అన్వేషించండి

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ పీఏను ప్రశ్నించిన ఈడీ, త్వరలో ఏం తేలనుంది ?

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం సెగ ముఖ్యమంత్రిన తాకింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. 

Arvind Kejriwal: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఇప్పటివరకు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ కేసులో దర్యాప్తు ఎదుర్కొంటుండగా.. తాజాగా ఈ సెగ ముఖ్యమంత్రిని తాకింది. ఢిల్లీ మద్యం కేసులో ఉప ముఖ్యమంత్రి సిసోడియా హస్తం ఉన్నట్లు ఆరోపణలు రాగా ఈ కుంభకోణంపై చేపట్టిన విచారణల్లో భాగంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారని తెలిసిందే. ఈడీ, సీబీఐ వేర్వేరుగా విచారమలు జరుపుతున్నాయి. సిసోడియా సన్నిహితుడైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, సమీర్ మహేంద్ర సహా ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఛార్జీషీటు దాఖలు చేసింది. తాజాగా మరోసారి సిసోడియాకు సమన్లు ఇచ్చింది. వచ్చే ఆదివారం ఆయన అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పుడు ఈ కేసులో కేజ్రీవాల్ పీఏను ఈడీ ప్రశ్నించింది. 

మనీశ్ సిసోడియాపై గూఢచర్యం కేసు

లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై గూఢచర్య కేసు పెట్టింది CBI. ఈ కేసు పెట్టేందుకు అనుమతినివ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రిక్వెస్ట్ పెట్టుకోగా.. అందుకు ఆ శాఖ అనుమతినిచ్చింది. అవినీతి నియంత్రణ చట్టం కింద ఈ కేసు నమోదు చేసింది. 2015లో ఆప్ అధికారంలోకి వచ్చిన తరవాత Feedback Unit (FBU)పెట్టినట్టు CBIనిర్ధరించింది. ఢిల్లీలోని విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సిసోడియా చేతుల్లోనే ఉంది. ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డారని ఇటీవలే CBI రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలన్నింటిపైనా రహస్యంగా నిఘా పెట్టారని, గూఢచర్యం చేశారని CBI తేల్చి చెప్పింది. స్వతంత్రంగా పని చేసే సంస్థలపైనా నిఘా పెట్టారని CBI చెబుతోంది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, అందులోని ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారో తెలుసుకునేందుకు 2015లో ఈ ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది ఆప్ సర్కార్. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వెంటనే కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇది ఏర్పాటైంది. ఇందుకోసం రూ.కోటి ఖర్చు చేసింది. 

సిసోడియా ఫైర్..

2016 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే... ఈ యూటిన్‌తో అవినీతికి సంబంధించిన వ్యవహారాలపై నిఘా పెట్టడంతో పాటు రాజకీయ అవసరాలు తీర్చుకునేందుకూ ఉపయోగించారని తీవ్రంగా ఆరోపిస్తోంది CBI.రూ.36 లక్షల మేర ఇందుకోసం ఖర్చు చేసిందనీ చెబుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తోంది. ఆయనతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అందరిపైనా కేసు నమోదు చేసేలా అనుమతినివ్వాలని CBI లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ సక్సేనాను కోరింది. ఆయన ఆమోద ముద్ర వేసి కేంద్ర హోం శాఖకు పంపగా అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఫలితంగా సిసోడియాపై స్నూపింగ్ కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు. దీనిపై సిసోడియా మండిపడుతున్నారు. అత్యంత దారుణం అంటూ ట్వీట్ చేశారు. అబద్ధపు కేసులు తనపై పెడుతున్నారంటూ విమర్శించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ఎదుగుతున్న కొద్ది తమపై ఇలాంటి కేసులూ పెరుగుతాయని అసహనం వ్యక్తం చేశారు సిసోడియా. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
KTR Wishes KCR: నా ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి మా నాన్న హీరో: కేసీఆర్‌కు కేటీఆర్ విషెష్
నా ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి మా నాన్న హీరో: కేసీఆర్‌కు కేటీఆర్ విషెష్
Vicky Kaushal: 'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ విక్కీ కౌశల్!
'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ విక్కీ కౌశల్!
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
KTR Wishes KCR: నా ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి మా నాన్న హీరో: కేసీఆర్‌కు కేటీఆర్ విషెష్
నా ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి మా నాన్న హీరో: కేసీఆర్‌కు కేటీఆర్ విషెష్
Vicky Kaushal: 'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ విక్కీ కౌశల్!
'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ విక్కీ కౌశల్!
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
US Deportation: అమెరికాలోని భారతీయులకు బ్రహ్మాస్త్రం- ట్రంప్‌తో మాట్లాడా, అంతా సెట్ అవుతుందన్న కేఏ పాల్
అమెరికాలోని భారతీయులకు బ్రహ్మాస్త్రం- ట్రంప్‌తో మాట్లాడా, అంతా సెట్ అయిపోతుందన్న కేఏ పాల్
Kedarnath Yatra 2025 : కేదార్​నాథ్ యాత్ర 2025 ప్రారంభ తేది ఇదే.. యాత్ర​ ప్రాముఖ్యత, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే
కేదార్​నాథ్ యాత్ర 2025 ప్రారంభ తేది ఇదే.. యాత్ర​ ప్రాముఖ్యత, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే
Students Protest: అర్ధరాత్రి విద్యార్థినుల బాత్రూమ్‌లోకి తొంగిచూస్తున్నారంటూ నిరసన, ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని పోలీసులు!
అర్ధరాత్రి విద్యార్థినుల బాత్రూమ్‌లోకి తొంగిచూస్తున్నారంటూ నిరసన, ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని పోలీసులు!
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.