అన్వేషించండి

Indian Railways: డిజిల్ ఇంజన్లను మూలకుపడేయనున్న రైల్వే శాఖ - ఎందుకో తెలుసా ?

Indian Railways: ఇండియన్ రైల్వేస్ నెట్‌వర్క్‌లో వంద శాతం విద్యుదీకరణ త్వరలోనే పూర్తి కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ నివేదిక విడుదల చేసింది.

Indian Railways: ఇండియన్ రైల్వేస్ నెట్‌వర్క్‌లో వంద శాతం విద్యుదీకరణ త్వరలోనే పూర్తి కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ నివేదిక విడుదల చేసింది. జులై 31 నాటికి 69,102 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్‌లో విద్యుదీకరణ పూర్తయింది. ఇంకా కేవలం 698 కిలోమీటర్ల నెట్‌వర్క్‌లో విద్యుదీకరణ పనులు పూర్తి చేస్తే మొత్తం వంద శాతం పనులు పూర్తయినట్లే. ఇప్పటివరకు రైల్వే నెట్‌వర్క్‌లో 99 శాతం విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు రైల్వే శాఖ తన నివేదికలో తెలిపింది.

కరోనా కారణంగా విద్యుదీకరణ పనుల్లో జాప్యం

ఎన్‌డీఏ ప్రభుత్వంలో నాటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆధ్వర్యంలో 2016లో ఈ మిషన్ ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయి. 2022 నాటికి రైల్వే నెట్‌వర్క్‌ను వంద శాతం విద్యుదీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మధ్యలో కరోనా రావడంతో పనులకు అంతరాయం కలిగింది. అయినా 2019-2025 మధ్య కాలంలో సగటున 15 కిలోమీటర్ల మేరకు విద్యుదీకరణ పనులను రైల్వే శాఖ చేపట్టింది. మరో రెండు, మూడు నెలల్లో మిగతా 698 కిలోమీటర్ల రైల్వే లైన్లలో విద్యుదీకరణ పనులు పూర్తి చేయాలని రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పనులు మిగిలి ఉన్న రాష్ట్రాలు, జోన్లు ఇవే...

భారతీయ రైల్వే నివేదిక ప్రకారం, దేశంలోని రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, గోవా, అస్సాం రాష్ట్రాలలో మాత్రమే విద్యుదీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 698 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ చేపట్టాల్సి ఉంది. ఇక జోన్ల వారీగా చూస్తే పశ్చిమ, మధ్య, తూర్పు, ఉత్తర, దక్షిణ మధ్య రైల్వే వంటి పెద్ద జోన్లలో ఇప్పటికే వంద శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించాయి. కొన్ని జోన్లలోనే ఇంకా స్వల్ప పనులు మిగిలి ఉన్నాయి.

భారతీయ రైల్వే నివేదిక ప్రకారం, 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, గోవా, అస్సాంలలో మాత్రమే విద్యుదీకరణ పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో మొత్తం 698 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. ఉత్తర పశ్చిమ రైల్వే (98%), దక్షిణ రైల్వే (97%), నైరుతి రైల్వే (95%), ఈశాన్య సరిహద్దు రైల్వే (94%) విద్యుదీకరణ పనులు పూర్తి చేశారు. మిగిలినవి మరో రెండు, మూడు నెలల్లో పూర్తి చేసే అవకాశం ఉంది.

2019-2025 మధ్య కాలంలోనే వేగంగా పనులు

రైల్వే శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948 నుంచి 2014 వరకు 21,413 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ పూర్తి కాగా, 2014-2019 మధ్య కాలంలో 13,687 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయడం జరిగింది. ఇక 2019-2025 మధ్య కాలంలో 33,213 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు ఈ నివేదిక ద్వారా రైల్వే శాఖ తెలియజేసింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే విద్యుదీకరణ పనుల కోసం రూ. 6,150 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే వంద శాతం రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ లక్ష్యం సాధిస్తామని చెబుతున్నారు.

రైల్వేస్‌లో డీజిల్‌కు చెల్లు చీటి

ఇప్పటిదాకా విద్యుదీకరణ లేని లైన్లలో రైల్వే శాఖ డీజిల్‌తోనే రైలు ఇంజిన్లు నడిపిస్తున్నారు. వంద శాతం విద్యుదీకరణ లక్ష్యం సాధిస్తే డీజిల్‌ వాడకం పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా ఇంధన దిగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. దీనివల్ల రైల్వే శాఖకు ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, డీజిల్ వాడకం తగ్గిపోవడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Microfinance loan Eligibility: హామీ లేకుండా లోన్స్.. మైక్రోఫైనాన్స్ లోన్ ఎవరికి ఇస్తారు, RBI రూల్స్ తెలుసా ?
హామీ లేకుండా లోన్స్.. మైక్రోఫైనాన్స్ లోన్ ఎవరికి ఇస్తారు, RBI రూల్స్ తెలుసా ?
Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget