అన్వేషించండి

రైల్వే ప్రైవేటీకరణ, కొత్త పింఛన్ స్కీం రద్దు కోసం పోరాడతాం: ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ

భారత రైల్వేలను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి ప్రభుత్వం పెట్టిందని, రైల్వే కార్మికులను సమావేశ పరిచి వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య తెలియజేశారు.

తిరుపతి : భారత రైల్వే ఈనాడు ప్రపంచ స్ధాయిలో ప్రపంచ అనుగుణంగా దేశానికి సేవలందిస్తూ, 2020 - 2021 ఏడాదిలో 1400 మిలియన్లకు పైగా సరుకు రవాణా చేసి దేశంలోని ప్రతి రాష్ట్రానికి సేవలు అందిస్తూ వస్తోందన్నారు ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య. 17.18 శాతం రైల్వే ఆదాయంను పెంచుకోగలిగాంమని, ఇలా అభివృద్ధి చెందుతున్న భారత రైల్వేలను కేంద్ర ప్రభుత్వం (Indian Government) అమ్మకానికి ప్రభుత్వం పెట్టిందని, మానిటరైజేషన్ పేరుతో, లీజ్ పేరుతో, ప్రైవేటు చేయాలని, ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. దీనిపై నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే 1.3 కోట్ల మంది రైల్వే కార్మికుల (Indian Railway Employees)ను సమావేశ పరిచి, వ్యతిరేకించాలని, పోరాటం చేసి రైల్వేని బతికించుకోవాలని, దేశాన్ని కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మర్రి రాఘవయ్య తెలియజేశారు.

ప్రైవేటీకరణను అడ్డుకోవాలని రైల్వే ఉద్యోగులు ప్రయత్నాలు 
Tirumala News: తిరుమల శ్రీవారిని ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఇండియన్ రైల్వే జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా మర్రి రాఘవయ్య మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే సంక్షేమం కోసం రైల్వే కార్మికులు అంతా కలిసి రావాలని, ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ప్రభుత్వ ఆధీనంలోనే భారత రైల్వే నడిచే విధంగా పోరాటంను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
పాత పింఛన్ స్కీమ్ అమలుచేయాలి
కొత్త పింఛన్ స్కిమ్ ను రద్దు చేయాలనే ప్రతిపాదన ఇద్దరు రైల్వే శాఖా మంత్రులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినా నేటి వరకూ చలనం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్ లో పాత ఫించన్ స్కీంను పునరుద్దరణ చేసే విధంగా 2004వ సంవత్సరం నుండి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, కొత్త రైల్వే ఫింఛన్ స్కీంను రద్దు చేసే విధంగా పోరాటంను ఉధృతం చేస్తామని మర్రి రాఘవయ్య హెచ్చరించారు.

తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం 30-10-2022 రోజున 85,131 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,188 మంది తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, 4.47 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయింది. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Baahubali The Epic OTT : ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Baahubali The Epic OTT : ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
Lalit Modi Video: మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
Razor Movie: 'రేజర్'తో రక్తపాతం... ఈ టైటిల్ గ్లింప్స్‌ పిల్లలు చూడకపోవడం మంచిది - రవిబాబు ఈజ్ బ్యాక్
'రేజర్'తో రక్తపాతం... ఈ టైటిల్ గ్లింప్స్‌ పిల్లలు చూడకపోవడం మంచిది - రవిబాబు ఈజ్ బ్యాక్
ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీల్లో NMC, LFP పేర్లు వింటున్నారా? వీటి మధ్య తేడాలేంటి?
EV బ్యాటరీలో అసలు మ్యాటర్‌ ఏంటి? మిక్సింగ్‌ మారితే పెర్ఫార్మెన్స్‌ ఎలా మారుతుంది?
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
Embed widget