News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chandrayaan-3: చంద్రుడు, భూమి ఫోటోలు తీసిన చంద్రయాన్-3, ట్విట్టర్‌లో షేర్ చేసిన ఇస్రో

Chandrayaan-3: చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ మరోసారి చంద్రుని చిత్రాలు తీసింది. దాంతో పాటు భూమిని క్లిక్‌మనిపించింది. ఆ పిక్స్‌ను ఇస్రో షేర్ చేసింది.

FOLLOW US: 
Share:

Chandrayaan-3: చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలో మూడోసారి కక్ష్యను మార్చుకున్న చంద్రయాన్-3.. తాజాగా జాబిలిని తన కెమెరాల్లో బంధించింది. చంద్రయాన్-3 లో ఉన్న ల్యాండర్ ఇమేజ్ కెమెరాల నుంచి భూమిని ఫోటో తీసింది. చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిన తర్వాత చంద్రుడి ఫోటోను తీసి పంపించింది. ల్యాండర్ హారిజంటల్ వెలాసిటీ కెమెరా ఈ ఫోటోలను క్లిక్‌మనిపించింది. తాజాగా పంపిన ఫోటోలో చంద్రుడి క్రాటర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎడ్డింగ్టన్, అరిస్టార్‌చస్‌, పైతాగరస్, ఓసియన్ ప్రొసెల్లరమ్ లాంటి బిల్హాలు ఈ తాజా చిత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రుడి ఉత్తర ధ్రువంలో ఉన్న బిల్వాల్లో, ప్రొసెల్లరమ్ చాలా పెద్దది. ఈ ప్రొసెల్లరమ్ సుమారు 2500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అలాగే 4 లక్షల చదరపు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. బుధవారం రోజు కక్ష్య మార్పుతో ప్రస్తుతం చంద్రయాన్-3.. 174 కి.మీ X 1,437 కి.మీ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. తదుపరి కక్ష్య మార్పు ఆగస్టు 14వ తేదీన ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య జరగనుంది. సోమవారం, ఇస్రో చంద్రయాన్-3 ఎత్తును దాదాపు 14 వేల కిలోమీటర్ల మేర తగ్గించింది. ఆగస్టు 16వ తేదీన చంద్రయాన్-3 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆగస్టు 17న ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్) లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోనుంది. 

ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత, ఇస్రో ల్యాండింగ్ మాడ్యూల్ ను పెరిలున్ (చంద్రునికి అత్యంత సమీపంలోని స్థానం) 30 కిలోమీటర్లు, అపోలూన్ (చంద్రునికి దూరమైన స్థానం) 100 కిలోమీటర్ల కక్ష్యలోకి డీ-బూస్ట్ చేస్తుంది. చివరి ల్యాండింగ్ ఈ కక్ష్య నుంచి జరగనుంది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే ఈనెల 23న చంద్రయాన్ చంద్రుడిపై దిగుతుంది. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్, అన్ని సెన్సార్లు, దాని రెండు ఇంజిన్లు పని చేయకపోయినా ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయగలదని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్న విషయం తెలిసిందే.

Also Read: Independence Day 2023: ప్రపంచం దృష్టిలో భారత్ స్థానమేంటి ? రాబోయే 10 ఏళ్లలో అందుకోవాల్సిన లక్ష్యాలు ఏంటి?

జులై 14వ తేదీన చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టగా.. జులై 15, 25 తేదీల మధ్య 5 భూకక్ష్యలను మార్చుకుంది. ఆగస్టు 1వ తేదీన ట్రాన్ లూనార్ ఇంజెక్షన్ విన్యాసాన్ని చేపట్టింది. దాదాపు 3.6 లక్షల కిలోమీటర్ల ఎత్తులో చంద్రుని వైపు కదిలింది. ఆగస్టు 5వ తేదీన చంద్రుని కక్ష్య(లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్)లోకి ప్రవేశించింది. 6వ తేదీన సాయంత్రం వేళ చంద్రునికి మరింత దగ్గరగా వెళ్లేందుకు మరో కక్ష్యను మార్చుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కావడనికి చంద్రయాన్-3 చంద్రుని కక్ష్యలను మార్చాల్సి ఉంటుంది.

Published at : 10 Aug 2023 02:37 PM (IST) Tags: ISRO Chandrayaan 3 Pics Of Moon And Earth Moon Pics By Chandrayaan-3 Earth Pics By Chandrayaan-3

ఇవి కూడా చూడండి

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

VCRC Recruitment: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం