News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Independence Day 2023: ఎర్రకోటపై పదోసారి జాతీయ జెండా ఆవిష్కరించిన మోదీ- ఇంతకీ ఎక్కువ సార్లు ఎగురవేసిన ప్రధాని ఎవరు?

Independence Day 2023: 15 ఆగస్టు 1947న ఎర్రకోటపై తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 17 ఏళ్ల పాటు నిరంతరాయంగా జెండాను ఎగురవేశారు

FOLLOW US: 
Share:

Independence Day 2023: దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 15 ఆగస్టు 1947న దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తొలిసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ప్రధాని ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదోసారి ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. పదేళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న నాలుగో ప్రధాని మోదీగా రికార్డుల్లోకి ఎక్కారు. 

ఉదయం 7.30 గంటలకు ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో సాయుధ బలగాలు, ఢిల్లీ పోలీసులు ప్రధానికి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వనున్నారు. ప్రధాని ప్రసంగం తర్వాత జాతీయ గీతం ఆలాపన ఉంటుంది. తర్వాత 21 గన్ సెల్యూట్ చేస్తారు. వేడుక ముగిశాక జెండా రంగుల్లో ఉండే బెలూన్లను ఆకాశంలోకి వదులుతారు. 

స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరేసిన ఘనత మొదటి ప్రధాని అయిన నెహ్రూకి ఇంది. తర్వాత స్థానం ఆయన కుమార్తె, మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉంది. జవహర్ లాల్ నెహ్రూ 17 సార్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధానుల జాబితా ఓ సారి చూద్దాం. 

దేశానికి తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ 15 ఆగస్టు 1947న ఎర్రకోటపై తొలిసారి జెండాను ఎగురవేశారు. 27 మే 1964 వరకు దాదాపు 18 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా పనిచేసిన ఆయన స్వాతంత్య్ర దినోత్సవం రోజున 17 సార్లు జెండాను ఎగురవేశారు. అత్యధిక సార్లు జెండా ఎగురవేసిన ప్రధానుల జాబితాలో జవహర్ లాల్ నెహ్రూ అగ్రస్థానంలో ఉన్నారు.

ఇందిరాగాంధీకి రెండో స్థానం దక్కతుంది. ఇందిరాగాంధీ 16 సార్లు జెండాను ఎగురవేశారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు, 14 జనవరి 1980 నుంచి 31 అక్టోబర్ 1984 వరకు ప్రధానిగా పనిచేశారు. ఎర్రకోటపై జెండాను ఎగరేశారు. 

మన్మోహన్ సింగ్ వరుసగా పదేళ్లు దేశ ప్రధానిగా పనిచేశారు. 10 మే 22 నుంచి 2004 మే 26 వరకు 2014 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. 2014 మే10న తొలిసారి ప్రధాని అయ్యారు.

Published at : 15 Aug 2023 08:33 AM (IST) Tags: PM Narendra Modi Manmohan Singh indira gandhi Jawahar Lal Nehru Independence Day 2023

ఇవి కూడా చూడండి

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

జమిలి సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు టైమ్ లైన్ లేదు-లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిజ్‌ రితురాజ్‌ అవస్తీ

జమిలి సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపకల్పనకు టైమ్ లైన్ లేదు-లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిజ్‌ రితురాజ్‌ అవస్తీ

Gold-Silver Price 28 September 2023: పసిడిలో భారీ పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 28 September 2023: పసిడిలో భారీ పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

టాప్ స్టోరీస్

TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

TS Cabinet Agenda :  ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

Hyderabad: ఔటర్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే? 

Hyderabad: ఔటర్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే?