అన్వేషించండి

Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది.

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కు చెందిన నార్త్ అవెన్యూ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. అంతకుముందు ఈ కేసులో ఎంపీ సంజయ్ సింగ్ కు సన్నిహితంగా ఉన్న మరికొందరి ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దాఖలై ఛార్జీషీట్ లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. మొదటి నుంచి సంజయ్ సింగ్ పై ఈడీ నజర్ పెట్టినప్పటికీ.. ఇప్పుడు నేరుగా నివాసాల్లో తనిఖీల దాకా వెళ్లడం గమనార్హం. సోదాలపై సంజయ్ సింగ్ తండ్రి స్పందిస్తూ.. డిపార్ట్‌మెంట్ తన పని చేస్తోందని, తాము వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఈ కేసులో సంజయ్ సింగ్ కు క్లీన్ చిట్ వచ్చే వరకు వేచి ఉంటామన్నారు. 

ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్ ను సంజయ్ సింగ్ దగ్గరుండి మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు సమావేశపరిచాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. తాను ఒక కార్యక్రమంలో సంజయ్ సింగ్ ను కలిశానని, ఆ తర్వాత ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతోనూ సంప్రదింపులు జరిపినట్లు అరోరా ఈడీకీ తెలిపారు. అయితే ఇదంతా ఢిల్లీ ఎన్నికలకు ముందు నిధుల సేకరణ కోసం చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతే కాదు.. లిక్కర్ డిపార్ట్‌మెంట్ తో దినేష్ అరోరాకు ఉన్న దీర్ఘకాలిక సమస్యను ఎంపీ సంజయ్ సింగ్ పరిష్కరించారని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలు చేసింది. 

ఎంపీ సంజయ్ సింగ్ అభ్యర్థన మేర దినేష్ అరోరా ఢిల్లీలో పార్టీ నిధుల సేకరణ కోసం రెస్టారెంట్ల యజమానులు రూ. 32 లక్షల చెక్కులను సిసోడియాకు అప్పగించారని ఈడీ పేర్కొంది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో.. సంజయ్ సింగ్ పేరును మాత్రం నిందితుల జాబితాలో ఈడీ చేర్చలేదు. అయితే ఛార్జిషీట్ లో పేరు చేర్చినప్పటికీ.. ఇప్పటిదాకా సమన్లు జారీ చేయడం గానీ, ఆయన స్టేట్‌మెంట్ ను గానీ రికార్డు చేయలేదు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు కుమారుడు మాగుంట రాఘవ అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలుకెళ్లిన మాగుంట రాఘవ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. రాఘవతో పాటు ఈ కేసులో మరో కీలక నిందితుడు దినేష్ అరోరా అప్రూవర్ గా మారడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఇప్పటికే 20 మంది నుంచి కీలక సమాచారం సేకరించింది. మనీష్ సిసోడియా తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ.. మరో ఆప్ నేత సంజయ్ సింగ్ పై ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే.. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్టు చేసింది సీబీఐ. అంతే కాదు ఏప్రిల్ లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget