అన్వేషించండి

Fact Check: రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక, అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారా? ట్విస్ట్ ఏంటంటే!

Rahul Gandhi In Ayodhya: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ లోక్ సభ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అయోధ్యకు వెళ్లి బాలరాముడ్ని దర్శించుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

క్లెయిమ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈసారి పోటీ చేస్తున్న రాయ్ బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశాక, అయోధ్యకు వెళ్లి రాముడ్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో ప్రజలు మోదీ మోదీ అని గట్టిగా నినాదాలు చేశారు. 

ఫ్యాక్ట్(వాస్తవం): ఫిబ్రవరి 2024లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో జార్ఖండ్‌లోని డియోఘర్‌లోని బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేసినప్పుడు తీసిన వీడియోలను తాజాగా షేర్ చేస్తున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోగా.. ప్రజలు మోదీ మోదీ అని నినాదాలు చేసినట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత రెండు దశాబ్దాల నుంచి ఆయన తల్లి సోనియా గాంధీ పోటీ చేస్తున్న  రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం ఈ ఎన్నికల బరిలోకి రాహుల్ దిగుతున్నారు. మే 3న నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రాహుల్ బ్రాహ్మణుడిగా మారిపోయారని నెటిజన్లు ఎద్దేవా చేశారు.

Fact Check: రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక, అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారా? ట్విస్ట్ ఏంటంటే!

లోక్‌సభ మూడో దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 5 (ఆదివారం) అయోధ్యలోని బాలరాముడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ప్రధాని మోదీ 2 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. వైరల్ ట్వీట్ ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు. 
Fact Check: రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక, అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారా? ట్విస్ట్ ఏంటంటే!

న్యూస్‌ చెకర్ దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేయగా.. రాహుల్ గాంధీ ఇటీవల ఏ ఆలయాన్ని దర్శించుకున్నట్లు ప్రముఖ వార్తా సంస్థలు రిపోర్ట్ చేసినట్లు వార్త కనిపించలేదు. దీనిపై రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా (ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ) ఫిబ్రవరి 3, 2024న గుజరాత్ బీజేపీ అధికారిక ఖాతా ద్వారా అప్‌లోడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ కనిపించింది. దేవగఢ్ లో బాబా వైద్యనాథ్ ధామంలో రాహుల్ గాంధీని చూసిన భక్తులు మోదీ మోదీ అని నినాదాలు చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BJP Gujarat (@bjp4gujarat)

మరిన్ని కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా 3, 4 ఫిబ్రవరి 2024లో వార్తలు కనిపించాయి. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ జార్ఖండ్‌లోని దేవఘర్‌లోని బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేశారని ప్రముఖ మీడియా సంస్థలు వార్తలు ఇచ్చాయి. 
Fact Check: రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక, అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారా? ట్విస్ట్ ఏంటంటే!

‘కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 2న జార్ఖండ్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 3న గులాబీ రంగు ధోతీ, నుదుటిపైన గంధంతో రాహుల్ గాంధీ ప్రసిద్ధ జ్యోతిర్లింగంలో ఒకటైన బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేశారు. కొందరు రాహుల్ గాంధీ జిందాబాద్ అని నినాదాలు చేశారు, కానీ వెంటనే ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేశారని  ఫిబ్రవరి 3, 2024న టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.

Fact Check: రాహుల్ గాంధీ నామినేషన్ వేశాక, అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారా? ట్విస్ట్ ఏంటంటే!

రాయ్‌బరేలీ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం రాహుల్ అయోధ్యకు వెళ్లలేదని ఆ వైరల్ వీడియో అయోధ్యలో రాహుల్ గాంధీ కాదని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ నేతలు నామినేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ వెంట వచ్చారు.

భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ జార్ఖండ్ లోని దియోగఢ్‌లోని బాబా బైద్యనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేస్తున్న వీడియోను.. రాయ్ బరేలి నుంచి నామినేషన్ తరువాత అయోధ్యకు వెళ్లి పూజలు చేశాడని దుష్ప్రచారం చేస్తున్నారు.

This story was originally published by Newschecker, as part of the Shakti Collective. This story has been translated by ABP Desam staff.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget