అన్వేషించండి

India Bans Imports From Pakistan: పాకిస్తాన్‌ను భారీ దెబ్బ కొట్టిన భారత్.. పాక్ దిగుమతులపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం

Pahalgam Terror Attack | పాకిస్తాన్‌ను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ఉత్పత్తులను భారత్ లోకి రాకుండా దిగుమతులపై నిషేధం విధించారు.

Pakistan In Big Trouble | న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో దాయాది పాక్ నడ్డి విరిచేదుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి అన్ని దిగుమతులను భారత ప్రభుత్వం నిషేధించింది. జాతీయ భద్రత, పబ్లిక్ పాలసీ దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో ఇకనుంచి పాకిస్తాన్ నుంచి భారత్ ఎలాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోదు. ఒకవేళ ఏదైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. 

పాక్ వస్తువులపై భారత్‌లో నిషేధం

"పాకిస్తాన్‌లో లభించే లేదా తయారయ్యే అన్ని  వస్తువులపై నిషేధం విధిస్తున్నాం. ఇకనుంచి పాకిస్తాన్ నుంచి భారత్ ఎలాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోదు. ప్రత్యక్షంగా, పరోక్షంగానూ పాక్ నుంచి ఎలాంటి వస్తువులు భారత్ దిగుమతి చేసుకోదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాక్ వస్తువులపై నిషేధం తక్షణమే అమలులోకి రానుంది. ఉగ్రదాడి ఉద్రికత్తల పరిస్థితుల్లో జాతీయ భద్రత, పబ్లిక్ పాలసీ దృష్ట్యా పాక్ నుంచి ఏ వస్తువులు మన దేశం దిగుమతి చేసుకోకుండా నిషేధం అమల్లోకి వస్తుంది.  ఈ నిషేధం నుంచి ఏమైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి" అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది.

పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఏకైక రోడ్డు, వాణిజ్య మార్గం అయిన వాఘా-అట్టారీ సరిహద్దు ఇప్పటికే మూసివేశారు. పాకిస్తాన్ నౌకలు భారత ఓడరేవులలో నిలపడాన్ని సైతం కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిషేధించింది. దాంతో పాక్ నుంచి ఏ విధంగానూ భారత్‌కు ఎగమతులు జరగకుండా చూడాలని కేంద్రం మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. దాంతో వాణిజ్యం జరగక పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారనుంది. 

పుల్వామా దాడి తరువాత 200 శాతం టారిఫ్ విధించిన భారత్

 పాకిస్తాన్ నుండి భారత్ దిగుమతుల్లో ప్రధానంగా పండ్లు, నూనెగింజలు, ఔషధ ఉత్పత్తులు, రాక్ సాల్ట్, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. 2019 పుల్వామా దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ ఉత్పత్తులపై 200 శాతం టారిఫ్ విధించడంతో పాక్ నుంచి దిగుమతులు తగ్గాయి. 2024-25లో మొత్తం దిగుమతుల్లో పాక్ నుంచి 0.0001 శాతం కంటే తక్కువగా ఉన్నాయని నివేదికలు వెల్లడించాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థల నుంచి సైతం ఎలాంటి రుణాలు రాకుండా చేయాలని భావిస్తోంది భారత ప్రభుత్వం.

పాక్ నుంచి దిగుమతులపై పూర్తి స్థాయిలో భారత్  నిషేధం విధించడం ఆ దేశానికి ఆర్థికంగా భారీ నష్టమే. 2023-24లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య   రూ. 3,886.53 కోట్ల బిజినెస్ జరిగింది. గత 5 సంవత్సరాలలో ఇదే అత్యధికం. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ వస్తువులపై కేంద్రం 200 శాతం విధించడంతో పాక్ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్ లోయలో మైదానంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నేపాల్ పర్యాటకుడు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో పాక్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేలా భారత్ నిర్ణయాలు తీసుకుంటోంది. భారత్ నుంచి వారికి ఎలాంటి సాయం అందకుండా ఒక్కో విభాగంలో చర్యలు తీసుకుంటూ అష్టదిగ్బంధం చేస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget