అన్వేషించండి

Bihar Election 2025: బిహార్ శాసన సభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు-గేమ్ ఛేంజర్‌లుగా బీసీ ఓటర్లు

Bihar Election 2025: బిహార్ జనాభాలో 63% మంది ఓబీసీలు ఉన్నారు. వీరిలో అత్యంత వెనుకబడిన ఈబీసీలు 36% మంది. కాగా, బీసీలు 27% మంది. ఎస్సీలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68%.

Bihar Election 2025: బిహార్ శాసన సభ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 22తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా నవంబర్‌లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. 2020లో జరిగిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ మూడు దశల్లో నిర్వహించింది. ఈ దఫా రెండు దశల్లోనే నిర్వహించాలన్న యోచనలోనూ ఉంది. దీపావళి, ఛత్ పూజ వంటి పండుగలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను ఖరారు చేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 243 శాసన సభ స్థానాల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు.

ఎన్నికల సేవలు అందించేందుకు కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్

నకిలీ ఓటర్ ఐడీల తొలగింపునకు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ప్రస్తుతం ఓటర్ స్లిప్పులు, సీరియల్ నెంబర్లు, ఓటర్ల జాబితాలో పార్ట్ నంబర్లు ముద్రించడం వంటి పనులు చేపడుతున్నారు. ఎన్నికల సేవలకు సంబంధించి 40కి పైగా యాప్‌లను ఒకే డిజిటల్ వేదికగా ఏకీకరణ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ECI 'ECInet' అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఎన్నికల కమిషన్ బిహార్ ఎన్నికల్లో ప్రవేశపెడుతోంది. ఈ వెబ్‌సైట్‌లో పార్టీ అభ్యర్థుల పూర్తి వివరాలు, ఓటర్లు అందించే సేవలు, ఎన్నికల ఫలితాలను చూసే అవకాశం కల్పిస్తోంది. క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ అధికారులకు, సిబ్బందికి, పార్టీల కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ఏఐ ద్వారా రూపొందించే ప్రచార సామగ్రి, డీప్‌ఫేక్ వినియోగం వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది.

బిహార్ ఓటర్లు 8 కోట్లకు పైగానే...

2020లో జరిగిన బిహార్ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 7.29 కోట్లు. దాదాపు 78 లక్షలు నాడు తొలిసారిగా ఓటు వేసినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. 2025 ఎన్నికల్లో బిహార్ జనాభా దాదాపు 13 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా. దాదాపు 8కోట్లకుపైగా ఓటర్ల సంఖ్య ఉండవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. పూర్తి లెక్కలు ప్రకటించాల్సి ఉంది.

బిహార్లో మహిళా ఓటర్లే కీలక శక్తి

గత కొన్ని ఎన్నికల సరళిని గమనిస్తే క్రమక్రమంగా మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది ఆ రాష్ట్ర మహిళా చైతన్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. 2024 ఎన్నికల గణాంకాలు చూస్తే మనం ఇది గమనించవచ్చు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పురుషుల పోలింగ్ శాతం 53% కాగా, మహిళల పోలింగ్ శాతం 59.45% గా నమోదు కావడం విశేషం.

బిహార్ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్స్ బీసీలే

ఈ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహాలు రూపొందించుకోవడానికి ఆయా రాజకీయ పార్టీలకు కీలకం ఆ రాష్ట్రంలోని కుల సమీకరణాలు. ఆ సామాజిక ఓటర్లను దృష్టిలో పెట్టుకునే అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ వ్యూహాలను, మేనిఫెస్టోలను రూపొందించుకుంటాయి. బిహార్‌లో ఇటీవలే జరిగిన కులగణన ప్రకారం బీసీ జనాభానే అధికం. బిహార్ జనాభాలో 63% మంది ఓబీసీలు ఉన్నారు. వీరిలో అత్యంత వెనుకబడిన ఈబీసీలు 36% మంది. కాగా, బీసీలు 27% మంది. ఎస్సీలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68%. ఇక అగ్రకులాల వారు 15.52% మంది ఉన్నారు. వీరిలో బ్రాహ్మణులు 3.66%, రాజపుత్రులు 3.45%, భూమిహార్లు 2.86%, కాయస్థులు 0.60% ఉన్నారు. ఇక బీహార్‌లో ముస్లింలు 17.7% ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఓబీసీల్లో అతి పెద్ద సామాజిక వర్గం యాదవులు. వీరు 14.27% ఉన్నారు. ఆ తర్వాత కుర్మీలు 2.87%, ఎస్సీల్లో ఉన్న ముసాహార్లు 3% మంది ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget