అన్వేషించండి

Aditya L1: ఇస్రో మరో ఘనత - 'ఆదిత్య ఎల్ 1' విజయవంతం, లగ్రాంజ్ పాయింట్ లోకి ప్రవేశం

Isro Adity L1: సూర్యుడి రహస్యాల గుట్టు విప్పేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఈ స్పేస్ క్రాఫ్ట్ తన గమ్య స్థానాన్ని చేరుకుంది.

Aditya L1 Space Craft Reached its Destination: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. సూర్యున్ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్1 (Aidtya L1) స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను తుది కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు శనివారం చేపట్టిన కీలక ప్రక్రియ విజయవంతమైంది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కి.మీ దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి ఈ వ్యోమనౌకను సాయంత్రం 4 గంటలకు ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. హాలో కక్ష్య నుంచి ఇది నిరంతరం సూర్యున్ని పర్యవేక్షిస్తుంది. 

ప్రధాని అభినందనలు

'ఆదిత్య L1' మిషన్ సక్సెస్ పై ప్రధాని మోదీ (PM Modi) ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. 'సూర్యునిపై అధ్యయనానికి ప్రయోగించిన ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ (Aditya L1 Space Craft) గమ్య స్థానానికి చేరుకోవడం మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి నిదర్శనం. ఇస్రో సైంటిస్టులకు అభినందనలు' అంటూ ట్వీట్ చేశారు.

సెప్టెంబర్ 2న ప్రయోగం

సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే లక్ష్యంగా 'ఆదిత్య L1' ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ - 57 వాహక నౌక ద్వారా 'ఆదిత్య L1' నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వ్యోమనౌక మొత్తం 7 పేలోడ్స్ మోసుకెళ్లింది. ఈ వ్యోమ నౌక భూమి నుంచి అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కి.మీ ప్రయాణించి ఎల్ - 1 పాయింట్ లోకి విజయవంతంగా ప్రవేశించింది. ఆ పాయింట్ లో ఉంటే సూర్యుడిని ప్రతి క్షణం పరిశీలించేందుకు వీలవుతుందని, అక్కడ సూర్య గ్రహణ ప్రభావం సైతం ఉండబోదని ఇస్రో గతంలో తెలిపింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఈ అధ్యయనాల వల్ల సౌర తుపానులు సంభవించే అవకాశాలను ముందుగానే తెలుసుకునే వీలుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తుపానుల నుంచి అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలను రక్షించేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అంతరిక్షంలో భారత్ కు 50కు పైగా శాటిలైట్లు ఉన్నాయని వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (Somanath) గతంలో తెలిపారు. సౌర తుపానుల కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా, ప్రమాదకర తరంగాల వల్ల విద్యుత్ వ్యవస్థకు సైతం ముప్పు కలిగించే అవకాశాలున్నట్లు చెప్పారు. అలాంటి ముప్పును అడ్డుకునేందుకే ఈ ప్రయోగం చేపట్టినట్లు వివరించారు.

Also Read: Robert Kiyosaki: సంపద సూత్రాలు చెప్పిన వ్యక్తికి వేల కోట్ల అప్పు - 'రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌' రచయిత పరిస్థితి ఇది

టాప్ హెడ్ లైన్స్

CJP Protest: రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!
రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!
NEET Paper Leak:పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
NEET Paper Leak Talks: NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget