అన్వేషించండి

Bihar Election 2025: బిహార్ శాసన సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు-గేమ్ ఛేంజర్‌లుగా బీసీ ఓటర్లు

Bihar Election 2025: బిహార్ జనాభాలో 63% మంది ఓబీసీలు ఉన్నారు. వీరిలో అత్యంత వెనుకబడిన ఈబీసీలు 36% మంది. కాగా, బీసీలు 27% మంది. ఎస్సీలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68%.

Bihar Election 2025: బిహార్ శాసన సభ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 22తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా నవంబర్‌లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. 2020లో జరిగిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ మూడు దశల్లో నిర్వహించింది. ఈ దఫా రెండు దశల్లోనే నిర్వహించాలన్న యోచనలోనూ ఉంది. దీపావళి, ఛత్ పూజ వంటి పండుగలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను ఖరారు చేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 243 శాసన సభ స్థానాల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు.

ఎన్నికల సేవలు అందించేందుకు కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్

నకిలీ ఓటర్ ఐడీల తొలగింపునకు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ప్రస్తుతం ఓటర్ స్లిప్పులు, సీరియల్ నెంబర్లు, ఓటర్ల జాబితాలో పార్ట్ నంబర్లు ముద్రించడం వంటి పనులు చేపడుతున్నారు. ఎన్నికల సేవలకు సంబంధించి 40కి పైగా యాప్‌లను ఒకే డిజిటల్ వేదికగా ఏకీకరణ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ECI 'ECInet' అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఎన్నికల కమిషన్ బిహార్ ఎన్నికల్లో ప్రవేశపెడుతోంది. ఈ వెబ్‌సైట్‌లో పార్టీ అభ్యర్థుల పూర్తి వివరాలు, ఓటర్లు అందించే సేవలు, ఎన్నికల ఫలితాలను చూసే అవకాశం కల్పిస్తోంది. క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ అధికారులకు, సిబ్బందికి, పార్టీల కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ఏఐ ద్వారా రూపొందించే ప్రచార సామగ్రి, డీప్‌ఫేక్ వినియోగం వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది.

బిహార్ ఓటర్లు 8 కోట్లకు పైగానే...

2020లో జరిగిన బిహార్ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 7.29 కోట్లు. దాదాపు 78 లక్షలు నాడు తొలిసారిగా ఓటు వేసినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. 2025 ఎన్నికల్లో బిహార్ జనాభా దాదాపు 13 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా. దాదాపు 8కోట్లకుపైగా ఓటర్ల సంఖ్య ఉండవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. పూర్తి లెక్కలు ప్రకటించాల్సి ఉంది.

బిహార్లో మహిళా ఓటర్లే కీలక శక్తి

గత కొన్ని ఎన్నికల సరళిని గమనిస్తే క్రమక్రమంగా మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది ఆ రాష్ట్ర మహిళా చైతన్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. 2024 ఎన్నికల గణాంకాలు చూస్తే మనం ఇది గమనించవచ్చు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పురుషుల పోలింగ్ శాతం 53% కాగా, మహిళల పోలింగ్ శాతం 59.45% గా నమోదు కావడం విశేషం.

బిహార్ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్స్ బీసీలే

ఈ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహాలు రూపొందించుకోవడానికి ఆయా రాజకీయ పార్టీలకు కీలకం ఆ రాష్ట్రంలోని కుల సమీకరణాలు. ఆ సామాజిక ఓటర్లను దృష్టిలో పెట్టుకునే అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ వ్యూహాలను, మేనిఫెస్టోలను రూపొందించుకుంటాయి. బిహార్‌లో ఇటీవలే జరిగిన కులగణన ప్రకారం బీసీ జనాభానే అధికం. బిహార్ జనాభాలో 63% మంది ఓబీసీలు ఉన్నారు. వీరిలో అత్యంత వెనుకబడిన ఈబీసీలు 36% మంది. కాగా, బీసీలు 27% మంది. ఎస్సీలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68%. ఇక అగ్రకులాల వారు 15.52% మంది ఉన్నారు. వీరిలో బ్రాహ్మణులు 3.66%, రాజపుత్రులు 3.45%, భూమిహార్లు 2.86%, కాయస్థులు 0.60% ఉన్నారు. ఇక బీహార్‌లో ముస్లింలు 17.7% ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఓబీసీల్లో అతి పెద్ద సామాజిక వర్గం యాదవులు. వీరు 14.27% ఉన్నారు. ఆ తర్వాత కుర్మీలు 2.87%, ఎస్సీల్లో ఉన్న ముసాహార్లు 3% మంది ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Priyanka Gandhi Parliament Speech: వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
వారేమైనా తీవ్రవాదులా? - లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ
CM Vijay Office Shifted: ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!
ఆరు దశాబ్దాల సాంప్రదాయానికి బ్రేక్ - నూతన భవనంలోకి మారనున్న తమిళనాడు సీఎం విజయ్ ఆఫీస్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget