అన్వేషించండి

India US Trade Talks: భారత్​–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు వాయిదా! అదనపు సుంకాలపై ఉత్కంఠ

ఆగస్టు 25 నుంచి 29 తేదీ వరకు జరగనున్న భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై తదుపరి రౌండ్ చర్చలు వాయిదా పడే అవకాశం ఉంది.

India-US Trade Talks Delayed: ఆగస్టు 25 నుంచి 29 తేదీ వరకు జరగనున్న భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై తదుపరి రౌండ్ చర్చలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ విషయం ఓ అధికారి జాతీయ మీడియా సంస్థ పీటీఐకి వెల్లడించారు. అమెరికా ప్రతినిధి బృందం తన భారత పర్యటనను వాయిదా వేసినట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకునే లక్ష్యంతో ఐదు ముందస్తు రౌండ్ల తర్వాత ఈ ఆరో రౌండ్ చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల భారతీయ వస్తువులపై అమెరికా అధిక సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

50 శాతం పెరిగిన సుంకాలు
అమెరికా పెంచిన సుంకాలు ఆగస్టు 7 నుండి అమల్లోకి వచ్చాయి. దీనికితోడు రష్యా నుంచి ముడిచమురు, సైనిక పరికరాలు కొనుగోలు చేసినందుకు భారత్​పై గుర్రుమన్న అగ్రదేశం అదనంగా మరో 25 శాతం లెవీ విధించింది. ఈ సుంకం ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు సుంకాలతో  భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు 50 శాతానికి పెరిగాయి.

500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో.. 
2025 ఏప్రిల్, జూలై మధ్య అమెరికాకు భారత ఎగుమతులు 21.64 శాతం పెరిగి 33.53 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు 12.33 శాతం పెరిగి 17.41 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ద్వారా వెల్లడవుతోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం USD 12.56 బిలియన్ డాలర్లు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని USD 500 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని భావిస్తున్నాయి.

అమెరికా డిమాండ్లకు తలొగ్గని భారత్​
ఇదిలా ఉంటే.. వ్యవసాయం మరియు పాడి పరిశ్రమ వంటి రాజకీయంగా సున్నితమైన రంగాల్లో తమకు సానుకూలంగా వ్యవహరించాలని భారత్​పై అమెరికా ఒత్తిడి చేసింది. కానీ భారత ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. లెవీలు తగ్గిస్తే సన్నకారు రైతులు, పశువుల పెంపకందారుల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని అగ్రరాజ్యానికి స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహానికి లోనైన అమెరికా భారత్​పై సుంకాల భారం మోపుతోంది. 

స్వదేశీ’  ఉత్పత్తులపై తిరిగి దృష్టి పెట్టాలి
అమెరికా కొత్త సుంకాలను ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశీయ పరిశ్రమలు మరియు రైతులకు మద్దతిస్తామని నొక్కి చెప్పారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ఈ అంశంపై స్పందించారు. ‘స్వదేశీ’  ఉత్పత్తులపై తిరిగి దృష్టి పెట్టాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులు, మత్స్యకారులు, పశువుల పెంపకందారుల సంక్షేమంపై భారత్​ రాజీపడదని పునరుద్ఘాటించారు.

ఎలాంటి రాజీని అంగీకరించబోం..
‘భారత్​లోని రైతులు, మత్స్యకారులు, పశువుల పెంపకందారులకు సంబంధించి వారి ఉపాధికి గండికొట్టే హానికరమైన విధానానికి వ్యతిరేకంగా మోదీ గోడలా నిలబడుతున్నారు. మా రైతుల విషయంలో ఎలాంటి రాజీని అంగీకరించబోం’ అని వెల్లడించారు. అయితే భారత్​–అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ.. ఇప్పుడు జరిగే ద్వైపాక్షిక చర్చలు సానుకూలంగా కనిపిస్తున్నాయి.

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. పలు అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగైతే అవి భారత్​పై అమెరికా వాణిజ్య ఆంక్షలను ప్రభావితం చేయవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget