అన్వేషించండి

Indian Railways: డిజిల్ ఇంజన్లను మూలకుపడేయనున్న రైల్వే శాఖ - ఎందుకో తెలుసా ?

Indian Railways: ఇండియన్ రైల్వేస్ నెట్‌వర్క్‌లో వంద శాతం విద్యుదీకరణ త్వరలోనే పూర్తి కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ నివేదిక విడుదల చేసింది.

Indian Railways: ఇండియన్ రైల్వేస్ నెట్‌వర్క్‌లో వంద శాతం విద్యుదీకరణ త్వరలోనే పూర్తి కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ నివేదిక విడుదల చేసింది. జులై 31 నాటికి 69,102 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్‌లో విద్యుదీకరణ పూర్తయింది. ఇంకా కేవలం 698 కిలోమీటర్ల నెట్‌వర్క్‌లో విద్యుదీకరణ పనులు పూర్తి చేస్తే మొత్తం వంద శాతం పనులు పూర్తయినట్లే. ఇప్పటివరకు రైల్వే నెట్‌వర్క్‌లో 99 శాతం విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు రైల్వే శాఖ తన నివేదికలో తెలిపింది.

కరోనా కారణంగా విద్యుదీకరణ పనుల్లో జాప్యం

ఎన్‌డీఏ ప్రభుత్వంలో నాటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆధ్వర్యంలో 2016లో ఈ మిషన్ ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయి. 2022 నాటికి రైల్వే నెట్‌వర్క్‌ను వంద శాతం విద్యుదీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మధ్యలో కరోనా రావడంతో పనులకు అంతరాయం కలిగింది. అయినా 2019-2025 మధ్య కాలంలో సగటున 15 కిలోమీటర్ల మేరకు విద్యుదీకరణ పనులను రైల్వే శాఖ చేపట్టింది. మరో రెండు, మూడు నెలల్లో మిగతా 698 కిలోమీటర్ల రైల్వే లైన్లలో విద్యుదీకరణ పనులు పూర్తి చేయాలని రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పనులు మిగిలి ఉన్న రాష్ట్రాలు, జోన్లు ఇవే...

భారతీయ రైల్వే నివేదిక ప్రకారం, దేశంలోని రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, గోవా, అస్సాం రాష్ట్రాలలో మాత్రమే విద్యుదీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 698 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ చేపట్టాల్సి ఉంది. ఇక జోన్ల వారీగా చూస్తే పశ్చిమ, మధ్య, తూర్పు, ఉత్తర, దక్షిణ మధ్య రైల్వే వంటి పెద్ద జోన్లలో ఇప్పటికే వంద శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించాయి. కొన్ని జోన్లలోనే ఇంకా స్వల్ప పనులు మిగిలి ఉన్నాయి.

భారతీయ రైల్వే నివేదిక ప్రకారం, 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, గోవా, అస్సాంలలో మాత్రమే విద్యుదీకరణ పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో మొత్తం 698 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. ఉత్తర పశ్చిమ రైల్వే (98%), దక్షిణ రైల్వే (97%), నైరుతి రైల్వే (95%), ఈశాన్య సరిహద్దు రైల్వే (94%) విద్యుదీకరణ పనులు పూర్తి చేశారు. మిగిలినవి మరో రెండు, మూడు నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉంది.

2019-2025 మధ్య కాలంలోనే వేగంగా పనులు

రైల్వే శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948 నుంచి 2014 వరకు 21,413 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ పూర్తి కాగా, 2014-2019 మధ్య కాలంలో 13,687 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయడం జరిగింది. ఇక 2019-2025 మధ్య కాలంలో 33,213 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు ఈ నివేదిక ద్వారా రైల్వే శాఖ తెలియజేసింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే విద్యుదీకరణ పనుల కోసం రూ. 6,150 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే వంద శాతం రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ లక్ష్యం సాధిస్తామని చెబుతున్నారు.

రైల్వేస్‌లో డీజిల్‌కు చెల్లు చీటి

ఇప్పటిదాకా విద్యుదీకరణ లేని లైన్లలో రైల్వే శాఖ డీజిల్‌తోనే రైలు ఇంజిన్లు నడిపిస్తున్నారు. వంద శాతం విద్యుదీకరణ లక్ష్యం సాధిస్తే డీజిల్‌ వాడకం పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా ఇంధన దిగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. దీనివల్ల రైల్వే శాఖకు ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, డీజిల్ వాడకం తగ్గిపోవడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Supreme Court on CJP Protest: విద్యార్థుల నిరసనపై విచారణ జరపాలి, ఇప్పుడే చర్యలొద్దు: లాఠీచార్జ్‌పై 8 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
విద్యార్థుల నిరసనపై విచారణ జరపాలి, ఇప్పుడే చర్యలొద్దు: లాఠీచార్జ్‌పై 8 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
PM Modi vs Mete: ప్రధాని మోదీ వీడియో తొలగించిన మెటా: ఐటీ శాఖ ఆగ్రహం, వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్!
ప్రధాని మోదీ వీడియో తొలగించిన మెటా: ఐటీ శాఖ ఆగ్రహం, వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్!
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget