అన్వేషించండి

India US Trade Talks: భారత్​–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు వాయిదా! అదనపు సుంకాలపై ఉత్కంఠ

ఆగస్టు 25 నుంచి 29 తేదీ వరకు జరగనున్న భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై తదుపరి రౌండ్ చర్చలు వాయిదా పడే అవకాశం ఉంది.

India-US Trade Talks Delayed: ఆగస్టు 25 నుంచి 29 తేదీ వరకు జరగనున్న భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై తదుపరి రౌండ్ చర్చలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ విషయం ఓ అధికారి జాతీయ మీడియా సంస్థ పీటీఐకి వెల్లడించారు. అమెరికా ప్రతినిధి బృందం తన భారత పర్యటనను వాయిదా వేసినట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకునే లక్ష్యంతో ఐదు ముందస్తు రౌండ్ల తర్వాత ఈ ఆరో రౌండ్ చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల భారతీయ వస్తువులపై అమెరికా అధిక సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

50 శాతం పెరిగిన సుంకాలు
అమెరికా పెంచిన సుంకాలు ఆగస్టు 7 నుండి అమల్లోకి వచ్చాయి. దీనికితోడు రష్యా నుంచి ముడిచమురు, సైనిక పరికరాలు కొనుగోలు చేసినందుకు భారత్​పై గుర్రుమన్న అగ్రదేశం అదనంగా మరో 25 శాతం లెవీ విధించింది. ఈ సుంకం ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు సుంకాలతో  భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి పెరిగాయి.

500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో.. 
2025 ఏప్రిల్, జూలై మధ్య అమెరికాకు భారత ఎగుమతులు 21.64 శాతం పెరిగి 33.53 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు 12.33 శాతం పెరిగి 17.41 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ద్వారా వెల్లడవుతోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం USD 12.56 బిలియన్ డాలర్లు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని USD 500 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని భావిస్తున్నాయి.

అమెరికా డిమాండ్లకు తలొగ్గని భారత్​
ఇదిలా ఉంటే.. వ్యవసాయం మరియు పాడి పరిశ్రమ వంటి రాజకీయంగా సున్నితమైన రంగాల్లో తమకు సానుకూలంగా వ్యవహరించాలని భారత్​పై అమెరికా ఒత్తిడి చేసింది. కానీ భారత ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. లెవీలు తగ్గిస్తే సన్నకారు రైతులు, పశువుల పెంపకందారుల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని అగ్రరాజ్యానికి స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహానికి లోనైన అమెరికా భారత్​పై సుంకాల భారం మోపుతోంది. 

స్వదేశీ’  ఉత్పత్తులపై తిరిగి దృష్టి పెట్టాలి
అమెరికా కొత్త సుంకాలను ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశీయ పరిశ్రమలు మరియు రైతులకు మద్దతిస్తామని నొక్కి చెప్పారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ఈ అంశంపై స్పందించారు. ‘స్వదేశీ’  ఉత్పత్తులపై తిరిగి దృష్టి పెట్టాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులు, మత్స్యకారులు, పశువుల పెంపకందారుల సంక్షేమంపై భారత్​ రాజీపడదని పునరుద్ఘాటించారు.

ఎలాంటి రాజీని అంగీకరించబోం..
‘భారత్​లోని రైతులు, మత్స్యకారులు, పశువుల పెంపకందారులకు సంబంధించి వారి ఉపాధికి గండికొట్టే హానికరమైన విధానానికి వ్యతిరేకంగా మోదీ గోడలా నిలబడుతున్నారు. మా రైతుల విషయంలో ఎలాంటి రాజీని అంగీకరించబోం’ అని వెల్లడించారు. అయితే భారత్​–అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ.. ఇప్పుడు జరిగే ద్వైపాక్షిక చర్చలు సానుకూలంగా కనిపిస్తున్నాయి.

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. పలు అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగైతే అవి భారత్​పై అమెరికా వాణిజ్య ఆంక్షలను ప్రభావితం చేయవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Who is Rinkoo Singh Rahee: అవినీతిపై పోరాటమే ఆ ఐఏఎస్ చేసిన పాపం - రింకూ సింగ్ రాహీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
అవినీతిపై పోరాటమే ఆ ఐఏఎస్ చేసిన పాపం - రింకూ సింగ్ రాహీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
West Bengal Latest News:పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Railwaykoduru Crime News: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
Perni Nani Fire: కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నీ అంతు చూస్తా - మచిలీపట్నం అధికారికి పేర్ని నాని వార్నింగ్ - అసలేం జరిగిందంటే?
కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నీ అంతు చూస్తా - మచిలీపట్నం అధికారికి పేర్ని నాని వార్నింగ్ - అసలేం జరిగిందంటే?
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Embed widget