అన్వేషించండి

India Suspends Postal Services: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. అమెరికాకు పోస్టల్ సర్వీసును నిలిపిసిన భారత్

US Tariffs on India | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై భారత్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అమెరికాకు పోస్టల్ సర్వీస్ బంద్ చేస్తున్నామని తెలిపింది.

Trump Tariffs on India | న్యూఢిల్లీ: అమెరికాతో సుంకాల సమస్యల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25వ తేదీ నుండి అమెరికాకు పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు భారత పోస్టల్ శాఖ (India Post Office) ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక కారణం అమెరికా కస్టమ్స్ నిబంధనల్లో చేసిన తాజా మార్పులేనని స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం జూలై 30న కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 800 డాలర్ల లోపు విలువ కలిగిన వస్తువులు అమెరికాకు కస్టమ్స్ డ్యూటీ (Customs Duty) లేకుండా పంపేవారు. అయితే, ఆ మినహాయింపును ఇప్పుడు రద్దు చేశారు. దీంతో ఆగస్టు 29 నుండి అమెరికాకు వెళ్లే ప్రతి వస్తువుపై కస్టమ్స్ డ్యూటీ తప్పనిసరి కానుంది. డాక్యుమెంట్లు, 100 డాలర్ల లోపు విలువగల గిఫ్ట్‌లకు మాత్రం మినహాయింపు కొనసాగిస్తారు.

ఈ కొత్త నిబంధనలు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకానమీ పవర్స్ యాక్ట్ (IEEPA) కింద అమలు అవుతాయి. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఇప్పటికే ఆగస్టు 15న ట్రాన్స్‌పోర్ట్ క్యారియర్లు, క్వాలిఫైడ్ పార్టీలకు ఈ మార్పులపై ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా, ఇకపై అంతర్జాతీయ పోస్టల్ షిప్‌మెంట్‌లపై సుంకం చెల్లించక తప్పదు.

అమెరికాకు వీలైనంత త్వరగా పూర్తి స్థాయి సేవలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పోస్టల్ విభాగం తెలిపింది. PIB ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తామని, సిబిపి-యుఎస్‌పిఎస్ నుంచి సూచనలు అందిన వెంటనే నిలిపివేసిన కార్యకలాపాలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని పోస్టల్ విభాగం స్పష్టం చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Embed widget