అన్వేషించండి

Delhi Results: తెలంగాణలో కేసీఆర్‌ను దెబ్బకొట్టినట్లుగానే ఢిల్లీలో కేజ్రీవాల్‌కు మోదీ, అమిత్ షా ద్వయం చెక్

ఆద్మీ పార్టీ బీజేపీని  ఎదుర్కొనే పార్టీగా ఓ దశలో చర్చసాగింది.  అదే చర్చ  ఆ పార్టీని కిందకు లాగి పడేసిందనే చెప్పాలి. మోదీ - అమిత్ షాలు ఏ ప్రాంతీయ పార్టీని ఎదనీయని వ్యూహాలు పన్ని సక్సెస్ అవుతున్నారు

సామాన్యుడి పార్టీగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నాలుగో సారి ఢిల్లీ పీఠం దక్కించుకునే విషయంలో బొక్క బొర్లా పడింది.   జాతీయ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆప్ తీరు చాలా  ఆకర్షించింది. ఢిల్లీ ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రాల్లో  ప్రభుత్వాలు ఏర్పాటు చేసేసరికి బీజేపీని ఎదుర్కొనే పార్టీగా ఓ దశలో చర్చసాగింది.  అదే చర్చ  ఆ పార్టీని కిందకు లాగి పడేసిందనే చెప్పాలి.  జాతీయ రాజకీయాల్లో ఏ ప్రాంతీయ పార్టీ ముందుకు సాగినా మోదీ, అమిత్ షా ద్వయం ముకుతాడు వేసే వ్యూహాలతో ఆ పార్టీని దించి పారేస్తోంది. ఇందుకు భారత రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  

పదేళ్ల పాటు తెలంగాణలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోను అదే రీతిలో తన ప్రభావం చూపేందుకు మహారాష్ట్ర వేదికగా  కార్యాచరణ ప్రారంభించారు. అంతే దీన్ని గుర్తించిన మోదీ- అమిత్ షా ద్వయం తెలంగాణ ఎన్నికల్లో  బీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా వ్యూహాలు పన్ని విజయవంతం చేశారన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినా, మూడో దఫా కేసీఆర్ గెలవకుండా బీజేపీ డిఫెన్స్ వ్యూహాన్ని అమలు చేసిందని,  అదే అగ్రేసీవ్ గా బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసి ఉండే  బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలి తిరిగి కేసీఆర్ గద్దె నెక్కే అవకాశం ఉందన్నది వాస్తవమని మీడియా వర్గాలు కూడా చెబుతున్నాయి.  

ఇది గమనించే బీజేపీ దూకుడు తగ్గించేందుకు గాను బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర పీఠం నుండి దింపి, వ్యూహాత్మకంగా కిషన్ రెడ్డికి అప్పగించిందని అదే  కారు కొంప ముంచిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా ఓ ప్రాంతీయ పార్టీ ఎదిగి జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించడం ఇప్పటి కిప్పుడు సాధ్యం కాదన్న పరిస్థితిని మోదీ- అమిత్ షా ద్వయం  సృష్టించారనడంలో సందేహం లేదు.

 ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలు


1.  లిక్కర్ స్కాం -  అవినీతిని నిర్మూలిస్తామన్న హమీతో  ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠం దక్కించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిత్వం ఆ పార్టీ హామీలు  ఢిల్లీ ఓటర్లను ఆకర్షించాయి . అందుకే  రెండు సార్లు  ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. దశాబ్దకాలంగా సాగిన కేజ్రీ వాల్ పాలనకు గండి కొట్టింది లిక్కర్. లిక్కర్ ప్రవాహంలో  ఆ పార్టీ కొట్టుకొని పోయింది.  ఈ స్కాంలో  సీఎం కేజ్రీ వాల్, ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఈ వ్యవహారం ఢిల్లీ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపింది. అవినీతిపై సమరం చేసిన నాయకులే చివరకు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లడం  ఆ పార్టీని నైతికంగా బాగా దెబ్బ తీసింది.  ఈ ఎన్నికల్లో  ఆప్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇది  ఒకటి.


2. హమీల అమలులో వైఫల్యం -  ఢిల్లీ ఓటర్లకు ఆమ్ ఆద్మీ ఇచ్చిన ప్రధాన హామీల్లో వాయు కాలుష్యం తగ్గించడం, యమునా నదిని వందకు వంద శాతం శుద్ది చేస్తామని చెప్పారు. తాని ఈ రెండు హామీలను  కేజ్రీవాల్ సర్కార్ నిలబెట్టుకోలేకపోయింది. సురక్షిత తాగు నీరు నల్లా కనెక్షన్ల ద్వారా అందిస్తానన్న హమీ నిలబెట్టుకోలేకపోయిదంి. అంతే కాకుండా ఢిల్లీ రోడ్లను  యూరోపియన్ దేశాల్లోని రోడ్ల మాదిరి మారుస్తానని హామి ఇచ్చారు. ఇది నిలబెట్టుకోలేకపోయింది.  ఇదే విషయాన్ని ఆప్ సారధి కేజ్రీ వాల్ తన ప్రచాంలోను చెప్పారు. ఈ మూడు హామీలు నిలబెట్టుకోలేకపోయనని చెప్పడం గమనార్హం.  అంతే కాకుండా 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మధ్య తరగతి ఓటర్ పైన ప్రభావం చూపింది.  ఈ కారణాల  ఆమ్ ఆద్మీ పార్టీ  చతికిల పడింది.

3. కాంగ్రెస్ తో వైరం -  ఇండియా కూటమిలో భాగం అయిన ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ ల మధ్య వైషమ్యాలు ఈ ఎన్నికల్లో రెండు పార్టీలను దెబ్బ తీశాయి. కాంగ్రెస్ ఖాతా తెరవకుండా డకౌట్ కాగా  ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని దూరం చేసుకుంది. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో కేజ్రీవాల్ ఒంటరి పోరుకు సిద్దమయ్యారు.  ఇది తప్పని ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.  కాంగ్రెస్ - ఆప్ పార్టీల మధ్య గొడవలు  విజయాన్ని దూరం చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు పడే  ఓట్లకు కాంగ్రెస్ గండి కొట్టంది. దాదాపు 15 నుంచి 20 నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు వెయి నుంచి రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే కాంగ్రెస్ -  ఆప్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి ఇంత సుళువుగా విజయం దక్కేది కాదు. తిరిగి ఆప్ పార్టీనే సర్కార్ ఏర్పాటు చేసే స్థితిలో ఉండేది.

 

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Christmas 2025 : క్రిస్మస్​కి ఇంటిని తక్కువ బడ్జెట్​లో, స్టైలిష్​గా డెకరేట్ చేయాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
క్రిస్మస్​కి ఇంటిని తక్కువ బడ్జెట్​లో, స్టైలిష్​గా డెకరేట్ చేయాలనుకుంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Top 5 Silver Countries: వెండి రారాజు ఎవరు? ప్రపంచంలో సిల్వర్ కెపాసిటీ ఉన్న టాప్ 5 దేశాలివే
వెండి రారాజు ఎవరు? ప్రపంచంలో సిల్వర్ కెపాసిటీ ఉన్న టాప్ 5 దేశాలివే
Embed widget