదీర్ఘ ప్రకటన చేశారని, దీనికి సమాధానం ఇస్తామని అన్నారు. అయితే, ఖర్గే భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన పదాల ఎంపిక తన స్థాయిని తగ్గించేలా ఉందని అన్నారు. ప్రధానమంత్రిపై చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు. ఆయన మాట్లాడుతూ, 'నేను వారి బాధను అర్థం చేసుకోగలను, ఎందుకంటే వారు 11 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో కూర్చుంటున్నారు.' అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు.
'మానసిక సమతుల్యత' వ్యాఖ్యపై వివాదం
నడ్డా మరింతగా విమర్శలు చేస్తూ ఖర్గే కాంగ్రెస్ పార్టీతో ఈ విధంగా కలిసిపోయారు, పార్టీయే వారికి ప్రథమ ప్రాధాన్యతగా మారింది. దేశం రెండో ప్రాధాన్యంగా ఉంది., 'మానసిక సమతుల్యత కోల్పోయి' ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఘాటుగా కామెంట్ చేశారు.
నడ్డా వ్యాఖ్యలపై ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేశారి. ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతంర వ్యక్తం చేస్తూ నడ్డాపై మండిపడ్డారు. దీంతో సభలో పెద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నిరసనలు పెరగడంతో, నడ్డా తన కామెంట్స్కు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. 'మానసిక అసమతుల్యత' స్థానంలో 'భావోద్వేగం' అనే పదాన్ని ఉపయోగించాలని అన్నారు. అదే సమయంలో, ఈ వ్యాఖ్యను సభ కార్యకలాపాల నుంచి తొలగించాలని కూడా నడ్డా సభాపతిని కోరారు.
#WATCH | Discussion on Operation Sindoor | Leader of House in Rajya Sabha JP Nadda says, "He (RS LoP Mallikarjun Kharge) is a very senior leader but the way in which he had commented on the PM...I can understand his pain. He (PM Modi) has been there since 11 years now. He happens… pic.twitter.com/xqS4qLOOTt
— ANI (@ANI) July 29, 2025
ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు, నడ్డా విచారం వ్యక్తం చేశారు
జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందిస్తూ, తనను 'మెంటర్' అని పిలిస్తే ఊరుకోనని అన్నారు. ఆయన ఎదురుదాడి చేస్తూ, చాలా మంది ప్రభుత్వ మంత్రులు కూడా మానసిక సమతుల్యత కోల్పోయి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. దీనికి సమాధానంగా నడ్డా మాట్లాడుతూ, తన మాటలతో ఖర్గే మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ కోరుతున్నానని అన్నారు. అయితే, ప్రతిపక్షం భావోద్వేగంలో మునిగిపోయి ప్రధానమంత్రి గౌరవాన్ని కూడా పట్టించుకోలేదని ఆయన అన్నారు.
'నేను దీన్ని వదిలిపెట్టను': ఖర్గే ఎదురుదాడి
నడ్డా క్షమాపణపై ఖర్గే మాట్లాడుతూ, 'ఈ సభలో నేను గౌరవించే కొంతమంది నాయకులు ఉన్నారు. నడ్డా జీ , రాజ్నాథ్ జీ వారిలో ఉన్నారు, కానీ ఈ రోజు నాకు సలహా ఇస్తున్నారు, ఇది సిగ్గుచేటు. వారు స్పష్టంగా క్షమాపణ చెప్పాలి, నేను దీన్ని వదిలిపెట్టను.' ఈ మొత్తం ఘటనతో రాజ్యసభ కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది.
VIDEO | Rajya Sabha LoP Mallikarjun Kharge (@kharge) demanded an apology from the leader of the House, JP Nadda (@JPNadda), over his 'mental balance' remark. Later, the Union Minister apologised in the House.
— Press Trust of India (@PTI_News) July 29, 2025
"JP Nadda and Rajnath Singh are amongst the few Ministers in the House… pic.twitter.com/ZCpBcWiIfG





















