అన్వేషించండి

Indigo Crisis Action: ఇండిగో సంక్షోభంపై చర్యలు చేపట్టిన DGCA.. నలుగురిపై సస్పెన్షన్ వేటు

DGCA action against Indigo Crisis | ఇండిగో విమానయాన సంస్థ పనితీరుపై దర్యాప్తులో భాగంగా DGCA నలుగురు ఫ్లైట్ ఇన్స్పెక్టర్లను తొలగించింది. వీరి నిర్లక్ష్యం వల్లే సంక్షోభం తలెత్తినట్లు గుర్తించింది.

Indigo Airlines Crisis: గత కొన్ని రోజులుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రాథమిక విచారణలో చర్యలు చేపట్టింది. విచారణలో కొంతమంది ఇన్‌స్పెక్టర్లు దోషులుగా తేలడంతో, ఇండిగోను పర్యవేక్షించే నలుగురు ఫ్లైట్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్లను DGCA తొలగించింది.

ఈ ఇన్‌స్పెక్టర్లందరూ ఇండిగో విమానాల భద్రత, నిర్వహణను పరిశీలించే పని చేస్తున్నారు. తనిఖీ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా DGCA ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్యలు తీసుకున్న అధికారులు అందరూ DGCAలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారని సమాచారం. ఎయిర్‌లైన్స్, ముఖ్యంగా ఇండిగో సేఫ్టీ, ఆపరేషనల్ ఓవర్‌సైట్‌ను పర్యవేక్షించే బాధ్యతల్ని వీరు నిర్వర్తిస్తున్నారు. 

విమానాశ్రయాలలో గందరగోళంపై హైకోర్టు ఆగ్రహం

విమాన సర్వీసుల అంతరాయం, విమానాశ్రయంలో ప్రయాణీకుల ఇబ్బందులపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంతో పాటు DGCAని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందని, ప్రయాణికులకు సహాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ఇటీవల ప్రశ్నించింది. విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను చూసుకోవడానికి, వారి ఇబ్బందులను నివారించడానికి ప్రభుత్వం ఏం చేసిందో తెలపాలని కోర్టు వారికి నోటీసులు ఇచ్చింది.

ఈ సమస్య కేవలం ప్రయాణీకుల ఇబ్బందులకు మాత్రమే పరిమితం కాలేదని, ఇందులో ఆర్థిక నష్టం, వ్యవస్థ వైఫల్యం ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. ప్రయాణికులకు పరిహారం చెల్లించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇండిగో ఎయిర్‌లైన్ సిబ్బంది బాధ్యతను నిర్ధారించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.

విమాన ఛార్జీల పెరుగుదలపై కోర్టు ఆగ్రహం

దేశంలో అత్యధిక సర్వీసులు అందించే ఇండిగో ఎయిర్‌లైన్స్ పలు విమానాలు రద్దు చేయడంతో విమాన టికెట్ ఛార్జీలు భారీగా పెరిగాయి.  పెరిగిన విమాన టికెట్ ధరలపై కూడా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గతంలో ₹5,000లకు లభించే టిక్కెట్లు, ఇప్పుడు ₹30,000 –35,000లకు ఎలా పెరిగాయని ప్రశ్నించింది. సంక్షోభ సమయంలో ఇతర ఎయిర్‌లైన్స్‌కు ఇంత లాభం ఎలా లభించిందని ధర్మాసనం కేంద్రం, డీజీసీఏలను ప్రశ్నించింది. ఇంత ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం ఎలా సాధ్యం, ఇది కరేక్టేనా అని ప్రశ్నించింది.

దీనికి సమాధానంగా, ASG చేతన్ శర్మ మాట్లాడుతూ, పూర్తి చట్టపరమైన వ్యవస్థ అమలులో ఉందన్నారు. కేంద్రం చాలా కాలం నుంచి FDTLని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. అయితే ఇండిగో ఎయిర్‌లైన్ జూలై, నవంబర్ ఫేజ్ కోసం ఉపశమనం కోరిందన్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని ఛార్జీలకు పరిమితి విధించడం ఇదే మొదటిసారి అని, ఇది ఒక కఠినమైన నియంత్రణ చర్య అని అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Narendra Modi Longest Serving Elected Prime Minister: చారిత్రాత్మక రికార్డుకు అడుగు దూరంలో మోదీ - జూన్ 9న నెహ్రూ రికార్డు బ్రేక్.. సుదీర్ఘకాలం ఎన్నికైన’ ప్రధానిగా సరికొత్త చరిత్ర!
చారిత్రాత్మక రికార్డుకు అడుగు దూరంలో మోదీ - జూన్ 9న నెహ్రూ రికార్డు బ్రేక్.. సుదీర్ఘకాలం ఎన్నికైన’ ప్రధానిగా సరికొత్త చరిత్ర!
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ABP India at 2047 Conclave: పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Embed widget