అన్వేషించండి

Bihar Election 2025: బిహార్ శాసన సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు-గేమ్ ఛేంజర్‌లుగా బీసీ ఓటర్లు

Bihar Election 2025: బిహార్ జనాభాలో 63% మంది ఓబీసీలు ఉన్నారు. వీరిలో అత్యంత వెనుకబడిన ఈబీసీలు 36% మంది. కాగా, బీసీలు 27% మంది. ఎస్సీలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68%.

Bihar Election 2025: బిహార్ శాసన సభ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 22తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా నవంబర్‌లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. 2020లో జరిగిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ మూడు దశల్లో నిర్వహించింది. ఈ దఫా రెండు దశల్లోనే నిర్వహించాలన్న యోచనలోనూ ఉంది. దీపావళి, ఛత్ పూజ వంటి పండుగలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను ఖరారు చేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 243 శాసన సభ స్థానాల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు.

ఎన్నికల సేవలు అందించేందుకు కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్

నకిలీ ఓటర్ ఐడీల తొలగింపునకు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ప్రస్తుతం ఓటర్ స్లిప్పులు, సీరియల్ నెంబర్లు, ఓటర్ల జాబితాలో పార్ట్ నంబర్లు ముద్రించడం వంటి పనులు చేపడుతున్నారు. ఎన్నికల సేవలకు సంబంధించి 40కి పైగా యాప్‌లను ఒకే డిజిటల్ వేదికగా ఏకీకరణ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ECI 'ECInet' అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఎన్నికల కమిషన్ బిహార్ ఎన్నికల్లో ప్రవేశపెడుతోంది. ఈ వెబ్‌సైట్‌లో పార్టీ అభ్యర్థుల పూర్తి వివరాలు, ఓటర్లు అందించే సేవలు, ఎన్నికల ఫలితాలను చూసే అవకాశం కల్పిస్తోంది. క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ అధికారులకు, సిబ్బందికి, పార్టీల కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ఏఐ ద్వారా రూపొందించే ప్రచార సామగ్రి, డీప్‌ఫేక్ వినియోగం వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది.

బిహార్ ఓటర్లు 8 కోట్లకు పైగానే...

2020లో జరిగిన బిహార్ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 7.29 కోట్లు. దాదాపు 78 లక్షలు నాడు తొలిసారిగా ఓటు వేసినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. 2025 ఎన్నికల్లో బిహార్ జనాభా దాదాపు 13 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా. దాదాపు 8కోట్లకుపైగా ఓటర్ల సంఖ్య ఉండవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. పూర్తి లెక్కలు ప్రకటించాల్సి ఉంది.

బిహార్లో మహిళా ఓటర్లే కీలక శక్తి

గత కొన్ని ఎన్నికల సరళిని గమనిస్తే క్రమక్రమంగా మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది ఆ రాష్ట్ర మహిళా చైతన్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. 2024 ఎన్నికల గణాంకాలు చూస్తే మనం ఇది గమనించవచ్చు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పురుషుల పోలింగ్ శాతం 53% కాగా, మహిళల పోలింగ్ శాతం 59.45% గా నమోదు కావడం విశేషం.

బిహార్ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్స్ బీసీలే

ఈ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహాలు రూపొందించుకోవడానికి ఆయా రాజకీయ పార్టీలకు కీలకం ఆ రాష్ట్రంలోని కుల సమీకరణాలు. ఆ సామాజిక ఓటర్లను దృష్టిలో పెట్టుకునే అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ వ్యూహాలను, మేనిఫెస్టోలను రూపొందించుకుంటాయి. బిహార్‌లో ఇటీవలే జరిగిన కులగణన ప్రకారం బీసీ జనాభానే అధికం. బిహార్ జనాభాలో 63% మంది ఓబీసీలు ఉన్నారు. వీరిలో అత్యంత వెనుకబడిన ఈబీసీలు 36% మంది. కాగా, బీసీలు 27% మంది. ఎస్సీలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68%. ఇక అగ్రకులాల వారు 15.52% మంది ఉన్నారు. వీరిలో బ్రాహ్మణులు 3.66%, రాజపుత్రులు 3.45%, భూమిహార్లు 2.86%, కాయస్థులు 0.60% ఉన్నారు. ఇక బీహార్‌లో ముస్లింలు 17.7% ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఓబీసీల్లో అతి పెద్ద సామాజిక వర్గం యాదవులు. వీరు 14.27% ఉన్నారు. ఆ తర్వాత కుర్మీలు 2.87%, ఎస్సీల్లో ఉన్న ముసాహార్లు 3% మంది ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget