అన్వేషించండి

Aditya L1: ఇస్రో మరో ఘనత - 'ఆదిత్య ఎల్ 1' విజయవంతం, లగ్రాంజ్ పాయింట్ లోకి ప్రవేశం

Isro Adity L1: సూర్యుడి రహస్యాల గుట్టు విప్పేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఈ స్పేస్ క్రాఫ్ట్ తన గమ్య స్థానాన్ని చేరుకుంది.

Aditya L1 Space Craft Reached its Destination: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. సూర్యున్ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్1 (Aidtya L1) స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను తుది కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు శనివారం చేపట్టిన కీలక ప్రక్రియ విజయవంతమైంది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కి.మీ దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి ఈ వ్యోమనౌకను సాయంత్రం 4 గంటలకు ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. హాలో కక్ష్య నుంచి ఇది నిరంతరం సూర్యున్ని పర్యవేక్షిస్తుంది. 

ప్రధాని అభినందనలు

'ఆదిత్య L1' మిషన్ సక్సెస్ పై ప్రధాని మోదీ (PM Modi) ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. 'సూర్యునిపై అధ్యయనానికి ప్రయోగించిన ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ (Aditya L1 Space Craft) గమ్య స్థానానికి చేరుకోవడం మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి నిదర్శనం. ఇస్రో సైంటిస్టులకు అభినందనలు' అంటూ ట్వీట్ చేశారు.

సెప్టెంబర్ 2న ప్రయోగం

సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే లక్ష్యంగా 'ఆదిత్య L1' ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ - 57 వాహక నౌక ద్వారా 'ఆదిత్య L1' నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వ్యోమనౌక మొత్తం 7 పేలోడ్స్ మోసుకెళ్లింది. ఈ వ్యోమ నౌక భూమి నుంచి అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కి.మీ ప్రయాణించి ఎల్ - 1 పాయింట్ లోకి విజయవంతంగా ప్రవేశించింది. ఆ పాయింట్ లో ఉంటే సూర్యుడిని ప్రతి క్షణం పరిశీలించేందుకు వీలవుతుందని, అక్కడ సూర్య గ్రహణ ప్రభావం సైతం ఉండబోదని ఇస్రో గతంలో తెలిపింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఈ అధ్యయనాల వల్ల సౌర తుపానులు సంభవించే అవకాశాలను ముందుగానే తెలుసుకునే వీలుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తుపానుల నుంచి అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలను రక్షించేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అంతరిక్షంలో భారత్ కు 50కు పైగా శాటిలైట్లు ఉన్నాయని వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (Somanath) గతంలో తెలిపారు. సౌర తుపానుల కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా, ప్రమాదకర తరంగాల వల్ల విద్యుత్ వ్యవస్థకు సైతం ముప్పు కలిగించే అవకాశాలున్నట్లు చెప్పారు. అలాంటి ముప్పును అడ్డుకునేందుకే ఈ ప్రయోగం చేపట్టినట్లు వివరించారు.

Also Read: Robert Kiyosaki: సంపద సూత్రాలు చెప్పిన వ్యక్తికి వేల కోట్ల అప్పు - 'రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌' రచయిత పరిస్థితి ఇది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget