అన్వేషించండి

Kakinada Port Case: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ, సీఐడీ దూకుడు, వారికి మరోసారి నోటీసులు జారీ

Andhra Pradesh News | వైసీపీ హయాంలో కేవీ రావును బెదిరించి కాకినాడ పోర్టు హక్కులను బలవంతంగా లాక్కున్నారని ఫిర్యాదుతో పాటు నగదు సేకరణపై దర్యాప్తు సంస్థలు ఈడీ, సీఐడీ దూకుడు పెంచాయి.

ED Probe On Kakinada Port Issue | అమరావతి: కాకినాడ పోర్టు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల పార్లమెంటు సమావేశాలు ఉన్నాయనే కారణంగా ఎంపీ విజయసాయిరెడ్డి, అనారోగ్య కారణాలతో అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి విచారణకు హాజరు కాలేదు. 

మరోసారి ఈడీ నోటీసులు
ఈ కేసులో ఎంపీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఇప్పటికే విచారణకు హాజరు కాగా, విచారణకు రావాలని విక్రాంత్ రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ. 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు అరబిందో ఆ డబ్బులు ఎలా సమకూర్చింది, ఎవరిచ్చారు అనేదానిపైనే విచారణ కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లో రూ.3600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి తీసుకున్నారు. అయితే తననుంచి బలవంతంగా లాగేసుకున్నారని కేవీ రావు కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదు చేశారు. పోర్టు వ్యవహారంలో  ఆరో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ కు చెల్లించిన రూ.494 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. 

కాకినాడ పోర్ట్ వ్యవహారంలో ఒక్క పైసా తీసుకోవడానికి కూడా అనుమతించబోమని అరవిందో సంస్థకు ఏపీ సిఐడి లేఖ రాసింది. డివిడెండ్లు తీసుకున్నా చర్యలు తప్పవని సీఐడీ హెచ్చరించింది. వేరొకరి నంచి లాక్కోవడమే అక్రమం అవుతుందని, దాని నుంచి లాభాలు పొందడం కూడా నేరమే అని స్పష్టం చేసింది. నాలుగేళ్ల వ్యవధిలో రూ.102 కోట్లు తీసుకున్నారని, ఇక ఆపేయండంటూ అధికారులు స్పష్టం చేశారు. అరబిందో డైరెక్టర్లను విచారించేందుకు సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి నేడు సీఐడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణకు సంబంధించి ఇప్పటికే అరవిందో సంస్థకు ఏపీ సిఐడి లేఖ రాసింది. 

చిక్కుల్లో అరబిందో సంస్థ

గత ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడిన అరబిందో సంస్థ చిక్కుల్లో పడిందన్నారు ఏపీ సీఐడీ చీఫ్. కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరబిందో తీసుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. అరబిందో డైరెక్టర్లు, ఆరో ఇన్‌ఫ్రా సంస్థకు సీఐడీ లేఖలు రాసింది. బెదిరింపులకు పాల్పడి 2021లో కేవీ రావు నుంచి 41.12 శాతం వాటాలు లాక్కున్నారని, దానిపై వచ్చిన లాభాలు, డివిడెండ్లు పంచుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఆ లేఖలో స్పష్టం చేశారు. 

మీతో ఆధారాలుంటే ఇవ్వండి, చట్టప్రకారం చర్యలు

‘నాలుగేళ్లలో డివిడెంట్‌ కింద రూ.102కోట్లు తీసుకున్నారు. కేవీ రావు నుంచి యాజమాన్య హక్కులు లాక్కోవడంపై విచారణ జరుపుతున్నాం. దీనికి సంబంధించి అన్ని నిబంధనలు ఉల్లంఘించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారంపై విచారణ జరుపుతున్నాం. పూర్తి హక్కులున్న కేవీ రావును బెదిరించినట్లు ఆయన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం. మీరు ఒక్క అడుగు ముందుకేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించాం. కాకినాడ పోర్టుపై పూర్తి హక్కులు తనకే ఉన్నట్లు కేవీ రావు ఆధారాలు సమర్పించారు. మీతో ఆధారాలు ఉంటే సమర్పించండి. దీనిపై న్యాయబద్ధంగా విచారణ చేస్తాం. బాధితుడిగా ఉన్న కేవీరావు హక్కులను కాపాడాల్సిన తమపై ఉందిని’ సిఐడి చీఫ్ లేఖలో తెలిపారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
IndiGo Crisis: ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!

వీడియోలు

Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko |  రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
IndiGo Crisis: ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ
MPs Dance: పెళ్లి వేడుకలో ముగ్గురు మహిళా ఎంపీల డాన్స్ వైరల్ - రాజకీయం అంటే ఇదే !
పెళ్లి వేడుకలో ముగ్గురు మహిళా ఎంపీల డాన్స్ వైరల్ - రాజకీయం అంటే ఇదే !
Telangana Global Summit 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా చైనా రోబో! మాటలతో కట్టిపడేస్తున్న మరమనిషి!
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా చైనా రోబో! మాటలతో కట్టిపడేస్తున్న మరమనిషి!
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ - దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్... ప్రత్యేకతలేంటో తెలుసా?
Embed widget