అన్వేషించండి

Narayana murthy: యువత వారానికి 70గంటలు పనిచేయాలి-వర్క్‌ కల్చర్‌ మారాలన్న ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి

ఐటీలో యువ ఉద్యోగులు వారానికి 70గంటలు పనిచేయాల్సిందే అన్నారు ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి. అంతేకాదు ప్రపంచంతో పోటీ పడాలంటే... దేశంలో వర్క్‌ కల్చర్‌ కూడా మారాలన్నారు.

ఇన్ఫోసిస్‌ సహ వ్యవవస్థాపకులు నారాయణమూర్తి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ సెక్టార్‌లో మరింత అభివృద్ధి సాధించాలంటే... కొన్ని మార్పులు జరగాలన్నారు. మన దేశం  ప్రపంచంతో పోటీ పడాలంటే మరింత వేగంగా ముందడుగులు వేయాలన్నారు. ముఖ్యంగా యువతకు కొన్ని సూచనలు చేశారాయన. ఐటీ రంగంలో పనిచేస్తున్న యువ  ఉద్యోగులు.. వారంలో 70గంటల పనిచేయడానికి సిద్ధంగా ఉండాన్నారు. ఆర్థిక వ్యవస్థల పరంగా గణనీయ వృద్ధి సాధించిన దేశాల సరసన భారత్ నిలవాలంటే.. యువత  తీవ్రంగా కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి.

గత రెండు, మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో... మన భారత దేశం పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని అన్నారు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి. దేశంలో పని ఉత్పాదకత.... చాలా తక్కువగా ఉందని, ప్రపంచంలోనే అత్యల్ప ర్యాంక్‌లో ఉందని అన్నారు. ఎక్కువ కష్టపడకపోతే... ముందుకు వెళ్లడం కష్టమే అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీలో పనిగంటలు పెంచాయని.. చైనాతో పోటీపడుతున్నాయని తెలిపారు. భారతీయ యువకులు కూడా ఎక్కువ గంటలు పనిచేయాలని.. లేకపోతే ఆర్థిక పురోగతిలో ముందున్నదేశాలతో పోటీపడటం కష్టమే అన్నారు ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి. 

ప్రభుత్వంలో అవినీతిని కూడా తగ్గించాలని సూచించారు. నేటి యువత... దేశం కోసం వారానికి 70 గంటలు పనిచేయాలని అనుకుంటానని ప్రతిజ్ఞ పూనాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్లు, జపనీయులు ఇదే చేశారన్నారు. చైనా వంటి దేశాలతో పోటీపడేందుకు ఇది అవసరమని చెప్పారాయన. ప్రతి జర్మన్ దేశ అభివృద్ధి కోసం అదనపు పని చేయడానికి ముందడుగు వేస్తున్నారని.. భారతీయులు కూడా ఇదే విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి. 

సాధారణంగా... భారత్‌లో రోజుకు 8గంటల పనిగంటలు ఉంటాయి. ప్రైవేట్‌ సెక్టార్‌లో వారానికి ఒక రోజు సెలవు ఉండగా... ఐటీ సెక్టార్‌లో మాత్రం శని, ఆదివారాలు సెలవు. ఈ లెక్కన వారానికి ఒక్కో ఉద్యోగి దాదాపు 50 గంటల వరకు పనిచేస్తుంటారు. అయితే... ఇది సరిపోదని.. వారానికి 70 గంటల పనిచేయాలన్నది ఇన్పోసిస్‌ నారాయణ మూర్తి వాదన అంటే. రోజుకు సగటును... 12గంటలు పనిచేయాలని ఆయన చెప్తున్నారు. దేశం కోసం శ్రమిస్తామని యువత ప్రతిబూని పనిచేయాలన్నారు. 3 వన్‌ 4 క్యాపిటల్స్ పోడ్‌కాస్ట్ 'ది రికార్డ్' మొదటి ఎపిసోడ్‌లో... ఈ వ్యాఖ్యలు చేశారు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి. 

దేశ జనాభాలో యువత ఎక్కువగా ఉన్నారని... కనుక దేశాన్ని నిర్మించగలిగే శక్తి వారిలో ఉందన్నారు ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి. యువతలో పరివర్తన రావాలని చెప్పారు. అభివృద్ధిలో  భారతదేశాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మరింత నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన విధానం అవసరమన్నారు. క్రమశిక్షణతో ఉండి పని ఉత్పాదకత మెరుగుపరచకపోతే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదన్నారు. అందుకే అత్యంత క్రమశిక్షణతో, కష్టపడి పనిచేసే వ్యక్తులుగా దేశ యువత మరాలన్నారు. భారతీయ యువతలో వర్క్‌ కల్చర్‌ మారి తీరాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతోపాటు కష్టపడేతత్వం నేర్చుకోవాలన్నారు. దేశ ప్రగతి కోసం అందరి కలిసి కష్టపడాలన్నారు ఇన్ఫోసిస్‌ సహ వ్యవవస్థాపకులు నారాయణమూర్తి.

టాప్ హెడ్ లైన్స్

Wayanad Landslide: వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
Wayanad Landslide: కేరళలోని వయనాడ్‌లో ఆగని విషాదాలు! కొండచరియలు విరిగిపడి మరో ముగ్గురు మృతి! ప్రకృతి బీభత్సానికి కారణమేంటీ?
కేరళలోని వయనాడ్‌లో ఆగని విషాదాలు! కొండచరియలు విరిగిపడి మరో ముగ్గురు మృతి! ప్రకృతి బీభత్సానికి కారణమేంటీ?
Wayanad Tunnel Landslide: వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం - విరిగిపడిన కొండ చరియలు - ఒళ్ల గగుర్పొడిచే దృశ్యాలు
వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం - విరిగిపడిన కొండ చరియలు - ఒళ్ల గగుర్పొడిచే దృశ్యాలు
Breaking News: రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల
రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget