By: Ram Manohar | Updated at : 04 Jul 2023 12:30 PM (IST)
జమ్ముకశ్మీర్లోని లద్దాఖ్లో భూమి కంపించింది.
Jammu Kashmir Earthquake:
లద్దాఖ్లో భూకంపం..
జమ్ముకశ్మీర్లో భూకంపం కలకలం రేపింది. ఇవాళ (జులై 4) ఉదయం 7.38 నిముషాలకు ఉన్నట్టుండి భూమి కంపించింది. లద్దాఖ్లో ఈ ప్రభావం కనిపించింది. కార్గిల్కి 401 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో 150 కిలోమీటర్ల లోతు వరకూ భూమి కంపించినట్టు భూకంప కేంద్ర వెల్లడించింది. రిక్టర్ స్కేల్పై 4.7గా తీవ్రత నమోదైంది. అయితే...ఈ ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లలేదని భూకంప కేంద్రం స్పష్టం చేసింది. అంతకు ముందు జూన్ 18వ తేదీన లేహ్ లద్దాఖ్ ప్రాంతంలోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.3గా నమోదైంది. అదే రోజున జమ్ముకశ్మీర్లోని దొడ జిల్లాలో రెండు సార్లు భూమి కంపించింది. అప్పుడు కూడా ఉదయమే ఈ ముప్పు ముంచుకొచ్చింది. ఈ ఘటనలో కొన్ని భవనాలకు పగుళ్లు వచ్చాయి. ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు.
Earthquake of Magnitude:4.7, Occurred on 04-07-2023, 07:38:12 IST, Lat: 38.12 & Long: 76.81, Depth: 150 Km ,Location: 401km N of Kargil, Laddakh, India for more information Download the BhooKamp App https://t.co/U5wFJefTRy pic.twitter.com/Dx70O4QsaD
— National Center for Seismology (@NCS_Earthquake) July 4, 2023
ఢిల్లీలోనూ..
జూన్ 13న దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేశాయి. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్మూ కశ్మీర్ లోని దోడాలో భూకంపం ఆందోళనకు గురి చేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4 గా నమోదు అయింది. దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్(నేషనల్ క్యాపిటర్ రీజియన్), పంజాబ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఢిల్లీలో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. జమ్మూ కశ్మీర్ లో రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించగా, ఢిల్లీలో 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. మణిపూర్ లో సైతం 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రత నమోదు అయింది. దీని ప్రకంపనలు హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లలో కనిపించింది. దోడాలో సంభవించిన ప్రధాన భూకంపం తర్వాత ఆయా రాష్ట్రాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదు అయ్యాయి.
Strong Earthquake Tremors !! Who felt it ? pic.twitter.com/KCxAaDe3V5
— Gagandeep Singh (@Gagan4344) June 13, 2023
Also Read: పాకిస్థాన్ జైళ్లలో వందలాది మంది భారతీయులు, భద్రత లేక నరకయాతన
సోనియా గాంధీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ని అరెస్ట్ చేసిన ఈడీ
ఉజ్జెయిన్ అత్యాచార కేసు నిందితుడి ఇల్లు కూల్చివేత, బుల్డోజర్తో ధ్వంసం - వీడియో
Gayatri Joshi: ఇటలీ రోడ్లపై కార్ రేస్ - ‘స్వదేశ్’ మూవీ నటికి తీవ్ర గాయాలు, ఇద్దరు మృతి
గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పెంచిన కేంద్రం, కేబినెట్ సమావేశంలో నిర్ణయం
Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్కు మరోసారి ఊరట !
Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్ సర్వీసులు - ఈ నగరాల నుంచే
/body>