అన్వేషించండి

Railways Ticketing System: ఇక నుంచి రైల్వేస్టేషన్లో టికెట్ టికెట్ అని వినిపిస్తుంది, రైల్వే కొత్త టికెటింగ్ సిస్టమ్ తెలుసా

IRCTC Railways Ticketing System | ప్రయాణికులు ఇక టికెట్ల కోసం కౌంటర్ల వద్దకు వెళ్లకుండానే అత్యవసరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. రైల్వే సిబ్బంది ప్లాట్‌ఫారమ్‌లలోనే టికెట్లు అమ్ముతారు.

Railways Ticketing System | దసరా, దీపావళి పండుగల సీజన్లలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భారీ రద్దీ ఏర్పడుతుంది. ముఖ్యంగా రిజర్వ్ చేయని టికెట్ కౌంటర్ల వద్ద ప్రజలు చాలాసేపు క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇకపై టికెట్ కోసం కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు, టికెట్ మీ వద్దకే వస్తుంది. ఉత్తర రైల్వే లక్నో డివిజన్ కొత్త పథకం ప్రకారం, ఇప్పుడు రైల్వే సిబ్బంది స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో తిరుగుతూ టిక్కెట్లు విక్రయిస్తారు. వీధి వ్యాపారులు వస్తువులను అమ్మినట్లుగానే ఈ కొత్త రైల్వే టికెట్ వ్యవస్థకు ఎం-యుటిఎస్ అని పేరు పెట్టారు. దక్షిణాదిన సైతం త్వరలో ఇలాంటి విధానాన్ని తెచ్చే అవకాశం ఉంది. పండుగల సమయంలో రద్దీని నియంత్రించడానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి ఈ వ్యవస్థను ప్రారంభించారు. రైల్వే కొత్త టికెటింగ్ సిస్టమ్ ఏంటో తెలుసుకుందాం. 

రైల్వే కొత్త టికెటింగ్ సిస్టమ్ ఏంటి?

రైల్వే కొత్త టికెటింగ్ సిస్టమ్ ఎం-యుటిఎస్ (M UTS) అనేది మొబైల్ టికెటింగ్ మేషిన్. ఇది రోడ్డు రవాణాలో భాగంగా బస్సుల్లో టికెట్లు ఇచ్చే మేషిన్ తరహాలో ఉంటుంది. ఈ యంత్రం తేలికగా ఉంటుంది, దీనికి వైర్లు ఉండవు. రైల్వే సిబ్బంది దీన్ని తీసుకుని ప్లాట్‌ఫారమ్‌లో తిరగవచ్చు. అక్కడే నిలబడి ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు టిక్కెట్లు జారీ చేయవచ్చు. ప్రయాణికులు ఈ ఎం యూటీఎస్ నుండి టిక్కెట్లు పొందవచ్చు. తక్షణమే ప్రయాణించాలనుకునే వారు కౌంటర్ల రద్దీని నివారించాలనుకునే వారికి ఇది చాలా ప్రయోజనం చేకూర్చనుంది.  

ఎక్కడెక్కడ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది?

మొదటి దశలో నాలుగు ప్రధాన స్టేషన్లలో రైల్వే ఎం-యుటిఎస్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో చార్‌బాగ్ రైల్వే స్టేషన్, అయోధ్య రైల్వే స్టేషన్ (Ayodhya Railway station), వారణాసి రైల్వే స్టేషన్,  ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్ ఉన్నాయి. ఈ స్టేషన్లలో రైల్వే సిబ్బంది ప్లాట్‌ఫారమ్‌లలో తిరుగుతూ ప్రయాణికులకు టిక్కెట్లు జారీ చేస్తారు. దీని కోసం చార్‌బాగ్, అయోధ్యతో పాటు వారణాసిలలో 10 చొప్పున ఎం-యుటిఎస్ యంత్రాలు అందుబాటులో ఉంచుతారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లో 5 యంత్రాలు జారీ చేశారు. అంటే మొత్తం 35 యంత్రాలతో ఎం యూటీఎస్ రైల్వే టికెటింగ్ సిస్టమ్ ప్రారంభమవుతుంది. 

ఈ విధంగా టికెట్ తీసుకోవడానికి యూనిఫాం ధరించిన రైల్వే సిబ్బంది రైల్వే స్టేషన్లలో ఉంటారు. వారి చేతిలో ఎం-యుటిఎస్ మేషిన్ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్పి నగదు చెల్లిస్తే వారు MUTS మేషిన్ నుంచి టికెట్‌ను ప్రింట్ చేసి ఇస్తారు. అలాగే చెల్లింపు కోసం నగదు, UPI ఆప్షన్ సైతం ఉంటుంది. ఇక్కడ తరువాత త్వరలోనే మరికొన్ని రైల్వే డివిజన్లు, జంక్షన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget